By: ABP Desam | Updated at : 03 Mar 2023 06:01 PM (IST)
కాంగ్రెస్ సీనియర్ల మరో పాదయాత్ర
Congress Padayatra : తెలంగాణ కాంగ్రెస్ కార్యక్రమాల అమలు ఇంచార్జ్ మహేశ్వర్ రెడ్డి విడిగా పాదయాత్ర ప్రారంభించడం కాంగ్రెస్లో కలకలం రేపింది. ఆయన పాదయాత్రకు హాత్ సే హాత్ జోడో యాత్ర అని కాకుండా సేవ్ కాంగ్రెస్ అన్నట్లుగా ప్రచారం చేసుకోవడంతో వివాదం అయింది. సీఎల్పీ నేత భట్టి విక్ర మార్క, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డితోపాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అదిలాబాద్ జిల్లాలోని బాసర నుంచి హైదరాబాద్ వరకు మొదటి విడతగా దాదాపు 10 రోజుల పాటు ప్రజా సమస్యలపై పోరు యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. బాసర లోని సరస్వతి ఆలయంలో పూజలు నిర్వహించి యాత్రను మొదలు పెట్టారు. టీపీపీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ నియోజకవర్గంలో యాత్రను ప్రారంభించి.. హుజూర్ నగర్ నియోజక వర్గంతో పాటు నల్లగొండ పార్లమెంట్ పరిధిలోని కొన్ని నియోజక వర్గాల్లో పాదయాత్ర చేయనున్నారు.
ఇది రేవంత్ రెడ్డి పాదయాత్రకు పోటీగా నిర్వహిస్తున్నారన్న ప్రచారం ప్రారంభమయింది. అయితే ఈ పాదయాత్ర పార్టీ పరంగానే జరుగుతోందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పాదయాత్ర చేసినా అది పార్టీ అభీష్టం మేరకే ఉంటుందని చెబుతున్నారు. తెలంగాణ సీనియర్ నేతలందరూ కచ్చితంగా యాత్ర చేయాల్సిందేనని తెలిపారు. మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర చేసినా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి పాదయాత్ర చేసినా.. అది పార్టీ ప్రయోజనాలకేనని స్పష్టం చేశారు. యాత్ర చేయనివారిపై చర్యలు ఉంటాయని అన్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి చేపడుతున్న హాత్ సే హాత్ జోజో యాత్ర.. రాహుల్ గాంధీ చెప్పినట్లుగా జరగడం లేదని.. రేవంత్ రెడ్డి సొంత పాదయాత్రలా జరుగుతోందని మహేశ్వర్ రెడ్డి .. కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ థాక్రే ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అందరూ పాదయాత్ర చేయవచ్చని.. థాక్రే సర్ది చెప్పారు.
హైకమాండ్ ఆదేశాల మేరకు అందరూ పాదయాత్రలు చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి కూడా ఉమ్మడి నల్లగొండలో యాత్ర చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. పాదయాత్రలు పార్టీలో ఒకరిద్దరికే పరిమితం చేయకుండా.. పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా ఎంత మంది నాయకులు యాత్రలు చేసినా ఫర్వాలేదని, కానీ కాంగ్రెస్కు నష్టం చేసే విధంగా వ్యవహారించొద్దని అధిష్టానం సూచనలు చేసింది. రాహుల్ గాంధీ జోడో యాత్ర స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజక వర్గాల వారిగా యాత్రలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది.
రేవంత్ రెడ్డి పాదయాత్రకు సహజంగానే స్పందన ఎక్కువగా ఉంది. ఆయన మాస్ లీడర్ కావడంతో ఆ ప్రభావం కనిపిస్తోంది. కొంత మంది సీనియర్ నేతలు కూడా రేవంత్ కు మద్దతు ప్రకటించారు. మరికొంత మంది మాత్రం పోటీ పాదయాత్ర చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడంతో సమస్య ప్రారంభమయింది.
రెండు మూడు రోజుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్టు
Warangal News : ఎంజీఎం మార్చురీ సిబ్బంది నిర్లక్ష్యం, మృతదేహాల తారుమారు!
1980లో ఇందిరా గాంధీకి సంపూర్ణ మెజారిటీ- ప్రధాని మోదీ, షా గుర్తుంచుకోండి!: భట్టి విక్రమార్క
Heera Gold Scam : హీరా గోల్డ్ స్కామ్ కేసు, మరో 33.06 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
Family Suicide: హైదరాబాద్ లో దారుణం - ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య, కారణం తెలిస్తే కన్నీళ్లే!
KTR Inaugurates LB Nagar Flyover : ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్, ఇకపై ట్రాఫిక్ కష్టాలకు విముక్తి!
Undavalli Sridevi: అనూహ్యంగా రాజకీయాల్లోకి - ఇసుక రీచ్ ల నుంచి క్రాస్ ఓటింగ్ వరకు, వివాదాల శ్రీదేవి ప్రస్థానం ఇలా!
Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్
Bandi Sanjay Son : బండి భగీరథ్ సస్పెన్షన్ పై హైకోర్టు స్టే, కోర్టు ఆదేశాలతో పరీక్షలకు హాజరు!