అన్వేషించండి

Tigers Death: పులుల మృతి కేసు, ఆదివాసీ యువకులను బలిపశువులు చేస్తున్నారా? మానవ హక్కుల వేదిక ప్రశ్నలు

Kumuram Bheem Asifabad district: దరిగాం అటవి ప్రాంతంలో జనవరి 6న, 8వ తేదీల్లో రెండు పులులు చనిపోవడం తెలిసిందే. అయితే పులుల మృతిపై అటవీ శాఖ అధికారులపై విమర్శలు వచ్చాయి.

Tiger Dies in Asifabad district:: కాగజ్ నగర్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దరిగాం అటవి ప్రాంతంలో జనవరి 6న, 8వ తేదీల్లో రెండు పులులు చనిపోవడం తెలిసిందే. అయితే పులుల మృతిపై అటవీ శాఖ అధికారులపై విమర్శలు వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు విచారణ చేపట్టి.. వాంకిడి మండలం రింగారెట్ గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీ యువకులు ఉద్దేశపూర్వకంగా పులులను చంపినట్టు నేరం మోపి.. వారిని రిమాండ్ కు పంపించారని ఆదివారం మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ నిజనిర్ధారణ జరిపింది. 

అమాయక ఆదివాసీలను వెంటనే విడుదల చేయాలి
ఆదివాసి యువకులైన కోవగంగు, ఆత్రం జలపతులను వెంటనే విడుదల చేయాలని, వారు ఏమైనా నేరం చేసి ఉంటే మానవతా దృక్పథంతో వ్యవహరించి వదిలివేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. పులుల బారిన మనుషులు, పశువులు చనిపోకుండా ఏం రక్షణ చర్యలు తీసుకుంటుందో ప్రభుత్వం వెంటనే ప్రకటించాలన్నారు. పులులను మానవ సంచారంలేని పరిమిత, నిర్దిష్ట అటవీ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేసి వాటిని సంరక్షించాలని కోరారు. పులుల సంరక్షణ మానవాళికి శిక్షగా మారకూడదని మానవ హక్కుల వేదిక తరపున డిమాండ్ చేశారు. ఈ నిజ నిర్ధారణ కమిటీలో మానవ హక్కుల వేదిక బృందం రాష్ట్ర అధ్యక్షులు ఆత్రం భుజంగరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య, అసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు కాంబ్లీ అతీష్, సభ్యులు ఆత్రం సాయుధ, నూతన్, మరప సురేష్ లు ఉన్నారు.

పశుగ్రాసం, ఆహారం కోసం అడవిలోకి..
వాంకిడి మండలం రింగారెట్, చెరుకుపల్లి, దరిగాం గ్రామాల నుండి ఆదివాసీ ప్రజలు పశు సంపద, ఆహారం కోసం దరిగాం అడవికి వెళ్తారు. ఈ క్రమంలో రింగారెట్ గ్రామానికి చెందిన కోవా గంగు యొక్క ఆవు నెల రోజుల క్రితం దరిగాం అడవిలో తప్పిపోయింది. ఆవు తిరిగి వస్తుందేమోనన్న ఆశతో, దాని యజమాని అటవీ అధికారులకు ఫిర్యాదు చేయలేదు. కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పరిధిలోకి వచ్చే దరిగాం అడవిలో పులి చనిపోయింది అని గ్రామస్తులు సమాచారం ఇస్తే తప్ప అటవీ అధికారులకు తెలియలేదు. ఈ క్రమంలో రెండు రోజుల తరువాత మరో పులి చనిపోయింది. వారు పులులు చనిపోవటానికి పరిసర ప్రాంతాల రైతులు లేదా పశుకాపరులే కారణమై ఉంటారని అనుమానంతో ఒక 12 ఏళ్ల బాలున్ని అదుపులోకి తీసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. కోవగంగు, ఆత్రం జలపతులే పులుల మరణానికి కారణమని ఆ బాలుడితో చెప్పించారు. 

కోవగంగును, ఆత్రం జలపతితో పాటు మరి కొంత మంది ఆదివాసీ యువకులను అదుపులోకి తీసుకొని తీవ్రంగా కొట్టినట్టు వారి బంధువులు ఆరోపిస్తున్నారు. కేవలం దెబ్బలకు తట్టుకోలేక మాత్రమే తాము చేయని నేరాన్ని ఒప్పుకుంటున్నామని గంగు, జలపతులు చెప్పారని.. వారి బంధువులు మానవ హక్కుల వేదిక బృందానికి తెలిపారు. కోర్టులో ఈ నేరం రుజువైనా, కాకపోయినా పులుల మరణాలకు గల కారణాలనూ, అడవులలో ఆదివాసుల పరిస్థితినీ మానవీయ కోణంతో పరిశీలిస్తేనే అర్థం అవుతాయని మానవ హక్కుల వేదిక పేర్కొంది. 
పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు!
అడవులు పులులకే కాదు ఆదివాసులకు కూడా సొంతం. అడవుల్లో ఈరోజు పులులకే కాదు ఆదివాసులకు, వారి పశుసంపదకు కూడా రక్షణ లేదు. గత సంవత్సరం సిడాం భీము అనే పత్తి రైతుపై పులి దాడి చేసి చంపేసింది. కనీసం నెల రెండు నెలలకు ఒక ఆవు లేదా ఎద్దు, ఇంకా అనేక గొర్రెలు, మేకలు పులుల బారినపడి చనిపోతున్నాయి. పులుల బారిన పడి చనిపోయే గొర్రెలకు, మేకలకు పరిహారం ఇచ్చే వెసులుబాటు చట్టంలో లేదట.. మనుషులకు, ఎద్దులకు మాత్రం ప్రభుత్వం, అటవీ అధికారులు నామమాత్రపు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కానీ పులులు చనిపోతే మాత్రం ఆదివాసీ ప్రజలను జైల్లకు పంపుతున్నారు. పాలకులూ.. సమాజం.. పులులకు ఇచ్చే విలువను మనుషులకు ఇవ్వకపోవడం మాని, మానవీయ దృక్పథంతో ఈ విషయాన్ని చూడాలన్నారు.
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Telangana Assembly: తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులకు షాక్ -వేతనంలో 15 శాతం కోతకు తెలంగాణ సర్కార్ చట్టం
తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులకు షాక్ -వేతనంలో 15 శాతం కోతకు తెలంగాణ సర్కార్ చట్టం
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Affordable Mileage Cars: రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
Embed widget