అన్వేషించండి

Breaking News Live: సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీసులు ఇస్తాం.. పీఆర్సీ సాధన సమితి

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

Key Events
AP Telangana Breaking News Live Updates on 23 January 2022 Breaking News Live: సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీసులు ఇస్తాం.. పీఆర్సీ సాధన సమితి
ఏపీ, తెలంగాణ వెదర్ అప్‌డేట్స్ (Representational Image)

Background

తెలుగు రాష్ట్రాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అకాల వర్షాల ప్రభావంతో చలి తీవ్రత బాగా పెరిగిందని వాతావరణ కేంద్రం తెలిపింది.  ఏపీలో ఈశాన్య రుతుపవనాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు వాయువ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు ఏపీలో వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో నేటి నుంచి మూడు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోనూ నేడు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో కొన్ని చోట్ల వాతావరణం పొడిగా మారుతుంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఏపీలో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. అయితే మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి సమస్య ఉండదని అధికారులు సూచించారు.  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, యానాం, (పుదుచ్చేరి)లలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేశారు. అకాల వర్షాలు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యల్పంగా జంగమేశ్వరపురంలో 17 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నంలో 19.4 డిగ్రీలు, నందిగామలో కనిష్ట ఉష్ణోగ్రత 19.5 డిగ్రీల మేరకు పడిపోవడంతో చలి తీవ్రత అధికమైంది.

తెలంగాణలో వర్షాలు..
ఉత్తర దిశ నుంచి గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో తెలంగాణలో చలి తీవ్రత అధికమైంది. తెలంగాణలో మళ్లీ అకాల వర్షాలు కురవనున్నాయి. తెలంగాణను దట్టమైన మేఘాలు కమ్మేస్తున్నాయి. నేటి నుంచి రెండు రోజులపాటు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని  స్పష్టం చేశారు. కనిష్ట ఉష్ణోగ్రత 15 ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 33.5 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు దిగొచ్చాయి. బంగార ధర వరుసగా మూడో రోజులు పెరిగింది, నేడు మళ్లీ పతనమైంది.  మరోవైపు వెండి ధర కూడా పసిడి బాటలో నడుస్తూ దిగొచ్చింది. తాజాగా హైదరాబాద్‌‌లో రూ.150 మేర పతనం కావడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,500 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.49,640గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.300 మేర తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.69,000 అయింది.

ఏపీ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,650 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.45,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. వెండి 1 కిలోగ్రాము ధర రూ.69,000కు పతనమైంది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం ధర నేడు క్షీణించింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,500.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

హైదరాబాద్‌లో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ తొలి నుంచి ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద నిలకడగా ఉన్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర 22 పైసలు తగ్గగా లీటర్ ధర రూ.107.69 కాగా, డీజిల్‌పై 20 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.94.34 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్‌ లీటర్ ధర రూ.107.91 కాగా, డీజిల్‌‌ లీటర్ ధర రూ.94.34గా ఉంది. కరీంనగర్ లో పెట్రోల్ ధర 32 పైసలు తగ్గి, నేడు లీటర్ ధర రూ.108.25 అయింది. 30 పైసలు తగ్గడంతో డీజిల్ ధర రూ.94.65 వద్ద నిలకడగా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్‌పై 10 పైసలు పెరిగి లీటర్ ధర రూ.110.61 అయింది. ఇక్కడ డీజిల్ పై 9 పెరగడంతో లీటర్ ధర రూ.96.68 అయింది. అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర 4 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.109.40 అయింది. డీజిల్ పై 4 పైసలు పెరగడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.51 కు చేరింది.

శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనం చేసుకోవాలంటే ఇక నుంచి ఆన్ లైన్ బుకింగ్ టికెట్ తప్పనిసరి చేసింది. కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి శానిటైజర్ వాడుతూ ఆలయ క్యూలైన్ల నుంచి భక్తులు స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకోవాలని శ్రీశైలం దేవస్థానం ఈఓ లవన్న భక్తులకు సూచించారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తులు దర్శనం వేళల్లో సామాజిక దూరం (Social Distancing) పాటిస్తూ కరోనా వ్యాప్తి నివారణకు అందరు సహకరించాలని ఈఓ కోరారు.

22:24 PM (IST)  •  23 Jan 2022

ములుగు రామలింగేశ్వర స్వామి ఇకలేరు

శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో దాదాపు రెండు శతాబ్దాలుగా ఆస్థాన సిద్ధాంతిగా ఉన్న ములుగు రామలింగేశ్వర స్వామి ఇకలేరు. ఆదివారం సాయంత్రం గుండెపోటుతో చ‌నిపోయారు. ఆలయ ఈవో పెద్దిరాజు, ప‌లువురు ప్రజా ప్రతినిధులు ఆయ‌న మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.  ములుగు రామ‌లింగేశ్వర స్వామి పంచాంగం అంటే చాలా మందికి నమ్మకం ఉండేది.

22:19 PM (IST)  •  23 Jan 2022

సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సమ్మె నోటీసులు ఇస్తాం..

ప్రభుత్వంపై తాము యుద్ధం ప్రకటించలేదని పీఆర్సీ సాధన సమితి స్పష్టం చేసింది. స్టీరింగ్ కమిటీ భేటీ అనంతరం సంఘం నేతలు మీడియాతో మాట్లాడారు. ఉద్యమ కార్యాచరణలో పార్టీలను ఆహ్వానించలేదని స్పష్టం చేశారు. ఉద్యమం అంటే.. ప్రభుత్వానికి నిరసన తెలిపే కార్యక్రమని.. ప్రభుత్వ వైఖరి తీవ్ర ఆవేదన కలిగిస్తోందని చెప్పారు. రేపు మధ్యాహ్నం 3 గం.కు సమ్మె నోటీసు ఇస్తామని వెల్లడించారు. స్టీరింగ్ కమిటీ సభ్యులను 12 నుంచి 20 మందికి పెంచామని తెలిపారు.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vijaya Dairy Issue: విజయ బ్రాండ్ నెయ్యి ఇష్యూపై లోకేష్ వర్సెస్ గుత్తా అమిత్ రెడ్డి - చివరికి ఏం తేలిందంటే ?
విజయ బ్రాండ్ నెయ్యి ఇష్యూపై లోకేష్ వర్సెస్ గుత్తా అమిత్ రెడ్డి - చివరికి ఏం తేలిందంటే ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
GodavariPushkaralu 2027: గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు! 2027లో ప్రారంభం, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు
గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు! 2027లో ప్రారంభం, తెలంగాణ బ్రాండ్ ప్రతిబింబించేలా ఏర్పాట్లు
MLAs Disqualification Petitions: దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ - బీఆర్ఎస్ ఆగ్రహం
దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు భారీ ఊరట.. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ - బీఆర్ఎస్ ఆగ్రహం

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Harish Rana Case : 13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Hansika Divorce : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Embed widget