అన్వేషించండి

Turmeric Board: పసుపు బోర్డు తెలంగాణలో ఏర్పాటు చేయడం లేదా? నోటిఫికేషన్‌లో ఎక్కడా కనిపించని తెలంగాణ పదం

Turmeric Board: పసుపు బోర్డు ప్రకటిస్తూ కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో తెలంగాణ పేరు ఎక్కడా లేకపోవడంతో.. అనేక ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

Turmeric Board: రాష్ట్ర రైతుల చిరకాల డిమాండ్ పసుపు బోర్డు. పసుపు బోర్డు కావాలని చాలా కాలం నుంచి నిజామాబాద్ రైతులు నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ నెల 1వ తేదీన పాలమూరులో జరిగిన బీజేపీ జనగర్జన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం జాతీయ పసుపు బోర్డుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు పసుపు బోర్డు ప్రకటిస్తూ కేంద్ర సర్కారు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

అయితే ఈ గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్ర రైతుల్లో ఆనందం నింపాల్సింది పోయి.. అనుమానాలను రేకెత్తించింది. ఎందుకంటే ఈ గెజిట్ నోటిఫికేషన్ పసుపు బోర్డు తెలంగాణ రాష్ట్రంలోనే ఏర్పాటు చేస్తామని ఎక్కడా పేర్కొనలేదు. అసలు ఆ నోటిఫికేషన్ లోనే ఎక్కడా తెలంగాణ అనే పదం లేదు. పసుపు బోర్డు మండలి కూర్పు, దాని ఉద్దేశాలు, ఆర్థిక వనరులకు సంబంధించిన విధివిధానాలు, దాని నిర్వహణ, పర్యవేక్షణ వంటివన్నీ పేర్కొన్నారు. కానీ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది.. దానికేమైనా ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయా.. అన్న వివరాలేవీ పేర్కొనలేదు. ఇందులో ఎక్కడా తెలంగాణ రాష్ట్రం పేరు లేదు.

ఇప్పటికే హైదరాబాద్ లో జాతీయ ఔషధ విద్య, పరిశోధన మండలి (నైపర్) శాఖ ఉన్న విషయం తెలిసిందే.. దానికి బదులు గువహటిలోని నైపర్ డైరెక్టర్ ను పసుపు బోర్డులో సభ్యుడిగా నియమించారు. ఈ మండలి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణలో ఉంటుందని తెలిపారు. పసుపు బోర్డుకు నిధులు కూడా కేంద్ర సర్కారే సమకూరుస్తుంది. ఈ మండలి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ, నియంత్రణలో సాగుతుంది. 

కేంద్ర విడుదల చేసిన ఈ గెజిట్ నోటిఫికేషన్ తో రాష్ట్ర రైతులకు మరోసారి నిరాశే మిగిలిందని.. మరోసారి తెలంగాణ ప్రజలను మోసం చేయాలని బీజేపీ చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. పసుపు బోర్డుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన మరో ఎన్నికల జుమ్లా అని తెలిసిపోయిందంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించింది. తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తున్న బీజేపీకి రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుదామంటూ తన పోస్టులో పేర్కొంది. 

పసుపు బోర్డులో ఎవరెవరు ఉంటారంటే..

ఛైర్‌పర్సన్, కార్యదర్శి, నలుగురు సభ్యులు (వ్యవసాయం- రైతు సంక్షేమం, ఆయుష్, ఔషధ మంత్రిశాఖలు- విభాగాలకు చెందిన నలుగురు సభ్యులు), పసుపు ఉత్పత్తి చేసే రాష్ట్రాల నుంచి ముగ్గురు ప్రతినిధులు (రొటేషన్ పద్ధతిలో), ముగ్గురు పసుపు రైతులు, పసుపు ఆధారిత ఉత్పత్తుల ఎగుమతిదారుల నుంచి ఇద్దరు సభ్యులు, సుగంధద్రవ్యాల బోర్డు కార్యదర్శి, కోజికోడ్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ డైరెక్టర్, గువాహటిలోని నైపర్ డైరెక్టర్, జాతీయ ఔషధ మొక్కల బోర్డు సీఈవో లు పసుపు బోర్డులో ఉంటారు. ఛైర్‌పర్సన్, సభ్యుల పదవీకాలం మూడేళ్లు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఈ బోర్డు కనీసం రెండు సార్లు సమావేశం కావాల్సి ఉంటుంది. అన్ని సమావేశాలూ ఛైర్‌పర్సన్ నేతృత్వంలో జరుగుతాయి. ఛైర్‌పర్సన్ లేకపోతే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల్లో సీనియర్ వ్యక్తి నేతృత్వం వహిస్తారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Durgam Lake Encroachment Case: దుర్గం చెరువు కబ్జా కేసులో బాలకృష్ణ పేరు తెచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్
దుర్గం చెరువు కబ్జా కేసులో బాలకృష్ణ పేరు తెచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - నిరూపించాలని ప్రభుత్వానికి సవాల్
Renewing Driving License: 2026లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చాలా ఈజీ! గడువులోగా ఆన్‌లైన్‌లో ఇలా రెన్యువల్ చేసుకోండి!
2026లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చాలా ఈజీ! గడువులోగా ఆన్‌లైన్‌లో ఇలా రెన్యువల్ చేసుకోండి!
BRS Assembly Boycott: బీఆర్ఎస్ అసెంబ్లీ బహిష్కరణ - అసెంబ్లీని గాంధీభవన్‌లా నిర్వహిస్తున్నారని ఆగ్రహం
బీఆర్ఎస్ అసెంబ్లీ బహిష్కరణ - అసెంబ్లీని గాంధీభవన్‌లా నిర్వహిస్తున్నారని ఆగ్రహం
Embed widget