అన్వేషించండి

Bhatti Vikramarka: చంద్రబాబు గురువు కాదు, రేవంత్ శిష్యుడు కాదు - ఆ వ్యాఖ్యలపై భట్టి సీరియస్

Chandrababu Revanth Reddy News: బుధవారం (జూన్ 3) తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతకుముందు మంత్రి కోమటిరెడ్డితో కలిసి మిషన్ భగీరథపై రివ్యూ చేశారు.

Telangana News: చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అనే మాటలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. అలా అనకూడదని రేవంత్ రెడ్డి చాలా సార్లు చెప్పారని భట్టి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఎలాంటి గురువు కాదని, చంద్రబాబు రేవంత్ రెడ్డికి కేవలం సహచరుడు మాత్రమే అని స్పష్టం చేశారు. అది కూడా కొన్నేళ్ళ క్రితం నాటి పరిస్థితి అన్నారు. ఇప్పుడు ఎవరిదారి వారిదని, చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి అయితే, రేవంత్ రెడ్డి తెలంగాణకు సీఎం అని అన్నారు.

‘‘ఇద్దరు సహచర ముఖ్యమంత్రులమే తప్ప గురు శిష్యులం కాదని రేవంత్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు. విభజన చట్టంలో ఏడు మండలాల విలీనం అంశం లేదు. బీఆర్ఎస్ ఆర్డినెన్స్ తెచ్చి ఏపీకి అప్పజెప్పింది. ఏడు మండలాలు పోవడానికి కారణం బీఆర్ఎస్, బీజేపీలే’’ అని భట్టి విక్రమార్క అన్నారు.

మిషన్ భగీరథపై భట్టి రివ్యూ
మిషన్ భగీరథ పథకం కింద రూ.42 వేల కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలోని 1150 ఆవాసాలకు 50 శాతం నీళ్ళు సరఫరా చేస్తున్నామని ప్రస్తుతం చెబుతున్నారు. ఇదే పథకం కింద రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతుందని, నీటి ఎద్దడి లేదని సర్పంచుల సంతకాలతో గతంలో అసెంబ్లీలో ప్రకటించారు. కేంద్రానికి నివేదిక పంపారు.. అంటే ఆనాటి ప్రకటన భోగస్ అని భావించాలా అని డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మల్లు అధికారులను ప్రశ్నించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి అధికారులతో భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో 23,824 ఆవాసాలు ఉండగా 1156 ఆవాసాల్లో 50 శాతం మాత్రమే నీళ్లు ఇవ్వగలుగుతున్నాం అంటున్నారు, ఆలేరు, భువనగిరి, నల్గొండ నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలకు తాగునీరు అందడం లేదు నిధులు కావాలని మీ శాఖ నుంచే ఫైల్ రావడం ఏంటని డిప్యూటీ సీఎం మిషన్ భగీరథ అధికారులను ప్రశ్నించారు. మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి సరఫరా పై ప్రస్తుతం జరుగుతున్న సర్వే, అది ఎప్పుడు పూర్తవుతుంది తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. సర్వే పూర్తికాగానే రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలకు ఆ నివేదికలు అందజేసి... తాగునీరు అందుతుందన్న విషయాన్ని వారి ద్వారా నిర్ధారణ చేసుకోవాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు.

42 వేల కోట్లు ఖర్చు చేసిన ఇంకా తాగునీటి ఎద్దడి ఉందని కొత్తగూడెం, ఆలేరు అంటే నియోజకవర్గాల్లో అదనపు నిధులు కోరుతున్నారు.. ఇదేంటని ప్రశ్నించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీలకు హైదరాబాద్ మెట్రో నుంచి తాగునీటిని సరఫరా చేస్తుండగా ఆయా మున్సిపాలిటీలు మిషన్ భగీరథ కింద మంచి రెడ్డి సరఫరా చేస్తున్నట్టు రికార్డుల్లో ఎందుకు చూపిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. తాగునీటి సరఫరా కి ప్రధాన సోర్స్ ను వందల కిలోమీటర్ల నుంచి కాకుండా ప్రతి సమీపంలో నుంచి తీసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి తీసుకోవడం మూలంగా తరచూ పైప్ లైన్ లు  పగిలిపోవడం వంటివి ఉత్పన్నమై తాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. 

మిషన్ భగీరథ పథకం కింద పనిచేస్తున్న సిబ్బంది జీవితాలు నెలల తరబడి ఎందుకు పెండింగ్లో ఉంటున్నాయి అని ప్రశ్నించారు. ఒక్కో ప్రాంతంలో ఒకరకంగా కార్మికుల వేతనాలు ఉంటున్నాయి, 8000 నుంచి 13 వేల వరకు అందుతున్నట్టు నాకు సమాచారం ఉంది. ప్రభుత్వం అందిస్తున్న వేతనాల నిధుల్లో ఎక్కువ మొత్తం ఏజెన్సీలు కట్ చేసుకుని మిషన్ భగీరథ కార్మికులకు తక్కువ జీతాలు ఇస్తున్నారు దీనిపై సమీక్ష చేయాలని అధికారులను ఆదేశించారు.  ప్రభుత్వం అందిస్తున్న వేతనాలు  కార్మికులకు ప్రయోజనం చేకూర్చాల తప్ప మధ్య భక్తులకు కాదని అన్నారు.  రాష్ట్రంలో మొత్తం ఉన్న ఏజెన్సీలు ఎన్ని, ప్రభుత్వం ఇస్తున్న వేతనాలు, ఏజెన్సీలు కార్మికులకు ఇస్తున్న వేతనాల వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ కార్మికులకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకంగా వేతనాలు ఉండేలా ఫిక్స్ చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పథకం కోసం చేసిన వేల కోట్ల అప్పు చెల్లిస్తున్న పథకం ప్రయోజనం పూర్తిస్థాయిలో నెరవేరడం లేదని డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్కమాలు అన్నారు. సమీక్ష సమావేశంలో స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తాన్య, మెంబర్ సెక్రెటరీ టీఎస్ ఫైనాన్స్ కమిషన్ స్మిత సబర్వాల్, స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
Kumbh Mela Mona Lisa: మహాకుంభ్ వైరల్ గర్ల్ మోనాలిసా కొత్త లుక్‌లో మళ్లీ సెన్సేషన్ -   తెలుగు సినిమాల్లో ఎంట్రీ
మహాకుంభ్ వైరల్ గర్ల్ మోనాలిసా కొత్త లుక్‌లో మళ్లీ సెన్సేషన్ - తెలుగు సినిమాల్లో ఎంట్రీ
Balakrishna: ఆ సూపర్ స్టారూ వద్దు... ఈ కింగూ వద్దు... రెండు సినిమాలు రిజెక్ట్ చేసిన బాలకృష్ణ
ఆ సూపర్ స్టారూ వద్దు... ఈ కింగూ వద్దు... రెండు సినిమాలు రిజెక్ట్ చేసిన బాలకృష్ణ
Advertisement

వీడియోలు

పాక్ ప్లేయర్ తిక్క కుదిర్చిన ICC.. కానీ మన సూర్యకి అన్యాయం!
రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ బర్త్ డే స్పెషల్
ఫెషాలీ, దీప్తి కాదు.. తెలుగమ్మాయి వల్లే గెలిచాం: రవిచంద్రన్ అశ్విన్
అబ్బాయిలకో న్యాయం?  అమ్మాయిలకో న్యాయమా?
3i Atlas interstellar object | 9 ఏళ్లలో 3 సార్లు.. భూమి కోసమా? సూర్యుడి కోసమా? | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Akbaruddin Owaisi: అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే  - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
అధికారంలో రెడ్డి ఉన్నా.. రావు ఉన్నా హైదరాబాద్ మాదే - అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
Train Accident: చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
చునార్ రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం, రైలు ఢీకొని పలువురు దుర్మరణం
Kumbh Mela Mona Lisa: మహాకుంభ్ వైరల్ గర్ల్ మోనాలిసా కొత్త లుక్‌లో మళ్లీ సెన్సేషన్ -   తెలుగు సినిమాల్లో ఎంట్రీ
మహాకుంభ్ వైరల్ గర్ల్ మోనాలిసా కొత్త లుక్‌లో మళ్లీ సెన్సేషన్ - తెలుగు సినిమాల్లో ఎంట్రీ
Balakrishna: ఆ సూపర్ స్టారూ వద్దు... ఈ కింగూ వద్దు... రెండు సినిమాలు రిజెక్ట్ చేసిన బాలకృష్ణ
ఆ సూపర్ స్టారూ వద్దు... ఈ కింగూ వద్దు... రెండు సినిమాలు రిజెక్ట్ చేసిన బాలకృష్ణ
Trump defeat: పది నెలల్లోనే ట్రంప్‌ను తిరస్కరించిన అమెరికా -  స్థానిక ఎన్నికల్లో డెమోక్రాట్ల భారీ విజయం
పది నెలల్లోనే ట్రంప్‌ను తిరస్కరించిన అమెరికా - స్థానిక ఎన్నికల్లో డెమోక్రాట్ల భారీ విజయం
Chikiri Chikiri Song: చికిరి చికిరి... ట్రెండింగ్‌లో రామ్ చరణ్ హుక్ స్టెప్... చిరు, పవన్ కూడా సేమ్ స్టెప్పేస్తే?
చికిరి చికిరి... ట్రెండింగ్‌లో రామ్ చరణ్ హుక్ స్టెప్... చిరు, పవన్ కూడా సేమ్ స్టెప్పేస్తే?
IRCTC Tour Package: దుబాయ్, అబుదాబి వెళ్లాలనుకునేవారికి IRCTC టూర్ ప్యాకేజీ.. ఖర్చు, ప్లాన్ వివరాలివే
దుబాయ్, అబుదాబి వెళ్లాలనుకునేవారికి IRCTC టూర్ ప్యాకేజీ.. ఖర్చు, ప్లాన్ వివరాలివే
Hyderabad- Vijayawada National Highway: హైదరాబాద్ - విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణ, జాతీయ రహదారి 65 విస్తరణకు కేంద్రం నోటిఫికేషన్
హైదరాబాద్ - విజయవాడ హైవే 6 లేన్లుగా విస్తరణ, జాతీయ రహదారి 65 విస్తరణకు కేంద్రం నోటిఫికేషన్
Embed widget