అన్వేషించండి

200 Units Free Power: రేషన్‌ కార్డు ఉన్న వారికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ గృహజ్యోతి పథకం-త్వరలోనే జీవో జారీ

200 యూనిట్ల ఉచిత కరెంట్‌ కోసం నిబంధనలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. తొలిదశలో రేషన్‌కార్డు, ఆధార్‌, సెల్‌ఫోన్‌ నంబర్‌ అనుసంధానమైన కరెంటు కనెక్షన్లకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది.

Telangana Griha Jyoti Scheme: ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ... ఆ హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు హామీలను అమలు చేస్తోంది. మరో రెండు హామీల అమలు చేసేందుకు కసరత్తు  చేస్తోంది. అమలు చేయబోతున్న రెండు హామీల్లో ఒకటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌. ఆ హామీ అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం... కొన్ని షరతులు పెడుతోంది. ఉచిత విద్యుత్‌ పొందాలంటే.. తెల్ల రేషన్ కార్డును  తప్పనిసరి చేసింది. అంతేకాదు.. రేషన్‌కార్డు, ఆధార్‌, సెల్‌ఫోన్‌ నంబరు అనుసంధానమైన కరెంటు కనెక్షన్లు ఉన్న ఇళ్లకు మాత్రమే తొలిదశలో 200 యూనిట్ల ఉచిత్‌ విద్యుత్ సరఫరా చేయాలని భావిస్తోంది. అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు  ఈ మూడింటినీ ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా... విద్యుత్‌ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు. 

గ్యారెంటీ పథకాల అమలు కోసం... జనవరిలో దరఖాస్తులు స్వీకరించింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఆరు గ్యారెంటీలకు ఒకే ధరఖాస్తు తయారు చేసి ఇచ్చింది. ప్రజాపాలన పేరుతో గ్రామసభలు పెట్టి... ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంది. ఇందులో  82లక్షల మంది ఉచిత కరెంటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 10లక్షల మందికి రేషన్‌కార్డులు లేవు. వీరికి తొలిదశలో ఉచిత విద్యుత్‌ సరఫరా సాధ్యం కాదు. వీరికి పక్కన పెడితే... మిగిలిన 72లక్షల మందిలో 30 శాతం మంది రేషన్‌కార్డు,  ఆధార్‌, సెల్‌ఫోన్‌ నెంబర్లు సరిగా నమోదు చేయలేదు. నిన్నటి (ఫిబ్రవరి 7వ తేదీ) నుంచి ఇంటింటికీ వెళ్తున్న విద్యుత్‌ సిబ్బంది... ఈ వివరాలను మళ్లీ నమోదు చేస్తున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ విషయానికి వస్తే.... గ్రేటర్‌ పరిధిలో సుమారు 50 లక్షల విద్యుత్‌ కనెక్షన్లున్నాయి. వీటిలో దాదాపు 30 లక్షల కనెక్షన్లు... నెలకు 200 యూనిట్లలోపు కరెంట్‌ వాడుతున్నవే. అయితే... ఇందులో 20లక్షల మంది మాత్రమే ఉచిత  కరెంటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. 10లక్షల మంది దరఖాస్తు చేసుకోలేదు. ఉచిత విద్యుత్‌ కోసం దరఖాస్తు చేసుకున్న 20లక్షల మందిలో 5 లక్షల మంది రేషన్‌ కార్డు వివరాలు ఇవ్వలేదు. వీటిని సరిచేసేందుకు విద్యుత్‌ సిబ్బంది ఇంటింటికీ  వెళ్తున్నారు. రేషన్‌, ఆధార్‌తోపాటు ఫోన్‌ నెంబర్‌ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. రాష్ట్రమంతటా ఈ ప్రక్రియ పూర్తయ్యాక.. ఎన్ని ఇళ్లకు ఉచిత కరెంటు సరఫరా చేయాలన్న లెక్క తేలుతుంది. 

ఇక... ఉచిత్ విద్యుత్‌ స్కీమ్‌ వర్తించాలంటే.. 200 యూనిట్ల లోపే విద్యుత్‌ వినియోగించి ఉండాలి. 2022-2023 ఆర్ధిక సంవత్సరానికి 2,181 యూనిట్ల లోపే కరెంట్‌ వాడుండాలి. గత ఏడాది 200 యూనిట్ల వరకు వాడిన ఇళ్లకు.... ఇప్పుడు నెలకు  ఉచితంగా 200 యూనిట్ల వరకు ఇస్తారు. గత ఏడాది ఒక ఇంటిలో నెలకు సగటున 90 యూనిట్ల వరకే వాడుంటే... దానికి పది శాతం కోటా కింద 9 యూనిట్లు కలిపి.. మొత్తం 99 యూనిట్లకు మాత్రమే ఉచితంగా కరెంటు ఇచ్చే విధానం కర్ణాటకలో  అమలవుతోంది. ఇక్కడ కూడా దాన్నే అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ భావిస్తోంది. దీంతోపాటు.... ఒక ఇంటికి ఒక మీటర్‌ ఉన్న వారికే ఉచిత విద్యుత్‌ స్కీమ్‌ అమలు చేయాలన్న నిబంధన కూడా పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ నిబంధన  పెడితే... అద్దె ఇళ్లలో ఉండే వారికి లబ్దిజరగకపోవచ్చు. మీటర్ రీడింగ్ తీసే సిబ్బందితోనే లబ్దిదారులను గుర్తిస్తారు. మీటర్ రీడర్‌కు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ లింక్ చేసి రీడింగ్ తీస్తారు. ఈ విధానంలో కరెంట్ ఫ్రీగా ఇచ్చే  లబ్దిదారులను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేస్తారు.

మరోవైపు... ఉచిత కరెంట్‌ లబ్ధిదారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే జీవో జారీచేయబోతోంది. జీవో విడుదలైతే దీనిపై ఒక క్లారిటీ వస్తుంది. ఇక... నిబంధనల ప్రకారం ఉచిత విద్యుత్‌ పథకానికి అర్హులైన వారి వివరాలను ఆన్‌లైన్‌లో  నమోదు చేయడానికి డిస్కంలు ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nellore Mayor Resignation: నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Itlu Arjuna Teaser : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్

వీడియోలు

Abhishek Sharma to Break Virat Record | కోహ్లీ అరుదైన రికార్డుపై కన్నేసిన అభిషేక్
India vs South Africa 3rd T20 | భారత్ x సౌతాఫ్రికా మూడో టీ20
Robin Uthappa on Gambhir Ind vs SA | గంభీర్ పై ఉత్తప్ప కామెంట్స్
Suryakumar Yadav Form in SA T20 Series | సూర్య కుమార్ యాదవ్ పై ట్రోల్స్
Leonel Messi Kolkata Tour Hightension | కోల్ కతా సాల్ట్ లేక్ స్టేడియంలో తీవ్ర ఉద్రిక్తత | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nellore Mayor Resignation: నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
నెల్లూరు మేయర్ స్రవంతి రాజీనామా.. వాట్సాప్‌లో కలెక్టర్‌కు లేఖ
IND vs SA 3rd T20: ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
ధర్మశాలలో భారత్- దక్షిణాఫ్రికా మూడో టీ20.. పిచ్, వెదర్ రిపోర్ట్ సహా లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
CM Revanth Reddy: తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్
Itlu Arjuna Teaser : ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
ప్రొడ్యూసర్‌గా మారిన డైరెక్టర్ - కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్... ఇంట్రెస్టింగ్‌గా 'ఇట్లు అర్జున' టీజర్
The Paradise : నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
నేచరల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' మేకింగ్ వీడియో - రక్తం పడిన తర్వాతే హిస్టరీ ఓపెన్
Mowgli First Day Collection : రోషన్ కనకాల 'మోగ్లీ' - సుమ కొడుకు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
రోషన్ కనకాల 'మోగ్లీ' - సుమ కొడుకు మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Top Mileage Cars in India: వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
వ్యాగన్ ఆర్ నుంచి టాటా పంచ్ వరకు.. రూ.10 లక్షలలోపు అధిక మైలేజ్ ఇచ్చే కార్లు
Pawan Kalyan Helps Cricketers: అంధ క్రికెటర్లు దీపిక, ప్లేయర్ కరుణ కుమారి కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్
అంధ క్రికెటర్ల కుటుంబాలకు అండగా నిలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Embed widget