అన్వేషించండి

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో జల జగడం - ప్రభుత్వం Vs బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మధ్య వాడీ వేడీ వాదనలు

Telangana Assembly Sessions 2024: కృష్ణా ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై తెలంగాణ అసెంబ్లీలో వాడీ వేడీ వాదనలు సాగాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య హాట్ కామెంట్స్ హీట్ పుట్టించాయి.

BRS Mla Harish Rao Hot Comments in Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో జల జగడం తీవ్రమైంది. కృష్ణా నదీ జలాలు, కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై శాసనసభలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడీ వేడీ వాదనలు సాగాయి. దక్షిణాది తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాలకు సంబంధించి అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే.. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చలో పాల్గొనకుండా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు. శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కరీంనగర్ నుంచి తరిమికొడితే.. మహబూబ్ నగర్ వాసులు ఎంపీగా గెలిచారని పరోక్షంగా కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'పదేళ్లు జరిగిన పాపాలకు కారణం కేసీఆరే. ఆయన పాపాల భైరవుడు. కృష్ణా జలాల్లో ఎవరు వాటా అమ్ముకున్నారు? ఎవరు విందుకు అవకాశమిచ్చారు. కేసీఆర్ ను సభకు రమ్మనండి. ఎంతసేపు మాట్లాడుతామన్నా మైక్ ఇస్తాం. ఆయన అడిగిన వాటికి సమాధానం చెబుతాం.' అని అన్నారు. సీఎం వ్యాఖ్యలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తప్పుబట్టారు. తెలంగాణ ఉద్యమం గురించి సీఎం రేవంత్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని అన్నారు. ఆయన్ను కొడంగల్ నుంచి తరిమికొడితే.. మల్కాజిగిరి వచ్చారా.? అని ప్రశ్నించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. హరీష్ వ్యాఖ్యలపై మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్, భట్టి, పొన్నం ప్రభాకర్ అభ్యంతరం తెలిపారు. 

కోమటిరెడ్డి Vs హరీష్ రావు

తొలుత కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం గత ప్రభుత్వం విధానాలు, లోపాల వల్లే జల దోపిడీ జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభ్యంతరం తెలిపారు. నల్గొండలో ఈ నెల 13న బీఆర్ఎస్ సభ పెట్టడంతోనే.. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ పూర్తిగా అసత్యమైన ప్రజెంటేషన్ ఇచ్చారని మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలగజేసుకుని ఏపీ సీఎం జగన్ స్టేట్ మెంట్ విన్న తర్వాత కేసీఆర్ తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ కు నల్గొండ ప్రజలు చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పదేళ్లు సీఎంగా చేసిన వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలు సరికావని.. అమేథీలో రాహుల్ ను కూడా ప్రజలు చెప్పుతో కొట్టినట్టేనా అని నిలదీశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చివరకు, స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని ప్రకటించారు.

కేసీఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి తమ జిల్లాను మోసం చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పుణ్యం వల్ల వ్యవసాయం సంగతి పక్కన పెడితే తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు. జగదీశ్ రెడ్డికే ముఖం చెల్లకే నేడు సభకు రాలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఆయన నల్గొండ సభకు రావాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాధించిన కేసీఆర్ ను అలా అనడం సరికాదని.. కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అటు, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. హరీష్ రావు తీరును తప్పుబట్టారు. వాద ప్రతివాదనలతో అసెంబ్లీలో హీట్ వాతావరణం నెలకొంది.

Also Read: Telangana Assembly: 'కృష్ణా ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించడం లేదు' - జల దోపిడీ అడ్డుకుంటామని మంత్రి ఉత్తమ్ ప్రకటన

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Telangana Assembly: తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులకు షాక్ -వేతనంలో 15 శాతం కోతకు తెలంగాణ సర్కార్ చట్టం
తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగులకు షాక్ -వేతనంలో 15 శాతం కోతకు తెలంగాణ సర్కార్ చట్టం
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Affordable Mileage Cars: రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
Embed widget