అన్వేషించండి

Piyush Goyal On CM KCR : బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్పు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సంచలన కామెంట్స్

Piyush Goyal On CM KCR : 2024లో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరును భాగ్యనగరం మార్చేందుకు పరిశీలిస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.

Piyush Goyal On CM KCR : తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడుతామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. హైదరాబాద్ లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసింది. ధాన్యం కొనుగోలుపై గతంలో పీయూష్ గోయల్, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అబద్దాలు చెప్పారని అప్పట్లో టీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. తాజాగా పీయూష్ గోయల్ మరోసారి సీఎం కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. 

తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ 

తెలంగాణలో టీఆర్ఎస్ అవినీతి పాలనకు చరమగీతం పాడుతామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రజల్ని మోసం చేసిందని, వారి ఆకాంక్షలు నెరవేరలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, వారి ఆకాంక్షలు నెరవేరలేదని నిరాశలో ఉన్నారన్నారు. తెలంగా కోసం ప్రాణ త్యాగం చేసిన అమరుల కుటుంబాలకు న్యాయం జరగలేదన్నారు. బీజేపీ కార్యవర్గ భేటీలో తెలంగాణ పరిస్థితులను డీకే అరుణ వివరించారన్నారు. తెలంగాణలో కుటుంబ పాలనకు ముగింపు పలికి బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తంచేశారు.

Also Read: BJP Executive Meeting: బీజేపీ మీటింగ్‌లోకి ఇంటెలిజెన్స్ అధికారి ఎంట్రీ, అవి ఫోటోలు తీస్తుండగా పట్టేసిన నేతలు!

కుటుంబపాలనకు విముక్తి 

తెలంగాణకు దేశంలో నెంబర్ వన్ గా ఎదిగే సామర్థ్యం ఉందని పీయూష్ గోయల్ అన్నారు. కానీ కుటుంబ పాలన వల్ల పరిస్థితులు మారడంలేదన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల కష్టాలు ఇంకా పెరిగాయన్నారు. టీఆర్‌ఎస్‌ అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు.  బీజేపీ తెలంగాణను కుటుంబ పాలన నుంచి విముక్తి చేస్తుందన్నారు. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్నారన్నారు. 

హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తారా? 

హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తారా అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను విలేకరి ప్రశ్నించగా.. ‘2024లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే మంత్రివర్గ సహచరులతో కలిసి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు' అన్నారు.  బీజేపీ సమావేశానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ, దేశవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలంగాణ రాజధానిని భాగ్యనగరంగా పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ పటేల్ ఏక్ భారత్ అనే పదాన్ని భాగ్యనగరంలోనే ఉపయోగించారని ప్రధాని అన్నారు. హైదరాబాద్ భాగ్యనగరమని ప్రధాని మోదీ అన్నారు. ఇది మనందరికీ ఎంతో ముఖ్యమైనదని, సర్దార్ పటేల్ ఏకీకృత భారతదేశానికి పునాదిని నిలబెట్టారని ప్రధాని మోదీ అన్నారని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. ఇప్పుడు దానిని మరింత ముందుకు తీసుకెళ్లడం బీజేపీ బాధ్యత అని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ హైదరాబాద్‌లో ప్రధానిని ఉటంకిస్తూ అన్నారు. హైదరాబాద్‌కు భాగ్యనగర్‌గా పేరు మార్చాలని బీజేపీ సైద్ధాంతిక మూలాధారమైన ఆర్‌ఎస్‌ఎస్‌, పలువురు బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read : BJP Mission South: భాజపాకు సౌత్ ఫోబియా పోయినట్టేనా? మిషన్ సౌత్ ఇండియా ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

Also Read: ప్రధాని మోదీ స్పీచ్‌లో ఇవే హైలైట్ కానున్నాయా, ఆయన ఏం మాట్లాడతారు?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
Pawan Kalyan Pithapuram Tour: పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
Sankranti Special Trains: హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
Balakrishna : ఓ వైపు మూవీస్... మరోవైపు యాడ్స్ - బాలయ్యనా మజాకా...
ఓ వైపు మూవీస్... మరోవైపు యాడ్స్ - బాలయ్యనా మజాకా...

వీడియోలు

MI vs RCB Highlights WPL 2026 | ఉత్కంఠ పోరులో ఆర్సీబీ విక్టరీ
MI vs RCB WPL 2026 Harmanpreet Kaur | తమ ఓటమికి కారణం ఏంటో చెప్పిన కెప్టెన్
Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
Jay Shah about Rohit Sharma | రోహిత్ పై జై షా ప్రశంసలు
Asian Thalassemia Conclave | తలసేమియా గురించి తెలుసుకోకపోవటమే అసలు సమస్య | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
Pawan Kalyan Pithapuram Tour: పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
Sankranti Special Trains: హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్- విజయవాడ మధ్య సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌- టైమింగ్ సహా పూర్తి వివరాలు ఇవే
Balakrishna : ఓ వైపు మూవీస్... మరోవైపు యాడ్స్ - బాలయ్యనా మజాకా...
ఓ వైపు మూవీస్... మరోవైపు యాడ్స్ - బాలయ్యనా మజాకా...
Bangladesh: భారత్‌ను విలన్‌గా చూపుతున్న ఆందోళనకారులు - రోజు గడవాలంటే భారత్ దిగుమతులే దిక్కు - బంగ్లాదేశ్ పరిస్థితి ఇదీ !
భారత్‌ను విలన్‌గా చూపుతున్న ఆందోళనకారులు - రోజు గడవాలంటే భారత్ దిగుమతులే దిక్కు - బంగ్లాదేశ్ పరిస్థితి ఇదీ !
The Raja Saab Box Office Collection Day 1: వంద కోట్లు కంటే ఎక్కువ వచ్చాయ్ - ఫస్ట్ డే కలెక్షన్స్ అనౌన్స్ చేసిన 'రాజా సాబ్' నిర్మాత
వంద కోట్లు కంటే ఎక్కువ వచ్చాయ్ - ఫస్ట్ డే కలెక్షన్స్ అనౌన్స్ చేసిన 'రాజా సాబ్' నిర్మాత
Sankranti Rush: సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
సంక్రాంతికి వెళ్లే జనంతో రోడ్లు జామ్‌-  రైల్వేలు, బస్‌లు, ప్రైవేటు వాహనాలు కిటకిట
Dhandoraa OTT : ఓటీటీలోకి 'దండోరా' - తెలుగుతో పాటు ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి 'దండోరా' - తెలుగుతో పాటు ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget