అన్వేషించండి

200 Units Free Power: రేషన్‌ కార్డు ఉన్న వారికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ గృహజ్యోతి పథకం-త్వరలోనే జీవో జారీ

200 యూనిట్ల ఉచిత కరెంట్‌ కోసం నిబంధనలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. తొలిదశలో రేషన్‌కార్డు, ఆధార్‌, సెల్‌ఫోన్‌ నంబర్‌ అనుసంధానమైన కరెంటు కనెక్షన్లకు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది.

Telangana Griha Jyoti Scheme: ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ... ఆ హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రెండు హామీలను అమలు చేస్తోంది. మరో రెండు హామీల అమలు చేసేందుకు కసరత్తు  చేస్తోంది. అమలు చేయబోతున్న రెండు హామీల్లో ఒకటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌. ఆ హామీ అమలుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం... కొన్ని షరతులు పెడుతోంది. ఉచిత విద్యుత్‌ పొందాలంటే.. తెల్ల రేషన్ కార్డును  తప్పనిసరి చేసింది. అంతేకాదు.. రేషన్‌కార్డు, ఆధార్‌, సెల్‌ఫోన్‌ నంబరు అనుసంధానమైన కరెంటు కనెక్షన్లు ఉన్న ఇళ్లకు మాత్రమే తొలిదశలో 200 యూనిట్ల ఉచిత్‌ విద్యుత్ సరఫరా చేయాలని భావిస్తోంది. అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు  ఈ మూడింటినీ ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వీటి ఆధారంగా... విద్యుత్‌ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేస్తున్నారు. 

గ్యారెంటీ పథకాల అమలు కోసం... జనవరిలో దరఖాస్తులు స్వీకరించింది కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఆరు గ్యారెంటీలకు ఒకే ధరఖాస్తు తయారు చేసి ఇచ్చింది. ప్రజాపాలన పేరుతో గ్రామసభలు పెట్టి... ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంది. ఇందులో  82లక్షల మంది ఉచిత కరెంటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 10లక్షల మందికి రేషన్‌కార్డులు లేవు. వీరికి తొలిదశలో ఉచిత విద్యుత్‌ సరఫరా సాధ్యం కాదు. వీరికి పక్కన పెడితే... మిగిలిన 72లక్షల మందిలో 30 శాతం మంది రేషన్‌కార్డు,  ఆధార్‌, సెల్‌ఫోన్‌ నెంబర్లు సరిగా నమోదు చేయలేదు. నిన్నటి (ఫిబ్రవరి 7వ తేదీ) నుంచి ఇంటింటికీ వెళ్తున్న విద్యుత్‌ సిబ్బంది... ఈ వివరాలను మళ్లీ నమోదు చేస్తున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ విషయానికి వస్తే.... గ్రేటర్‌ పరిధిలో సుమారు 50 లక్షల విద్యుత్‌ కనెక్షన్లున్నాయి. వీటిలో దాదాపు 30 లక్షల కనెక్షన్లు... నెలకు 200 యూనిట్లలోపు కరెంట్‌ వాడుతున్నవే. అయితే... ఇందులో 20లక్షల మంది మాత్రమే ఉచిత  కరెంటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. 10లక్షల మంది దరఖాస్తు చేసుకోలేదు. ఉచిత విద్యుత్‌ కోసం దరఖాస్తు చేసుకున్న 20లక్షల మందిలో 5 లక్షల మంది రేషన్‌ కార్డు వివరాలు ఇవ్వలేదు. వీటిని సరిచేసేందుకు విద్యుత్‌ సిబ్బంది ఇంటింటికీ  వెళ్తున్నారు. రేషన్‌, ఆధార్‌తోపాటు ఫోన్‌ నెంబర్‌ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. రాష్ట్రమంతటా ఈ ప్రక్రియ పూర్తయ్యాక.. ఎన్ని ఇళ్లకు ఉచిత కరెంటు సరఫరా చేయాలన్న లెక్క తేలుతుంది. 

ఇక... ఉచిత్ విద్యుత్‌ స్కీమ్‌ వర్తించాలంటే.. 200 యూనిట్ల లోపే విద్యుత్‌ వినియోగించి ఉండాలి. 2022-2023 ఆర్ధిక సంవత్సరానికి 2,181 యూనిట్ల లోపే కరెంట్‌ వాడుండాలి. గత ఏడాది 200 యూనిట్ల వరకు వాడిన ఇళ్లకు.... ఇప్పుడు నెలకు  ఉచితంగా 200 యూనిట్ల వరకు ఇస్తారు. గత ఏడాది ఒక ఇంటిలో నెలకు సగటున 90 యూనిట్ల వరకే వాడుంటే... దానికి పది శాతం కోటా కింద 9 యూనిట్లు కలిపి.. మొత్తం 99 యూనిట్లకు మాత్రమే ఉచితంగా కరెంటు ఇచ్చే విధానం కర్ణాటకలో  అమలవుతోంది. ఇక్కడ కూడా దాన్నే అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ భావిస్తోంది. దీంతోపాటు.... ఒక ఇంటికి ఒక మీటర్‌ ఉన్న వారికే ఉచిత విద్యుత్‌ స్కీమ్‌ అమలు చేయాలన్న నిబంధన కూడా పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ నిబంధన  పెడితే... అద్దె ఇళ్లలో ఉండే వారికి లబ్దిజరగకపోవచ్చు. మీటర్ రీడింగ్ తీసే సిబ్బందితోనే లబ్దిదారులను గుర్తిస్తారు. మీటర్ రీడర్‌కు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ లింక్ చేసి రీడింగ్ తీస్తారు. ఈ విధానంలో కరెంట్ ఫ్రీగా ఇచ్చే  లబ్దిదారులను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేస్తారు.

మరోవైపు... ఉచిత కరెంట్‌ లబ్ధిదారులను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే జీవో జారీచేయబోతోంది. జీవో విడుదలైతే దీనిపై ఒక క్లారిటీ వస్తుంది. ఇక... నిబంధనల ప్రకారం ఉచిత విద్యుత్‌ పథకానికి అర్హులైన వారి వివరాలను ఆన్‌లైన్‌లో  నమోదు చేయడానికి డిస్కంలు ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
CM Revanth Reddy: గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
Rangareddy Crime News: సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన
సహజీవనం చేసి వివాహిత దారుణహత్య.. బైకు మీద డెడ్‌బాడీ 50 కి.మీ తీసుకెళ్లిన నిందితుడు.. రంగారెడ్డిలో ఘటన

వీడియోలు

MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget