News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Harish Rao: సీఎం కేసీఆర్ త్వరలోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేస్తారు, మంత్రి హరీష్ రావు వెల్లడి

కాంగ్రెస్ నాయకుల బోగస్ మాటలు నమ్మి ప్రజలు ఆగం కావద్దని హరీష్ రావు స్పష్టం చేశారు.

FOLLOW US: 
Share:

సీఎం కేసీఆర్ త్వరలోనే బిఆర్ఎస్ మేనిఫెస్టోని విడుదల చేస్తారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తూప్రాన్, మనోహరాబాద్ మండలాల్లో పలు అభివృద్ధి పనులను బుధవారం మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా తూఫ్రాన్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాలు సంతోషపడేలా శుభవార్త త్వరలోనే వింటారని మంత్రి అన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గజ్వేల్ నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందిందని, కేసీఆర్‌కు ముందు, ఆయన వచ్చాక పట్టణంలో ఏం జరిగిందో మీరే బేరీజు వేసుకోవాలన్నారు. ఇంత పురోగతి కనిపిస్తున్నా ఏమీ జరగలేదని కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ అంటున్నారన్నారు. తూప్రాన్ అభివృద్ధి కాలేదంటే సూర్యుడి మీద ఉమ్మి వేసినట్టేనని.. ఈ ప్రాంతంలో మంచినీళ్ల కోసం ఆడపడచులు పడ్డ కష్టాలు ఇప్పటికీ మర్చిపోలేమని అన్నారు.

పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్న కేసీఆర్‌ను ప్రతిపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నాయని, తిడుతున్న ప్రతిపక్షాలు కావాలా?.. లేక సంక్షేమం రూపంలో కిట్లు ఇస్తున్న కేసీఆర్ కావాలా? అని మంత్రి హరీష్ రావు ప్రజలను ఉద్దేశించి అన్నారు. ప్రతిపక్షాల అబద్ధాలు తిప్పికొట్టాలంటే.. ప్రజలంతా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి గురించి చాటి చెప్పాలన్నారు.

కేసీఆర్ గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించడం మనందరి అదృష్టమని, ఆయన ప్రాతినిధ్యంవల్లే గజ్వేల్ రూపు రేఖలు మారిపోయాయన్నారు. అందుకే ఆయనను అత్యధిక మెజారిటీతో మళ్లీ గెలిపించుకోవాలని మంత్రి పిలుపిచ్చారు. సిద్దిపేట కంటే ఎక్కువ మెజారిటీతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గెలిపించుకొని అభివృద్ధిని కొనసాగిద్దామన్నారు. అన్ని వర్గాల కోసం ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు.

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రధాని మోదీ కాపీ కొట్టారని హరీష్ రావు విమర్శించారు. తమ ప్రభుత్వం బీసీలకు ఉచితంగా లక్ష రూపాయలు అందిస్తుంటే కేంద్ర ప్రభుత్వం అప్పుగా ఇస్తుందన్నారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పలు విమర్శలు గుప్పించారు.  50 ఏళ్లలో చైన్ అభివృద్ధిని ఇప్పుడు చేస్తామని కాంగ్రెస్ వాళ్లు బాండ్ పేపర్లు రాసి ఇస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. కానీ తెలంగాణ ప్రజలకు వారంటీ, గ్యారంటీ సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో నిత్యం కరెంటు కోతలేనని కెసిఆర్ హయాంలో నిమిషం కూడా కరెంటు పోవడం లేదని వెల్లడించారు. 

మళ్లీ పాత రోజులు వస్తున్నాయని ప్రజలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతోందని హరీష్ రావు అన్నారు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ నీ పక్కకు పెడుతూ మట్టి పాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు.  గద్దెనెక్కే వరకు కాంగ్రెస్‌ నేతలు ఎలాంటి అబద్ధాలైనా మాట్లాడతారని మంత్రి హరీశ్​రావు అన్నారు.  కాంగ్రెస్​పై విరుచుకుపడ్డారు. కర్ణాటకలో చేయలేని వారు.. తెలంగాణలో మాయమాటలు చెబుతున్నారని విమర్శలు గుప్పించారు. 

కాంగ్రెస్ నాయకుల బోగస్ మాటలు నమ్మి ప్రజలు ఆగం కావద్దని హరీష్ రావు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి కాంగ్రెస్ చెబుతున్న అబద్దాలకు పోటీ జరగబోతుందని పేర్కొన్నారు. గద్దినెక్కేవరకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలాంటి అబద్ధాల నైన మాట్లాడతారని హరీష్ ధ్వజమెత్తారు. కర్ణాటకలో కరెంటు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆరోపించారు.

 కర్ణాటకలో చేయలేని వారు తెలంగాణలో మాయ మాటలు చెబుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వస్తే ఆరు గ్యారెంటీలు కాదు ఆరు నెలలకు సీఎం వస్తారని ఎద్దేవా చేశారు. అలాగే ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలలకు కర్ఫ్యూ హైదరాబాదులో వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ది తన్నుల సంస్కృతి అని బీఆర్ఎస్ ది టన్నుల సంస్కృతి అని చెప్పారు. 

Published at : 27 Sep 2023 04:54 PM (IST) Tags: CONGRESS Minister Harish Rao BRS Manifesto thupran manoharabad

ఇవి కూడా చూడండి

KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ భరోసా

KCR On Results: హైరానా వద్దు, 3న సంబరాలు చేసుకుందాం- పార్టీ నేతలకు సీఎం కేసీఆర్‌ భరోసా

Congress CM Candidate : కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి పంచాయతీ తప్పదా ? రేవంత్ రెడ్డిని సీనియర్లు అంగీకరిస్తారా ?

Congress CM Candidate :  కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి పంచాయతీ తప్పదా ? రేవంత్ రెడ్డిని సీనియర్లు అంగీకరిస్తారా ?

Weather Update: ఏపీలో తుపాను అలర్ట్, ఈ ప్రాంతంలోనే తీరందాటే అవకాశం - ఈ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు

Weather Update: ఏపీలో తుపాను అలర్ట్, ఈ ప్రాంతంలోనే తీరందాటే అవకాశం - ఈ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు

AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో నేడు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు

AP Telangana Water Issue: కృష్ణాజలాలపై ఢిల్లీలో  నేడు కీలక మీటింగ్ - ఏపీ, తెలంగాణ హాజరవ్వాలని ఆదేశాలు

Gold-Silver Prices Today 02 December 2023: పసిడి ప్రియులకు ఝలక్‌ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today 02 December 2023: పసిడి ప్రియులకు ఝలక్‌ - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

టాప్ స్టోరీస్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Telangana Elections 2023: 'తెలంగాణలో రీపోలింగ్ కు నో ఛాన్స్' - రాష్ట్రంలో 70.74 శాతం పోలింగ్, గతంతో పోలిస్తే తక్కువేనన్న సీఈవో వికాస్ రాజ్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

Salaar Trailer: ‘సలార్’ ట్రైలర్ వచ్చేసింది - ‘కేజీఎఫ్’తో లింకేమిటీ? 3 నిమిషాల్లో కథ మొత్తం చెప్పేశారు - ప్రభాస్ ఎలివేషన్ అదుర్స్

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం

India vs Australia 4th T20I: సత్తా చాటిన యువ భారత్, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ కైవసం

Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి

Ambati Rambabu: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి