అన్వేషించండి

Telangana Prisons: తెలంగాణలో 213 మంది ఖైదీల విడుదల, ప్రత్యేకంగా జాబ్ మేళాతో ఉపాధి - రేపటి కోసం

Telangana News: తెలంగాణలో 213 మంది ఖైదీలు విడుదలయ్యారు. ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడంతో రాష్ట్రంలోని 13 జైళ్ల నుంచి సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలు బుధవారం నాడు విడుదలయ్యారు.

213 convicts released from 13 prisons in Telangana | హైదరాబాద్: తెలంగాణలో మంచి ప్రవర్తన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఖైదీలను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 213 మంది ఖైదీల విడుదలకు తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే నిర్ణయం తీసుకుంది. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ ఆమోదం తెలపడంతో ఖైదీల విడుదలకు మార్గం సుగమం అయింది. తెలంగాణ ప్రభుత్వం ఖైదీల విడుదలకుగానూ మంగళవారం నాడు ఉత్వర్వులు జారీ చేసింది. జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీలకు జైళ్ల శాఖ ఉపాధి అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం విడుదలవుతున్న ఖైదీల కోసం ప్రత్యేకంగా జాబ్ మేళాను సైతం ఏర్పాటు చేసింది. 

తెలంగాణ జైళ్ల శాఖ చరిత్రలో ఓ మైలు రాయి 
జైళ్లశాఖ డీజీ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. సత్ ప్రవర్తన కారణంగా విడుదలవుతున్న ఖైదీలకు శుభాకాంక్షలు తెలిపారు. నేడు (జులై 3) తెలంగాణ జైళ్ల శాఖ చరిత్రలో ఓ మైలు రాయి లాంటిదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రజావాణిలో భాగంగా ఖైదీల కుటుంబ సభ్యులు వారిని   విడుదల చేయాలని దరఖాస్తులు ఇచ్చారని తెలిపారు. ఖైదీల కుటుంబసభ్యుల వినతులను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం ఈ హైలెవెల్ కమిటీ ఒక లిస్ట్ తయారు చేయగా.. ఆ లిస్ట్‌ను కేబినెట్‌కు పంపితే ఆమోదం లభించింది. చివరగా ఆ జాబితాను గవర్నర్ రాధాకృష్ణన్ వద్దకు తీసుకెళ్లగా ఆయన ఆమోదించారని డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. అనంతరం ఈ ఖైదీల విడుదలకు హోంశాఖ సెక్రటరీ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు.

వీరిలో 205 మంది యావజ్జీవ కారాగర శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, 8 మంది స్వల్పకాలిక శిక్ష అనుభవిస్తున్న ఖైదులు విడుదలవుతున్నారని తెలిపారు. ఆ ఖైదీలకు ఇది జీవితంలో రెండో అవకాశమని, ఈ ఛాన్స్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జైళ్లలో తాము కేవలం శిక్ష మాత్రమే కాదు, వారికి జీవితంలో పనులు చేసుకుని జీవించగలిగేలా పలు వృత్తి విద్య నైపుణ్యాలలో శిక్షణ కూడా ఇచ్చామన్నారు. జైలులో ఖైదీలు తయారు చేసే వస్తువులకి మార్కెట్‌లో డిమాండ్ ఉందని, ఇక్కడికి వచ్చిన నిరక్షరాస్యులను సైతం అక్షరాస్యులుగా మార్చినట్లు చెప్పారు. కొందరు ఖైదీలు జైలులో చదువుకుని పట్టభద్రులు అయ్యారని, అందులో గోల్డ్ మెడల్ సాధించిన వారు కూడా ఉన్నారని డీజీ సౌమ్య మిశ్రా చెప్పారు.

జైలు నుంచి విడుదలయ్యాక జీవించడానికి శిక్షణ ఇచ్చామని, వారికి జాబ్ మేళా నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించామని డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకుల్లో 70 మంది ఖైదీలకు ఉపాధి కల్పించారు. శిక్షకాలంలో ఇస్తున్న జీతం కంటే, ఇప్పుడు ఇంకా ఎక్కువ జీతం ఇస్తున్నామని పేర్కొన్నారు. ముగ్గురు మహిళా ఖైదీలకు జైళ్ల శాఖ స్టోర్లలో ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పటివరకు విడుదలైన ఖైదీలలో మూడో వంతు ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పించామని, విడులయ్యాక ఉపాధి దొరక్కపోతే తమను సంప్రదించాలని డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు.

ఉపాధి పొందుతామని కొంతమంది మహిళా ఖైదీలు కోరగా.. వారందరికీ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. విడుదలైన ఖైదీలు మంచి పౌరులుగా మెరుగైన సమాజం కోసం పనిచేయాలని సూచించారు. ఆ ఖైదీల పట్ల కుటుంబం, సమాజం సానుభూతితో ఉండాలన్నారు. జైలు నుంచి విడుదలవుతున్న ఖైదీలకు వారి స్వస్థలాలకు వెళ్లడానికి జైలు అధికారులు ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు.

జైళ్ల వారీగా విడుదల అవుతున్న ఖైదీల వివరాలు..
- చర్లపల్లి కేంద్ర కార్యాలయం నుంచి- 61
- మహిళల ప్రత్యేక కారాగారం నుంచి -35
- చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నుంచి- 31
- హైదరాబాద్ కేంద్ర కారాగారం నుంచి- 27
- వరంగల్ కేంద్ర కారాగారం నుంచి -20
- నిజామాబాద్ కేంద్ర కారాగారం నుంచి- 15
- కరీంనగర్ జిల్లా జైలు నుంచి- 7
- ఖమ్మం జిల్లా జైలు నుంచి -4
- నల్లగొండ జిల్లా జైలు నుంచి- 4
- ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి- 3
- ఆసిఫాబాద్ స్పెషల్ సబ్ జైలు నుంచి- 3
- మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచి- 2
- సంగారెడ్డి కేంద్ర కారాగారం నుంచి-1
మొత్తం 213 మంది ఖైదీలు జైళ్ల నుంచి విడుదలై సొంత గ్రామాలకు వెళ్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో బొలెరో బీభత్సం- ముగ్గురు మహిళలు మృతి
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో బొలెరో బీభత్సం- ముగ్గురు మహిళలు మృతి
BJP To Change Madhya Pradesh Rajasthan Chief Ministers: మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో సీఎంల మార్పు ఖాయమా? మోదీ-షా కొత్త ప్రయోగం వికటించిందా!?
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో సీఎంల మార్పు ఖాయమా? మోదీ-షా కొత్త ప్రయోగం వికటించిందా!?
Hyderabad Old City Minority Voters: పాతబస్తీలో ఓటరు సంక్షోభం - SIRపై మైనారిటీల్లో అభద్రతా భావం.. కర్ణాటక మోడల్ డిమాండ్‌పై రేవంత్ సర్కార్ సైలెన్స్!
పాతబస్తీలో ఓటరు సంక్షోభం - SIRపై మైనారిటీల్లో అభద్రతా భావం.. కర్ణాటక మోడల్ డిమాండ్‌పై రేవంత్ సర్కార్ సైలెన్స్!
Kaleshwaram Project Politics: కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
Nitin Gadkari on E20 Fuel: E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
Rajesh Sharma Hospitalised: ఫౌజీ సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?
ఫౌజీ సెట్స్‌లో పురుగు కుట్టలేదు... బాలీవుడ్ నటుడు ఆస్పత్రిలో చేరడానికి అసలు కారణం ఏమిటంటే?
Kaleshwaram Project Politics: కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
Embed widget