అన్వేషించండి

Central Team: హైదరాబాద్ చేరుకున్న కేంద్రబృందం, మొరపెట్టుకున్న వరద బాధితులు! 

Central Team: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో కేంద్రబృందం పర్యటించింది. రెండు రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

Central Team: రాష్ట్రంలో గత కొంత కాలంగా కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల సర్వం కోల్పోయిన ప్రాంతాల్లో పర్యటించారు కేంద్ర బృందం. గత రెండ్రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తిరిగిన అధికారులు నిన్న రాత్రిపూట హైదరాబాద్ కు చేరుకున్నారు. రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులు, తీసుకున్న సహాయక చర్యల గురించి కేంద్ర బృందం అధికారులకు వివరించారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఈనెల 20 వ తేదీన హైదరాబాద్ కు చేరుకొని రెండు బృందాలుగా విడిపోయి వివిధ జిల్లాల్లో వేర్వేరుగా పర్యటించారు. 

రెండు బృందాలుగా మారి రాష్ట్రంలో పర్యటన..

ఈ రెండు బృందాలు రాష్ట్ర విపత్తుల నిర్వహణా శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో కలసి ఒక బృందం నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించగా, మరో బృందం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రార్డీ కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించి నష్టాలను అంచనా వేశాయి. జిల్లాల్లోని వివిధ గ్రామాల్లో ఈ బృందాలు స్వయంగా పర్యటించి పరిస్థితులను పరిశీలించాయి.  భారీ వర్షాలు వరదల వల్ల  నీటిపారుదల వ్యవస్థకు జరిగిన నష్టం, దెబ్బతిన్న రోడ్ల పరిస్థితి, వివిధ శాఖలకు జరిగిన నష్టాన్ని స్వయంగా చూశాయి. 

కష్టాలు చెప్పుకొని కన్నీరుమున్నీరైన ప్రజలు..

వర్షం ధాటికి ఇళ్లు కోల్పోయిన ప్రజలు.. కేంద్రం బృందం అధికారులకు తమ పరిస్థితి చెప్పుకొని కన్నీరుమున్నీరు అయ్యారు. అలాగే అన్నదాతలు కూడా తమ పంట మొత్తం నీట మునిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల పంట నీట మునిగినట్లు అధికారులు గుర్తించారు. చాలా ప్రాంతాల్లో రైతులు ముందుస్తు పంటలు వేయడం వల్ల.. ఆధిలోనే చాలా నష్టపోయినట్లు తెలుసుకున్నారు. అయితే తమ రాష్ట్రానికి వచ్చిన ఊరూరా తిరిగి స్వయంగా ప్రస్తుత పరిస్థితిని పరిశీలించినందుకు కేంద్ర బృందానికి చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ కృతజ్ఞత తెలిపారు.

ప్రాణనష్టం లేకుండా చేయడం అభినందనీయం..

 కాగా, భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పటికీ సంబంధిత జిల్లా పాలనా యంత్రాంగాలు ఎన్డీఆర్ఎఫ్  తదితర విభాగాల సమన్వయంతో కృషిచేసి   ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అడ్డుకోవడాన్ని కేంద్రబృందం అధికారులు.. రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని అభినందించింది. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల ఏర్పడ్డ పరిస్థితులను స్వయంగా చూసి అంచనా వేయడంపట్ల కేంద్ర ప్రతినిధి బృందానికి సీఎస్ సోమేశ్ కుమార్ కృతజ్ఞత  తెలిపారు. 

రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ప్రభుత్వ అధికారులలో కేంద్ర హోమ్ శాఖ జాయింట్ సెక్రటరీ సౌరవ్ రే, డిప్యూటీ సెక్రటరీ పి పార్తీబన్, డైరెక్టర్ కె. మనోహరన్, డైరెక్టర్ రమేష్ కుమార్, దీప్ శేఖర్, శివ కుమార్ కుష్వాహా, ఏ. కృష్ణ ప్రసాద్ తదితరులు ఉన్నారు.

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
Telangana Cabinet Coordination Issues: జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?
జూపల్లి అలక - సురేఖ లేఖ - రేవంత్ క్యాబినెట్‌లో అంతర్గత కలహాలు - ప్రక్షాళన తప్పదా ?
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
Adilabad Latest News: ఆదిలాబాద్ జిల్లాలోని ఓ హోటల్‌లో సాంబార్‌లో బల్లి! సీజ్ చేసిన అధికారులు! 
ఆదిలాబాద్ జిల్లాలోని ఓ హోటల్‌లో సాంబార్‌లో బల్లి! సీజ్ చేసిన అధికారులు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Vizag Fishermen Missing: ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌- ఆరుగురు జాలర్లపై ఆశలు గల్లంతు, రూ.10 లక్షల పరిహారం
ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌- ఆరుగురు జాలర్లపై ఆశలు గల్లంతు, రూ.10 లక్షల పరిహారం
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
E20 ఇంధనంపై మరో కొత్త చర్చ - పాత బైక్‌లు, కార్ల రబ్బర్‌ భాగాలు పాడయ్యే ఛాన్స్‌!
E20 పెట్రోల్‌తో పాత బండ్లకు ప్రమాదం! రబ్బర్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని ARAI హెచ్చరిక
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
Embed widget