అన్వేషించండి

Cm Kcr On Modi: మోదీ గుజరాత్ కు మాత్రమే ప్రధాని... ఆర్బిట్రేషన్ సెంటర్ అహ్మదాబాద్ లో పెట్టాలని ఒత్తిడి... సీఎం కేసీఆర్ ఆరోపణ

హైద‌రాబాద్‌లో ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్ ఏర్పాటు చేస్తుంటే ప్రధాని మోదీకి నిద్ర ప‌ట్టడం లేద‌ని సీఎం కేసీఆర్ ఆరోపించారు. మోదీ దేశానికి ప్రధాని కాదు గుజరాత్ ప్రధాని అని విమర్శించారు.

భారత దేశంలో చాలా కురచబుద్ధి ఉన్న ప్రధాని ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. 'ప్రపంచం రోజు రోజుకూ అభివృద్ధి చెందుతుంది. పెద్ద మొత్తం పెట్టుబడులు పెడుతూ వివిధ దేశాల్లో కంపెనీలు పెడుతుంటారు. ఇలాంటి కంపెనీల మధ్య కొన్నిసార్లు వివాదాలు వస్తుంటాయి. ఈ వివాదాలను కోర్టుల బయటతేల్చుకునేందుకు ఆర్బిట్రేషన్ సెంటర్లను ఆశ్రయిస్తారు. అంతర్జాతీయంగా వివిధ దేశాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. మన దేశంలో లోకాయుక్త కూడా అలాంటిదే. వివాదాలను పరిష్కరించుకునేందుకు మన దేశంలో ఇలాంటి సంస్థలు లేవు. అందుకు కంపెనీలు ఇతర దేశాలకు వెళ్తున్నారు. ఇటువంటి సంస్థను భారత ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచనల మేరకు హైదరాబాద్ లో ఏర్పాటు చేశాం' అని సీఎం కేసీఆర్ అన్నారు. 

గుజరాత్ ప్రధాని

హైదరాబాద్ గౌరవాన్ని పెంచేందుకు సీజేఐ సూచనల మేరకు అంతర్జాతీయ స్థాయిలో ఆర్బిట్రేషన్  సెంటర్ ఏర్పాటు చేశామని సీఎం కేసీఆర్ అన్నారు. అందుకు ఓ ప్రైవేట్ భవనాన్ని తీసుకుని రూ.15 కోట్లతో బాగుచేయించామని, ప్రతీ ఏడాది రూ.3 కోట్లు ఇస్తామని ప్రకటించామని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సంస్థకు పర్మినెంట్ స్థలంలో భవనం నిర్మిస్తామన్నారు. ఈ ఆర్బిట్రేషన్ సెంటర్ పై ప్రధాని మోదీ హైదరాబాద్ లో ఎందుకు పెట్టారు అహ్మదాబాద్ పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ కు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ వచ్చినందుకు ప్రధాని మోదీకి నిద్రపట్టడంలేదని సీఎం కేసీఆర్ ఆరోపించారు. మోదీ దేశానికి ప్రధాని కాదు గుజరాత్ ప్రధాని ఆరోపించారు. చాలా బాధతో ఈ మాట చెప్తున్నామన్నారు. ఈ ఆర్బిట్రేషన్ సెంటర్ కు పోటీగా గిఫ్ట్ సిటీలో పెడతామని బడ్జెట్ లో పెట్టారని సీఎం ఆరోపించారు. 

ఆర్థిక మంత్రి ఆత్మద్రోహం చేసుకున్నారు

'కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ తెలుగు బిడ్డను అంటారు. ఇప్పుడు ఆత్మ ద్రోహం చేసుకున్నారు. ఆర్థిక మంత్రి మాగ్ననమిటీ ఉంటే తెలంగాణ ప్రభుత్వాన్ని పొగిడిఉంటాలి. కానీ హైదరాబాద్ ఆర్బిట్రేషన్ సెంటర్ శికండిని గుజరాత్ గిఫ్ట్ సిటీలో పెడుతున్నారు.' అని సీఎం కేసీఆర్ ఆరోపించారు.  హైద‌రాబాద్‌లో ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్ ఏర్పాటు చేస్తుంటే ప్రధాని న‌రేంద్ర మోదీకి నిద్ర ప‌ట్టడం లేద‌ని సీఎం కేసీఆర్ విమర్శించారు. దేశంలో కుర‌చ బుద్ధి ఉన్న ప్రధాని మోదీ అన్నారు. కోర్టు బ‌య‌ట పంచాయితీలు తేల్చుకునేందుకు వ్యవ‌స్థను యావ‌త్ ప్రపంచం పాటిస్తుందన్నారు. దేశంలో ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్లు లేవన్న కేసీఆర్.. సింగ‌పూర్‌, దుబాయ్‌, లండ‌న్‌లో ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్లు ఉన్నాయన్నారు. భారత పారిశ్రామిక‌వేత్తలు ఇతర దేశాలు వెళ్తున్నారన్నారు. సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌ సూచనలతో ఆర్బిట్రేష‌న్ సెంట‌ర్‌ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేశామన్నారు.

గిఫ్టు సిటీలో పోటీగా మరో సెంటర్ 

ఈ సెంట‌ర్‌కు ఓ భ‌వ‌నాన్ని అద్దెకు తీసుకుని రూ. 15 కోట్లతో స‌దుపాయాలు క‌ల్పించామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రతి సంవ‌త్సరం రూ. 3 కోట్లు కేటాయిస్తామన్నారు. రూ. 300 కోట్ల విలువైన స్థలాన్ని కేటాయించామన్నారు. రూ. 50 కోట్లతో బిల్డింగ్ నిర్మిస్తు్న్నామన్నారు. ఈ నెల 5న శంకుస్థాప‌న చేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. దీనిని అహ్మదాబాద్‌లో పెట్టాల‌ని ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చారని సీఎం కేసీఆర్ ఆరోపించారు. దీనికి పోటీగా గిఫ్ట్ సిటీ అని ఒక సంస్థను ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. 

టాప్ హెడ్ లైన్స్

Nirmal Udumpur Tribals Non Cooperation Movement : నిర్మల్ జిల్లాలో అటవీశాఖ అధికారులపై తిరగబడ్డ ఆదివాసులు - పోలీసు కేసులతో భగ్గుమన్న ఉద్రిక్తత - సహాయ నిరాకరణ!
నిర్మల్ జిల్లాలో అటవీశాఖ అధికారులపై తిరగబడ్డ ఆదివాసులు - పోలీసు కేసులతో భగ్గుమన్న ఉద్రిక్తత - సహాయ నిరాకరణ!
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget