సెకండరీ పరీక్ష (పదో తరగతి) ఉత్తీర్ణులైన, ఉద్యోగ వేటలో ఉన్న యువతకు ప్రతి నెలా 1500 రూపాయల అలవెన్స్ను అందిస్తున్నారు.
West Bengal CM Mamata Banerjee: ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
West Bengal CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మార్చి 7 నుంచి పదోతరగతి పరీక్షలలో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతకు (21-40 సంవత్సరాలు) నెలకు రూ.1,500 భత్యం ప్రకటించారు.

- పశ్చిమ బెంగాల్ యువతకు నెలకు 1500 నిరుద్యోగ భృతి ప్రారంభించారు.
- రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 40% తగ్గి, 40 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందించారు.
- రైతులకు వార్షిక ₹10,000 ఆర్థిక సాయం, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టారు.
- దేవ్చా పచామి బొగ్గు ప్రాజెక్టుతో లక్ష మందికి ఉపాధి, విద్యుత్ కొరత తీరుతుంది.
West Bengal CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర యువతకు, రైతులకు భారీ వరాలు ప్రకటించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో సరికొత్త పథకాన్ని ఆమె ప్రారంభించారు. బెంగాల్ ఆర్థిక ముఖ చిత్రాన్ని మారుస్తూ, పారిశ్రామిక రంగంలో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని వివరిస్తూ ఆమె చేసిన ప్రసంగం ఇప్పుడు రాజకీయ,, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నెలకు 1500 నిరుద్యోగ భృతి
రాష్ట్రంలో నిరుద్యోగ యువతను స్వయం సమృద్ధి దిశగా నడిపించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మమత బెనర్జీ ప్రకటించారు. సెకండరీ పరీక్ష (పదో తరగతి) ఉత్తీర్ణులైన, ఉద్యోగ వేటలో ఉన్న యువతకు ప్రతి నెలా 1500 రూపాయల అలవెన్స్ను అందిస్తున్నట్టు ఆమె ప్రకటించారు.
వాస్తవానికి ఈ పథకం ఏప్రిల్్ 1 నుంచి ప్రారంభంకావాల్సి ఉండగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా యువతకు బహుమతిగా మార్చి ఈ నెల నుంచి ప్రారంభిస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండి మరే ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కాని సుమారు కోటి మంది యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు. కేవలం స్కాలర్షిప్ పొందే విద్యార్థులకు కూడా ఈ యువ సాథి పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు.
పారిశ్రామిక ప్రగతి బాటలు
పశ్చిమ బెంగాల్లో నిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గిందని మమత వెల్లడించారు. రాష్ట్రంలో నిరుద్యోగం 40 శాతం మేర తగ్గిందని తెలిపారు. సుమారు 40 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. ఉత్కర్ష బంగ్లా పోర్టల్ ద్వారా పారిశ్రామికవేత్తల వెబ్సైట్లను ఇంటర్లింక్ చేయడం వల్ల శిక్షణ పొందిన పది లక్షల మందికి పైగా యువతకు ఉపాధి లభించిందని ఆమె వివరించారు.
ఐటీ రంగంలో బెంగాల్ అగ్రగామిగా ఎదుగుతోందని చెబుతున్నారు. బెంగళూరు కంటే కోల్కతాలోనే ఐటీ రంగంలో ఎక్కువ మందికి ఉపాధి లభిస్తోందని వెల్లడించారు. ఇటీవల కాలంలోనే సుమారు 200 కొత్త కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయని ఆమె తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగంలో కూడా బెంగాల్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని, సుమారు 1.5 కోట్ల మంది ఈ చిన్న తరహా పరిశ్రమల ద్వారా జీవనోపాధి పొందుతున్నారని వెల్లడించారు.
వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పన
రైతుల సంక్షేమం కోసం బెంగాల్ ప్రభుత్వం ప్రతి ఏటా 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో తక్కువ భూమి ఉన్న వారికి నాలుగు వేలు ఇచ్చామని ఇప్పుడు భూమి లేని వారికి కూడా నాలుగు వేలు సాయం ప్రకటించామని వివరించారు.
రాష్ట్రవ్యాప్త కనెక్టివిటీ కోసం ఆరు ఆర్థిక కారిడార్ల నిర్మాణం జరుగుతోందని, సల్బోనిలో 1600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు భారీ విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తున్నామని వివరించారు. బంతాలాలోని లెద్ హబ్ ద్వారా 7.5 లక్షల మందికి ఉపాధి లభిస్తోందని, రాష్ట్రంలోని 12లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలు అద్భుతమైన పని తీరు కనబరుస్తున్నారని ప్రశంసించారు.
భవిష్యత్పై భరోసాకు దేవ్చా పచామి ప్రాజెక్టు
బీర్భూమ్ జిల్లాలోని దేవ్చా పచామి బొగ్గు నిక్షేపాల ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్ను మార్చబోతోందని మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, రాబోయే వందేళ్ల వరకు రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని ఆమె హామీ ఇచ్చారు.
Frequently Asked Questions
పశ్చిమ బెంగాల్లో నిరుద్యోగ యువతకు నెలకు ఎంత భృతి లభిస్తుంది?
యువ సాథి పథకానికి ఎవరు అర్హులు?
21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉండి, మరే ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు కాని వారు, స్కాలర్షిప్ పొందే విద్యార్థులు కూడా ఈ పథకానికి అర్హులు.
పశ్చిమ బెంగాల్లో నిరుద్యోగ రేటు ఎంత తగ్గింది?
రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 40 శాతం మేర తగ్గింది. సుమారు 40 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చారు.
ఐటీ రంగంలో పశ్చిమ బెంగాల్ ప్రగతి ఏమిటి?
ఐటీ రంగంలో బెంగాల్ అగ్రగామిగా ఎదుగుతోంది. బెంగళూరు కంటే కోల్కతాలోనే ఐటీ రంగంలో ఎక్కువ మందికి ఉపాధి లభిస్తోంది.
రైతులకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఏ విధంగా సహాయం అందిస్తోంది?
రైతులకు ప్రతి ఏటా 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. గతంలో తక్కువ భూమి ఉన్న వారికి, ఇప్పుడు భూమి లేని వారికి కూడా నాలుగు వేలు సాయం ప్రకటించారు.
ట్రెండింగ్ వార్తలు























