అన్వేషించండి

Kishan Reddy: 'కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారు' - కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన ఆరోపణలు

Telangana News: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ ఆదేశాలతో గుత్తేదారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శఇంచారు.

Kishan Reddy Slams Congress Leaders: తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారని.. రాహుల్ గాంధీ కోసం బిల్డర్లను బెదిరిస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ఎన్నికలకు కర్ణాటక నుంచి సూట్ కేసులు వస్తే ఇప్పుడు తెలంగాణ (Telangana) నుంచి ఢిల్లీకి సూట్ కేసులు వెళ్తున్నాయని మండిపడ్డారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో సనత్ నగర్ కు చెందిన వెల్లాల రామ్మోహన్ శుక్రవారం కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. బీఆర్ఎస్, కేసీఆర్ అక్రమాలపై రాష్ట్ర సర్కారు చర్యలేవని నిలదీశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ నాణేనికి బొమ్మా బొరుసులాంటివని.. ఆ రెండు పార్టీలు మజ్లిస్ అడుగుజాడల్లో పని చేస్తున్నాయని అన్నారు. 'భద్రాచలం ఆలయం కోసం ప్రధాని మోదీ రూ.50 కోట్ల నిధులు కేటాయించారు. ఆయన కృషితోనే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు దక్కింది. దేశవ్యాప్తంగా ఉన్న అతి ప్రాచీన, ప్రముఖ పుణ్యక్షేత్రాలను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత మోదీకే దక్కుతుంది.' అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

'మోదీతోనే తెలంగాణ అభివృద్ధి'

గత తొమ్మిదన్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. 'రూ.450 కోట్లతో కాచిగూడ, రూ.350 కోట్లతో నాంపల్లి, రూ.720 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్, రూ.400 కోట్లతో చర్లపల్లి రైల్వే స్టేషన్ల అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఎయిర్ పోర్ట్ తరహాలోనే సికింద్రాబాద్ స్టేషన్ డెవలప్ కానుంది. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు, ఉద్యోగాలు రావాలి. రాష్ట్రంలో రూ.1.20 లక్షల కోట్ల విలువైన రహదారుల నిర్మాణం జరిగింది. హైదరాబాద్ చుట్టూ రూ.26 వేల కోట్ల ట్రిపుల్ ఆర్ రోడ్డును కేంద్రం మంజూరు చేసింది. తెలంగాణ అభివృద్ధిలో ఇది గేమ్ ఛేంజర్. కాంగ్రెస్ హయాంలో ఎంపీలు, మంత్రులు అవినీతి ఆరోపణలతో, కుంభకోణాలతో జైలుకు వెళ్లారు. తొమ్మిదన్నరేళ్ల మోదీ పాలనలో ఒక్క అవినీతీ జరగలేదు. వచ్చే 25 ఏళ్లలో ప్రపంచ దేశాలకు విశ్వ గురువుగా భారత్ ను నిలబెట్టాలని ప్రధాని పిలుపునిచ్చారు. అందులో భాగస్వామ్యం అయ్యేందుకు మనం సిద్ధం కావాలి.' అని పేర్కొన్నారు.

గిరిజన మ్యూజియం నిర్మాణానికి శంకుస్థాపన

అటు, హైదరాబాద్ అబిడ్స్ లోని రాంజీ గోండు పేరుతో గిరిజన మ్యూజియం నిర్మాణానికి శుక్రవారం కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని.. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా రాంజీ గోండు పోరాడారని కొనియాడారు. దేశవ్యాప్తంగా 10 ట్రైబల్ మ్యూజియాలు ఏర్పాటు చేస్తున్నామని.. ఏపీలోనూ నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు. ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం వల్లే తెలంగాణలో మ్యూజియం ఏర్పాటు ఆలస్యమైందని అన్నారు. ఆయనకు ఎన్ని లేఖలు రాసినా.. స్పందించలేదని.. ఇవాళ శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. 'ములుగులో కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు కాబోతుంది. గత ప్రభుత్వం భూమి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసింది. గిరిజన వర్శిటీకి మొదిటి విడతలో రూ.900 కోట్లు కేటాయించాం. రూ.420 కోట్లతో 17 ఏకలవ్య పాఠశాలలను తెలంగాణలో ప్రారంభించాం. మేడారం జాతరకు రూ.3 కోట్ల వరకూ కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. గిరిజనుల భూములకు హక్కులు కూడా కల్పిస్తున్నాం. వారి సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది.' అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు.

Also Read: Bandi Sanjay : బీజేపీతో టచ్‌లో 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు - బండి సంజయ్ కీలక ప్రకటన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

GHMC Offer: గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులకు బంపర్ ఆఫర్ - 90 శాతం రాయితీ - ఇవిగో డీటైల్స్
గ్రేటర్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులకు బంపర్ ఆఫర్ - 90 శాతం రాయితీ - ఇవిగో డీటైల్స్
Netflix in Hyderabad: హాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చినట్లే - నెట్‌ఫ్లిక్స్ స్టూడియో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
హాలీవుడ్ హైదరాబాద్‌కు వచ్చినట్లే - నెట్‌ఫ్లిక్స్ స్టూడియో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
Speaker Decision: అనర్హత, రాజీనామాల విషయంలో స్పీకర్‌కు గడువు - బీఆర్ఎస్ పిటిషన్లతో క్లారిటీ - ఇక పెండింగ్ పెట్టలేరా ?
అనర్హత, రాజీనామాల విషయంలో స్పీకర్‌కు గడువు - బీఆర్ఎస్ పిటిషన్లతో క్లారిటీ - ఇక పెండింగ్ పెట్టలేరా ?
Nirmal District Latest News: శుభకార్యానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు!నిర్మల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం! ఇద్దరు మృతి, 22 మందికి గాయాలు!
శుభకార్యానికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు!నిర్మల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం! ఇద్దరు మృతి, 22 మందికి గాయాలు!

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CEC Gyanesh Kumar : సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
Ustaad Bhagat Singh : సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
LPG Delivery Delay : గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
Harish Shankar: హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
హీరోయిన్ రాశీ ఖన్నాతో స్టెప్పులు వేసిన దర్శకుడు హరీష్ శంకర్ - ఫోటోలు చూశారా?
Crime Thriller Telugu OTT: భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
భర్త తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భార్య... తెలుగులో ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
Affordable Mileage Bikes: హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
హార్డ్‌ రూరల్‌ రోడ్లకు ఏ బైక్ మంచిది? బైక్ కొనే ముందు ఈ టూవిలర్స్ గురించి తెలుసుకోవడం చాలా మంచిది! 
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Viral Girl Love Jihad Controversy: వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
వైరల్ గర్ల్ మోనాలిసా లవ్ జీహాద్ బారిన పడ్డారా? - ఆమె సమాధానం ఇదే !
Embed widget