అన్వేషించండి

Tigers Death: పులుల మృతి కేసు, ఆదివాసీ యువకులను బలిపశువులు చేస్తున్నారా? మానవ హక్కుల వేదిక ప్రశ్నలు

Kumuram Bheem Asifabad district: దరిగాం అటవి ప్రాంతంలో జనవరి 6న, 8వ తేదీల్లో రెండు పులులు చనిపోవడం తెలిసిందే. అయితే పులుల మృతిపై అటవీ శాఖ అధికారులపై విమర్శలు వచ్చాయి.

Tiger Dies in Asifabad district:: కాగజ్ నగర్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దరిగాం అటవి ప్రాంతంలో జనవరి 6న, 8వ తేదీల్లో రెండు పులులు చనిపోవడం తెలిసిందే. అయితే పులుల మృతిపై అటవీ శాఖ అధికారులపై విమర్శలు వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు విచారణ చేపట్టి.. వాంకిడి మండలం రింగారెట్ గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీ యువకులు ఉద్దేశపూర్వకంగా పులులను చంపినట్టు నేరం మోపి.. వారిని రిమాండ్ కు పంపించారని ఆదివారం మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ నిజనిర్ధారణ జరిపింది. 

అమాయక ఆదివాసీలను వెంటనే విడుదల చేయాలి
ఆదివాసి యువకులైన కోవగంగు, ఆత్రం జలపతులను వెంటనే విడుదల చేయాలని, వారు ఏమైనా నేరం చేసి ఉంటే మానవతా దృక్పథంతో వ్యవహరించి వదిలివేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. పులుల బారిన మనుషులు, పశువులు చనిపోకుండా ఏం రక్షణ చర్యలు తీసుకుంటుందో ప్రభుత్వం వెంటనే ప్రకటించాలన్నారు. పులులను మానవ సంచారంలేని పరిమిత, నిర్దిష్ట అటవీ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేసి వాటిని సంరక్షించాలని కోరారు. పులుల సంరక్షణ మానవాళికి శిక్షగా మారకూడదని మానవ హక్కుల వేదిక తరపున డిమాండ్ చేశారు. ఈ నిజ నిర్ధారణ కమిటీలో మానవ హక్కుల వేదిక బృందం రాష్ట్ర అధ్యక్షులు ఆత్రం భుజంగరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య, అసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు కాంబ్లీ అతీష్, సభ్యులు ఆత్రం సాయుధ, నూతన్, మరప సురేష్ లు ఉన్నారు.

పశుగ్రాసం, ఆహారం కోసం అడవిలోకి..
వాంకిడి మండలం రింగారెట్, చెరుకుపల్లి, దరిగాం గ్రామాల నుండి ఆదివాసీ ప్రజలు పశు సంపద, ఆహారం కోసం దరిగాం అడవికి వెళ్తారు. ఈ క్రమంలో రింగారెట్ గ్రామానికి చెందిన కోవా గంగు యొక్క ఆవు నెల రోజుల క్రితం దరిగాం అడవిలో తప్పిపోయింది. ఆవు తిరిగి వస్తుందేమోనన్న ఆశతో, దాని యజమాని అటవీ అధికారులకు ఫిర్యాదు చేయలేదు. కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పరిధిలోకి వచ్చే దరిగాం అడవిలో పులి చనిపోయింది అని గ్రామస్తులు సమాచారం ఇస్తే తప్ప అటవీ అధికారులకు తెలియలేదు. ఈ క్రమంలో రెండు రోజుల తరువాత మరో పులి చనిపోయింది. వారు పులులు చనిపోవటానికి పరిసర ప్రాంతాల రైతులు లేదా పశుకాపరులే కారణమై ఉంటారని అనుమానంతో ఒక 12 ఏళ్ల బాలున్ని అదుపులోకి తీసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. కోవగంగు, ఆత్రం జలపతులే పులుల మరణానికి కారణమని ఆ బాలుడితో చెప్పించారు. 

కోవగంగును, ఆత్రం జలపతితో పాటు మరి కొంత మంది ఆదివాసీ యువకులను అదుపులోకి తీసుకొని తీవ్రంగా కొట్టినట్టు వారి బంధువులు ఆరోపిస్తున్నారు. కేవలం దెబ్బలకు తట్టుకోలేక మాత్రమే తాము చేయని నేరాన్ని ఒప్పుకుంటున్నామని గంగు, జలపతులు చెప్పారని.. వారి బంధువులు మానవ హక్కుల వేదిక బృందానికి తెలిపారు. కోర్టులో ఈ నేరం రుజువైనా, కాకపోయినా పులుల మరణాలకు గల కారణాలనూ, అడవులలో ఆదివాసుల పరిస్థితినీ మానవీయ కోణంతో పరిశీలిస్తేనే అర్థం అవుతాయని మానవ హక్కుల వేదిక పేర్కొంది. 
పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు!
అడవులు పులులకే కాదు ఆదివాసులకు కూడా సొంతం. అడవుల్లో ఈరోజు పులులకే కాదు ఆదివాసులకు, వారి పశుసంపదకు కూడా రక్షణ లేదు. గత సంవత్సరం సిడాం భీము అనే పత్తి రైతుపై పులి దాడి చేసి చంపేసింది. కనీసం నెల రెండు నెలలకు ఒక ఆవు లేదా ఎద్దు, ఇంకా అనేక గొర్రెలు, మేకలు పులుల బారినపడి చనిపోతున్నాయి. పులుల బారిన పడి చనిపోయే గొర్రెలకు, మేకలకు పరిహారం ఇచ్చే వెసులుబాటు చట్టంలో లేదట.. మనుషులకు, ఎద్దులకు మాత్రం ప్రభుత్వం, అటవీ అధికారులు నామమాత్రపు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కానీ పులులు చనిపోతే మాత్రం ఆదివాసీ ప్రజలను జైల్లకు పంపుతున్నారు. పాలకులూ.. సమాజం.. పులులకు ఇచ్చే విలువను మనుషులకు ఇవ్వకపోవడం మాని, మానవీయ దృక్పథంతో ఈ విషయాన్ని చూడాలన్నారు.
 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Food Adulteration: లొట్టలేసుకుంటూ తింటున్నారా.. హైదరాబాద్‌లో 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్
లొట్టలేసుకుంటూ తింటున్నారా.. హైదరాబాద్‌లో 100 రోజుల్లో 121 టన్నుల కల్తీ ఆహార పదార్థాలు సీజ్
Breaking News: బెయిల్ వచ్చిన వెంటనే ప్రశ్న రావణ్ అరెస్ట్.. జైల్లోనే చంపేయాలంటూ సంచలన వ్యాఖ్యలు
బెయిల్ వచ్చిన వెంటనే ప్రశ్న రావణ్ అరెస్ట్.. జైల్లోనే చంపేయాలంటూ సంచలన వ్యాఖ్యలు
IIIT Student Commits Suicide: ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విషాదం
ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య.. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విషాదం
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget