అన్వేషించండి

MLC Kavitha: 'TSPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలి' - చంద్రబాబు బాటలో సీఎం రేవంత్ నడుస్తున్నారంటూ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

BRS Mlc Kavitha Comments: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలు వస్తోన్న TSPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలని డిమాండ్ చేశారు.

BRS Mlc Kavtitha Comments on CM Revanth Reddy: అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ (Congress) నేతలు అబద్ధాలు చెప్పడం మానడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మండిపడ్డారు. బంజారాహిల్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ ఎన్నడూ 'జై తెలంగాణ' అని అనలేదని.. రాష్ట్ర గీతం గురించి ఆయన మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం తనలా ఉందని సీఎం అంటున్నారని.. తాను కూడా తెలంగాణ ఆడబిడ్డనే కదా.? అని ప్రశ్నించారు. 'బీఆర్ఎస్ హయాంలో డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డిని (Mahendar Reddy) అప్పుడు రేవంత్ రెడ్డి దూషించారు. మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా ఆయన్ను తప్పించి, న్యాయ విచారణ కు ఆదేశించాలి. ఈ విషయమై త్వరలోనే గవర్నర్ ను కలుస్తా' అని తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఆంధ్రా వ్యక్తిని ఎలా నియమించారు.? అని నిలదీశారు. వాళ్లు తెలంగాణ యువతకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రాజకీయాలకు సంబంధమున్న వారిని కమిషన్ సభ్యులుగా నియమించబోమని సీఎం అన్నారని గుర్తు చేశారు. టీడీపీలో పని చేసిన రజని కుమారిని కమిషన్ సభ్యురాలిగా ఎలా నియమించారు.? అని అన్నారు. విద్యుత్తు సంస్థలో ఆంధ్రా అధికారుల పెత్తనమేంటని? ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసును వాదించిన న్యాయవాదులకు సీఎం అందలం ఎక్కించారని ఆరోపించారు. గురువు చంద్రబాబు బాటలో నడుస్తున్న శిష్యుడు సీఎం రేవంత్ రెడ్డి అని.. ఆయనలో పచ్చ రక్తం ప్రహిస్తోందని మండిపడ్డారు.

సింగరేణి ఉద్యోగాలపై

సింగరేణి ఉద్యోగ మేళా సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై కవిత కౌంటర్ ఇచ్చారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పోగొట్టింది కాంగ్రెస్సే అని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో 20 వేల డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చామని.. జీఎం స్థాయిలో చేయాల్సిన పనిని సీఎం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా 400 ఉద్యోగాలు ఇచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తమ హయాంలో ఇచ్చినట్లుగా చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. సింగరేణిలో ఉద్యోగాల సంఖ్యను పెంచేందుకు గత బీఆర్ఎస్ సర్కారు ప్రయత్నించిందని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలోనే సింగరేణి ఉద్యోగాల్లో కోత విధించారని ఆరోపించారు.

'చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తోందా.?'

రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలయ్యాయని కవిత మండిపడ్డారు. విద్యుత్ సంస్థల్లో ఆంధ్ర వాళ్లను డైరెక్టర్లుగా ఎందుకు నియమించారని ప్రశ్నించారు.?. చంద్రబాబు డైరెక్షన్ లో తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నట్లుందని ఆరోపించారు. అర్హత లేని వ్యక్తులను సలహాదారులుగా నియమించారని.. తెలంగాణ అసెంబ్లీకి ఏపీ అడ్వైజర్ ఎందుకని నిలదీశారు. గతంలో సలహాదారులే వద్దన్న సీఎం ఇప్పుడు వారిని ఎలా నియమిస్తున్నారని నిలదీశారు. రేవంత్ రెడ్డి తరఫున ఓటుకు నోటు కేసు విచారించిన లాయర్లకు ప్రభుత్వం తరఫున జీతాలిస్తున్నారని ధ్వజమెత్తారు.

Also Read: 200 Units Free Power: రేషన్‌ కార్డు ఉన్న వారికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ గృహజ్యోతి పథకం-త్వరలోనే జీవో జారీ

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?
గులాబీ కోటలపై కాంగ్రెస్ పంజా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలించేనా?
Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు చార్జిషీట్.. ఏ1గా కేటీఆర్‌, క్విడ్ ప్రోకో జరిగిందన్న ఏసీబీ
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
CM Revanth Reddy: గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

5 key Reasons behind Trump's decision to halt war | ఇరాన్ పై 5 రోజులపాటు దాడులకు విరామం ప్రకటించిన ట్రంప్. ఆయన నిర్ణయం వెనుక 5 ప్రధాన కారణాలపై విశ్లేషణ
MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget