అన్వేషించండి

Tigers Death: పులుల మృతి కేసు, ఆదివాసీ యువకులను బలిపశువులు చేస్తున్నారా? మానవ హక్కుల వేదిక ప్రశ్నలు

Kumuram Bheem Asifabad district: దరిగాం అటవి ప్రాంతంలో జనవరి 6న, 8వ తేదీల్లో రెండు పులులు చనిపోవడం తెలిసిందే. అయితే పులుల మృతిపై అటవీ శాఖ అధికారులపై విమర్శలు వచ్చాయి.

Tiger Dies in Asifabad district:: కాగజ్ నగర్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని దరిగాం అటవి ప్రాంతంలో జనవరి 6న, 8వ తేదీల్లో రెండు పులులు చనిపోవడం తెలిసిందే. అయితే పులుల మృతిపై అటవీ శాఖ అధికారులపై విమర్శలు వచ్చాయి. అప్రమత్తమైన అధికారులు విచారణ చేపట్టి.. వాంకిడి మండలం రింగారెట్ గ్రామానికి చెందిన ఇద్దరు ఆదివాసీ యువకులు ఉద్దేశపూర్వకంగా పులులను చంపినట్టు నేరం మోపి.. వారిని రిమాండ్ కు పంపించారని ఆదివారం మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ నిజనిర్ధారణ జరిపింది. 

అమాయక ఆదివాసీలను వెంటనే విడుదల చేయాలి
ఆదివాసి యువకులైన కోవగంగు, ఆత్రం జలపతులను వెంటనే విడుదల చేయాలని, వారు ఏమైనా నేరం చేసి ఉంటే మానవతా దృక్పథంతో వ్యవహరించి వదిలివేయాలని మానవ హక్కుల వేదిక డిమాండ్ చేసింది. పులుల బారిన మనుషులు, పశువులు చనిపోకుండా ఏం రక్షణ చర్యలు తీసుకుంటుందో ప్రభుత్వం వెంటనే ప్రకటించాలన్నారు. పులులను మానవ సంచారంలేని పరిమిత, నిర్దిష్ట అటవీ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేసి వాటిని సంరక్షించాలని కోరారు. పులుల సంరక్షణ మానవాళికి శిక్షగా మారకూడదని మానవ హక్కుల వేదిక తరపున డిమాండ్ చేశారు. ఈ నిజ నిర్ధారణ కమిటీలో మానవ హక్కుల వేదిక బృందం రాష్ట్ర అధ్యక్షులు ఆత్రం భుజంగరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ తిరుపతయ్య, అసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు కాంబ్లీ అతీష్, సభ్యులు ఆత్రం సాయుధ, నూతన్, మరప సురేష్ లు ఉన్నారు.

పశుగ్రాసం, ఆహారం కోసం అడవిలోకి..
వాంకిడి మండలం రింగారెట్, చెరుకుపల్లి, దరిగాం గ్రామాల నుండి ఆదివాసీ ప్రజలు పశు సంపద, ఆహారం కోసం దరిగాం అడవికి వెళ్తారు. ఈ క్రమంలో రింగారెట్ గ్రామానికి చెందిన కోవా గంగు యొక్క ఆవు నెల రోజుల క్రితం దరిగాం అడవిలో తప్పిపోయింది. ఆవు తిరిగి వస్తుందేమోనన్న ఆశతో, దాని యజమాని అటవీ అధికారులకు ఫిర్యాదు చేయలేదు. కాగజ్ నగర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పరిధిలోకి వచ్చే దరిగాం అడవిలో పులి చనిపోయింది అని గ్రామస్తులు సమాచారం ఇస్తే తప్ప అటవీ అధికారులకు తెలియలేదు. ఈ క్రమంలో రెండు రోజుల తరువాత మరో పులి చనిపోయింది. వారు పులులు చనిపోవటానికి పరిసర ప్రాంతాల రైతులు లేదా పశుకాపరులే కారణమై ఉంటారని అనుమానంతో ఒక 12 ఏళ్ల బాలున్ని అదుపులోకి తీసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. కోవగంగు, ఆత్రం జలపతులే పులుల మరణానికి కారణమని ఆ బాలుడితో చెప్పించారు. 

కోవగంగును, ఆత్రం జలపతితో పాటు మరి కొంత మంది ఆదివాసీ యువకులను అదుపులోకి తీసుకొని తీవ్రంగా కొట్టినట్టు వారి బంధువులు ఆరోపిస్తున్నారు. కేవలం దెబ్బలకు తట్టుకోలేక మాత్రమే తాము చేయని నేరాన్ని ఒప్పుకుంటున్నామని గంగు, జలపతులు చెప్పారని.. వారి బంధువులు మానవ హక్కుల వేదిక బృందానికి తెలిపారు. కోర్టులో ఈ నేరం రుజువైనా, కాకపోయినా పులుల మరణాలకు గల కారణాలనూ, అడవులలో ఆదివాసుల పరిస్థితినీ మానవీయ కోణంతో పరిశీలిస్తేనే అర్థం అవుతాయని మానవ హక్కుల వేదిక పేర్కొంది. 
పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు!
అడవులు పులులకే కాదు ఆదివాసులకు కూడా సొంతం. అడవుల్లో ఈరోజు పులులకే కాదు ఆదివాసులకు, వారి పశుసంపదకు కూడా రక్షణ లేదు. గత సంవత్సరం సిడాం భీము అనే పత్తి రైతుపై పులి దాడి చేసి చంపేసింది. కనీసం నెల రెండు నెలలకు ఒక ఆవు లేదా ఎద్దు, ఇంకా అనేక గొర్రెలు, మేకలు పులుల బారినపడి చనిపోతున్నాయి. పులుల బారిన పడి చనిపోయే గొర్రెలకు, మేకలకు పరిహారం ఇచ్చే వెసులుబాటు చట్టంలో లేదట.. మనుషులకు, ఎద్దులకు మాత్రం ప్రభుత్వం, అటవీ అధికారులు నామమాత్రపు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కానీ పులులు చనిపోతే మాత్రం ఆదివాసీ ప్రజలను జైల్లకు పంపుతున్నారు. పాలకులూ.. సమాజం.. పులులకు ఇచ్చే విలువను మనుషులకు ఇవ్వకపోవడం మాని, మానవీయ దృక్పథంతో ఈ విషయాన్ని చూడాలన్నారు.
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Buddha Venkanna: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, విజయసాయిరెడ్డిపై విజయవాడ సీపీకి బుద్ధా వెంకన్న ఫిర్యాదు
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Telangana Thalli Statue: తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
తెలంగాణ తల్లి అభయ 'హస్తం' - కొత్త రూపంపై బీఆర్ఎస్ నిరసన, కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
Mohan Babu - Manchu Manoj: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
Maruti Dzire Sales: రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?
రోజుకి 1000 బుకింగ్స్ - మార్కెట్లో దూసుకుపోతున్న కొత్త డిజైర్ - ధర అంత తక్కువా?
Crime News: 'అమ్మా నన్ను బావిలో పడేయొద్దు' - కూతురిని ఇంటికి పంపించి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య, వికారాబాద్‌లో విషాదం
'అమ్మా నన్ను బావిలో పడేయొద్దు' - కూతురిని ఇంటికి పంపించి కొడుకుతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య, వికారాబాద్‌లో విషాదం
Jio vs Airtel vs Vi vs BSNL: రూ.895కే సంవత్సరం రీఛార్జ్ - జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
రూ.895కే సంవత్సరం రీఛార్జ్ - జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget