అన్వేషించండి

Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!

Secunderabad Cantonment Bypoll: తెలంగాణలో ఖాళీగా ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. టీఎన్ వంశా తిలక్‌కు బీజేపీ అవకాశం ఇచ్చింది.

TN Vamsha Tilak-హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉపఎన్నికకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇదివరకే అభ్యర్థుల్ని ప్రకటించాయి. తాజాగా బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. టీఎన్‌ వంశా తిలక్‌ను తమ అభ్యర్థిగా ప్రకటిస్తూ బీజేపీ కేంద్ర కార్యవర్గం మంగళవారం (ఏప్రిల్ 16న) ఓ ప్రకటన విడుదల చేసింది. మే 13న తెలంగానలో లోక్‌సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉపఎన్నికకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్‌ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత గెలుపొందారు. కానీ రోడ్డు ప్రమాదంలో ఆమె చనిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. 

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతి 
కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థిగా నారాయణ శ్రీగణేశ్‌ను ప్రకటించగా.. ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో ఆమె సోదరి నివేదితకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ గత ఇద్దరు ఎమ్మెల్యేలు పదవిలో ఉండగానే చనిపోయారు. మొదట కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో సాయన్న కూతురు లాస్య నివేదిత బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. కానీ రోడ్డు ప్రమాదంలో ఆమె సైతం చనిపోవడంతో ఒకే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా సాయన్న కుటుంబసభ్యులు చనిపోయారు.

తెలంగాణలో ఖాళీగా ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ తో పాటు  ఉత్తరప్రదేశ్‌లోని నాలుగు అసెంబ్లీ ఉపఎన్నికలకు అభ్యర్థులను బీజేపీ తాజాగా ప్రకటించింది. యూపీలోని దద్రౌల్ నుంచి అరవింద్ సింగ్, లక్నో ఈస్ట్ నుంచి ఓ.పి. శ్రీవాస్తవ్, గైంసారి నుంచి శైలేంద్ర సింగ్ శైలు, ఎస్టీ నియోజకవర్గం దుద్ధి నుంచి శ్రావణ్ గౌడ్‌ను బీజేపీ తమ అభ్యర్థులుగా ప్రకటించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్

వీడియోలు

MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన
India vs New Zealand T20 Preview | నేడు భారత్ - న్యూజిలాండ్ మొదటి టీ20
Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
మూడేళ్ల రాజకీయ ప్లాన్ చెప్పేసిన వైఎస్ జగన్! పాదయాత్రపై కూడా కీలక ప్రకటన 
Visakha Utsav: సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
సాగరం నుంచి శిఖరం వరకు- జనవరి 24 నుంచి వైభవంగా విశాఖ ఉత్సవ సంబరాలు
TamilNadu Politics: తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
తమిళనాడు ఎన్డీఏలోకి మరిన్ని పార్టీలు -కూటమిలో దినకరన్ - విజయ్‌కాంత్ పార్టీ కూడా!
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
IND vs NZ 1st ODI: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ లైవ్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. స్టార్ ప్లేయర్ దూరం
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
PF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో అందుబాటులోకి EPFO 3.0 పోర్టల్.. మనీ విత్‌‌డ్రా ఈజీ
FOMO: వేరే వాళ్ల స్టాటస్ చూసి వీళ్లకు సోకులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నారా? అయితే మీరు ఫోమో బాధితులే!
వేరే వాళ్ల స్టాటస్ చూసి వీళ్లకు సోకులు ఎక్కువయ్యాయని అనుకుంటున్నారా? అయితే మీరు ఫోమో బాధితులే!
Sandhya Nama Upasate Trailer : క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
క్వారంటైన్ కలిపింది ఇద్దరినీ - బంధం... భయం... ఎమోషన్... కట్ చేస్తే సంధ్యానామ ఉపాసతే
Embed widget