అన్వేషించండి

Telangana Elections 2023: సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడొద్దు: సంగారెడ్డిలో ఖర్గే

Telangana Assembly Elections 2023: ఇందిరా గాంధీ సంగారెడ్డిలో అడుగుపెట్టిన తరువాత దేశమంతా కాంగ్రెస్‌ను గెలిపించిందన్నారు మల్లికార్జున ఖర్గే. సంగారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొని ఖర్గే ప్రసంగించారు.

Mallikarjun Kharge speech at Sangareddy Public Meeting

సంగారెడ్డి:  ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీచేసి ఎంపీగా గెలిచి ప్రధాని అయి దేశానికి సేవ చేశారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఇందిరా గాంధీ సంగారెడ్డిలో అడుగుపెట్టిన తరువాత దేశమంతా కాంగ్రెస్‌ను గెలిపించిందన్నారు. సంగారెడ్డిలోని నుంచి గంజి మైదాన్‌ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో పాల్గొని ఖర్గే ప్రసంగించారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. ఇందిరా గాంధీ తెలంగాణ గడ్డమీద గెలవకపోయి ఉంటే ఈ సంస్థలు ఏర్పాటు అయ్యేవి కాదన్నారు.

ఇచ్చిన మాట, హామీలను నిలబెట్టుకునే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని మల్లికార్జున ఖర్గే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ, కానీ ఆ విషయం మరిచిపోయి రాహుల్, ప్రియాంక గాంధీలపై బీఆర్ఎస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసింది కాంగ్రెస్, కానీ తెలంగాణను మోసం చేసింది బీఆర్ఎస్ అన్నారు. సోనియా లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని, ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయగానే కేసీఆర్‌ సోనియా ఇంటికెళ్లి ఆమెను కలిశారని.. కానీ మరుసటిరోజే కేసీఆర్ ఆ విషయం మరిచిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పేదల కోసం ఆలోచిస్తుంది, భూ సంస్కరణలు తీసుకొచ్చింది, బ్యాంకులను జాతీయం చేశామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చాం. అందరికీ విద్య అందించేందుకు కృషిచేశామని చెప్పారు.  

కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నాం. ఇప్పుడు తెలంగాణకు 6 గ్యారంటీలు ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి హామీని నెరవేర్చుతామని చెప్పారు. కర్ణాటకలో మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఒక్క లగ్జరీ బస్సు ఇస్తాం, అందులో జగ్గారెడ్డి, హనుమంతరావు లాంటి కాంగ్రెస్ నేతలు సగం మంది, బీఆర్ఎస్ నేతలు సగం మంది బస్సులో తిరిగి విషయాలు చూపించాలన్నారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో ప్రతి ఒక్కరిపై రూ.5 లక్షల అప్పు ఉందన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ఘనత కేసీఆర్ దే అన్నారు. సంస్థలను సైతం అమ్మేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విమర్శించారు. 

రైతులకు రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామన్నారు ఖర్గే. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు అందిస్తామని చెప్పారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతినెల మహిళలకు రూ. 2500 ఇస్తామన్నారు. అర్హులైన పేదలకు ఇళ్లు నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఇస్తాం. ప్రతి మండలంలో ఓ ఇంటర్నేషనల్ స్కూల్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందించడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. ఓట్ల కోసం ఈ విషయాలు చెప్పడం లేదు, కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజలకోసం పనిచేస్తుందన్నారు. పార్టీ శ్రేణులు అందరు కలిసి పనిచేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాలని మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. అబద్ధాలు చెప్పేవాళ్లను నమ్మవద్దని, జగ్గారెడ్డి లాంటి నేతల్ని గెలిపించాలని ఖర్గే రాష్ట్ర ప్రజలను కోరారు. కేవలం ఒక్క నేత ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాదని, పార్టీ అభ్యర్థులు భారీ సంఖ్యలో విజయం సాధిస్తే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు.

అంతకుముందు సంగారెడ్డిలో ఆదివారం ఉదయం కాంగ్రెస్‌ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. తారా డిగ్రీ కాలేజీ నుంచి గంజి మైదాన్‌ వరకు నిర్వహించిన ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు. సంగారెడ్డి సభ అనంతరం మల్లికార్జున ఖర్గే మెదక్ బయలుదేరి వెళ్లారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: మండలి నుంచి BRS ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు.. గందరగోళం మధ్య నిర్ణయం తీసుకున్న చైర్మన్
మండలి నుంచి BRS ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు.. గందరగోళం మధ్య నిర్ణయం తీసుకున్న చైర్మన్
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
KCR Disqualification: అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?
అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoist Surrender: మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ రావు లొంగుబాటు.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఏపీ
Inner Ring Road Case: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
JEE Mains 2026 Admit Cards: జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్స్ విడుదల.. ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోండి
Rahul Banerjee : షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
షూటింగ్ టైంలో యాక్సిడెంట్ - నీట మునిగి సీరియల్ నటుడు మృతి... అసలేం జరిగిందంటే?
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Mini Bali in India : హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే
హైదరాబాద్ నుంచి ‘మినీ బాలి’కి ట్రిప్.. నివటి బీచ్ పూర్తి బడ్జెట్ డిటైల్స్ ఇవే
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
Embed widget