అన్వేషించండి

Telangana Cabinet: రేపే తెలంగాణ కేబినెట్ భేటీ - హైడ్రాతోపాటు కీలక అంశాలపై నిర్ణయం

Cabinet Meeting : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది. కొత్త ఆర్వోఆర్ చట్టానికి ఆమోదం, కొత్తగా 200 గ్రామ పంచాయతీల ఏర్పాటు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.

Telangana Cabinet: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో వ్యవసాయ రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయడం, పంటల బీమా, రైతు భరోసా, హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్​ జారీకి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు వివిధ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే  పంట నష్టం సాయం, కొత్త ఆర్వోఆర్ చట్టానికి ఆమోదం, కొత్తగా 200 గ్రామ పంచాయతీల ఏర్పాటు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.   

కేంద్ర సాయంపై తీర్మానం
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా వరద తాకిడికి ప్రజలు భారీగా నష్టపోయారు. రూ.10 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించి నష్టాన్ని పరిశీలించింది.  దీనిపై కేంద్రం నుంచి ఉదారంగా సాయం చేయాలని క్యాబినెట్ తీర్మానం చేయనుంది. పేద కుటుంబాలకు రేషన్ కార్డుల జారీలో పారదర్శకత పెంచేందుకు ప్రస్తుత విద్యార్హతలను సవరించే ప్రతిపాదనపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. రేషన్ కార్డులతో ఇబ్బంది లేకుండా సాధారణ ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవల జారీకి ఆమోదం తెలిపినట్లు తెలిసింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కుల గణనను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ కుల గణన నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు కుల గణనకు సంబంధించిన సర్వే మార్గదర్శకాలకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించనుంది.

రుణమాఫీ పై చర్చ
తెలంగాణలో రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. అయితే రూ.2 లక్షలకు పైగా రుణాలు ఇంకా మాఫీ కాలేదు. దీంతో దశలవారీగా రుణమాఫీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. దీనికి కేబినెట్‌ ఆమోదం తెలపాల్సి ఉంది. రైతుబంధు బదులు పంట పెట్టుబడుల కోసం రైతు భరోసాను ప్రవేశపెడతారు. అమలు, పరిమితులపై జిల్లాల వారీగా అభిప్రాయాల సేకరణ చేపట్టనున్నారు. ప్రస్తుతం వానాకాలం పంటలు చివరి దశలో ఉన్నందున ఈ పథకాన్ని వెంటనే అమలు చేయాలని రేవంత్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు పంటలు వేసిన వారికే సాయం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే స్పష్టం చేశారు. దీనిపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలోనూ అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.


హైడ్రాకు చట్టబద్ధత
చెరువులు, నాలాల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పటివరకు 99 జీవో ద్వారా కొనసాగుతోంది. ఈ సంస్థ ఎఫ్​‌టీఎల్‌​లో ఉన్న ఆక్రమణలను తొలగిస్తుంటే కొందరు అడ్డుకుని హైడ్రాకు కూల్చివేతల అధికారం లేదంటూ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్​ అంశంపై కేబినెట్ రేపు నిర్ణయం తీసుకోనుంది.

 కమీషన్లకు చట్టబద్ధత 
 అలాగే విద్య, వ్యవసాయ కమీషన్లకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. వ్యవసాయ కమిషన్‌ చైర్మన్‌గా కోదండరెడ్డి, విద్యా కమిషన్‌ చైర్మన్‌గా ఆకునూరి మురళి నియామకానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి, కోఠిలోని ఉస్మానియా మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేర్లను కేబినెట్ ఖరారు చేయనుంది. వీటితో పాటు ఆరోగ్య బీమా, రేషన్ కార్డులు, గ్రామపంచాయతీల్లో పేదలందరికీ ఆరోగ్య బీమా కల్పించే ప్రతిపాదనపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. సీఎంఆర్ఎఫ్ నిధుల భారీ వ్యయాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు కేబినెట్ భేటీపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా.. హామీల అమలుపై చర్చ జరగనుంది. వర్షాకాలం ముగుస్తున్న దృష్ట్యా రైతు భరోసా పథకం అమలుపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. మంత్రి మండలి సమావేశం అనంతరం తీసుకున్న నిర్ణయాలపై పూర్తి స్పష్టత రానుంది.

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget