By: ABP Desam | Updated at : 18 Dec 2021 04:06 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
దేవీశ్రీపై రాజాసింగ్ ఫిర్యాదుే
ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ పుష్ప సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఐటమ్ సాంగ్, దేవుళ్ల పాటలు ఒకటే అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశారు. దేవీశ్రీ ప్రసాద్ పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దేవీశ్రీ ప్రసాద్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం...లారీని ఢీకొట్టిన కారు, ఆరుగురి మృతి
పుష్ప సాంగ్ పై కూడా వివాదం
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీకి సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో పాటలు కూడా బాగా హిట్ అయ్యాయి. కానీ సినిమాలో స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా ఉఊ అంటావా'పై వివాదం చెలరేగింది. మగవాళ్లను తప్పుబట్టే విధంగా ఉందని పురుషసంఘాలు కోర్టుకెక్కాయి. ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్ లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన దేవీశ్రీ ప్రసాద్.. తనకు ఐటమ్ సాంగ్, డివోషనల్ సాంగ్స్ రెండూ ఒక్కటే అన్నారు.
Also Read: ఆ అమ్మాయిలు రాత్రి మద్యం సేవించారు.. ఆపై నా మాట వినలేదు.. జూనియర్ ఆర్టిస్ట్ సిద్ధు ఆవేదన
దేవీశ్రీ క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఐటమ్ సాంగ్స్ రింగ రింగా, ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా, ఈ రెండు పాటలను భక్తి పాటలుగా భావిస్తానని, వాటి లిరిక్స్ మార్చి పాడాడు దేవీశ్రీ ప్రసాద్. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. పాట పాడుకోండి కానీ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా పాడకండని ట్రోల్ చేశారు. హిందూ దేవుళ్లను కించపరిచారంటూ నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమంత కూడా క్షమాపణలు చెప్పాలని సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ను హెచ్చరించారు. పుష్ప సినిమా ఐటమ్ సాంగ్లో పదాలను దేవుడి శ్లోకాలతో పోల్చటాన్ని ఖండించారు. దేవీశ్రీ ప్రసాద్ హిందువుల మనోభావాలను కించపరిచారని, వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఇప్పుడు వివాదంగా మారుతున్న ఈ వ్యవహారంపై దేవీశ్రీ ప్రసాద్ ఎలా స్పందిస్తున్నారో ఆసక్తికరంగా మారింది.
Also Read: బెజవాడ 'ఖాకీ'ల సాహసం... గుజరాత్ వెళ్లి చెడ్డీ గ్యాంగ్ కు వల ... ముగ్గురు నిందితులు అరెస్టు
Weather Latest Update: సండే మండే, రెండు రోజులు అసలు బయటకు వెళ్లొద్దు- సూరన్నతో కాస్త జాగ్రత్త
NITW MBA Admissions: నిట్ వరంగల్లో ఎంబీఏ ప్రోగ్రామ్, ప్రవేశం ఇలా!
NTR Centenary Celebrations: రంగమేదైనా ఆయనే హీరో-శకపురుషుని కథనాల సమాహారం
TS EAMCET Counselling: ఎంసెట్లో ఏ ర్యాంక్కు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోండి! గతేడాది సీట్ల కేటాయింపు ఇలా!
UPSC 2023 Civils Exam: నేడే సివిల్ సర్వీసెస్ 'ప్రిలిమ్స్' పరీక్ష, అభ్యర్థులకు ముఖ్య సూచనలు!
Telangana Politics : అయితే కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్ - పొంగులేటి, జూపల్లి డిసైడయ్యారా ?
New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
NT Rama Rao Jayanti : ఎన్టీఆర్ను దేవుడిని ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?
New Parliament Opening: కొత్త పార్లమెంట్పై RJD వివాదాస్పద ట్వీట్, శవపేటికతో పోల్చడంపై దుమారం