By: ABP Desam | Updated at : 11 Mar 2023 12:41 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
UP Shopkeeper Marketing Strategy: ప్రస్తుతం ప్రపంచం అంతా మార్కెటింగ్ మేనియా నడుస్తుంది. వ్యాపారులు తమ ఉత్పత్తులు, సేవలను వినియోగదారుల దగ్గరికి తీసుకెళ్లేందుకు వివిధ రకాల మార్కెటింగ్ వ్యూహాలను అవలంబిస్తారు. స్మార్ట్ఫోన్ను ఒక వినియోగదారుడికి విక్రయించాలనుకుంటే, వారు దానితో పాటు కొన్ని బహుమతులను కూడా అందిస్తారు. దీని వల్ల వినియోగదారుడికి మొబైల్ ఫోన్ను కొనుగోలు చేయాలనే కోరిక పెరుగుతుంది.
అయితే ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ దుకాణదారుడు స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై ఇలాంటి ఆఫరే ఒకటి ఇచ్చాడు. ఒక స్మార్ట్ఫోన్ కొనుగోలుపై రెండు బీర్ క్యాన్లను ఉచితంగా ఇస్తామని ఆఫర్ ప్రకటించాడు. ఈ విషయం తెలియగానే ప్రజలు దుకాణం బయట బారులు తీరారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పీటీఐ కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్లోని భదోహి జిల్లాలో ఒక దుకాణదారుడు ఈ ఆఫర్కు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను వేర్వేరు ప్రదేశాలలో ఉంచాడు. ఈ ఆఫర్ మార్చి 3వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు అందుబాటులో ఉంది. దీనికి 'హోలీ బంపర్ ధమాకా' అని పేరు పెట్టారు.
ఈ ఆఫర్ గురించి విన్న జనాలు షాప్ దగ్గర గుమిగూడి బీరు తాగుతూ ఫోన్లు కొనడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు వెంటనే దుకాణానికి చేరుకుని గుంపును చెదరగొట్టి షాపు యజమాని రాజేష్ మౌర్యను ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 151 కింద అరెస్టు చేసి దుకాణాన్ని సీజ్ చేశారు.
ఈ ఆఫర్తో స్థానిక వాతావరణం చెడిపోతోందని, అలాగే ఈ మార్కెటింగ్ పద్ధతి సరికాదని పోలీసు అధికారులు తెలిపారు. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రవర్తనా నియమావళి ప్రకారం ఏదైనా ఉత్పత్తి లేదా సేవ ప్రచారం కోసం ఆల్కహాల్ ఉపయోగించడం సరైనది కాదు. లైసెన్స్ పొందిన వారు మాత్రమే మద్యాన్ని ప్రమోషన్గా ఉపయోగించగలరు. బహిరంగంగా మద్యం సేవించడం కూడా చట్టవిరుద్ధమే.
ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ టెక్నో తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ను మనదేశ మార్కెట్లో ఇటీవలే లాంచ్ చేసింది. అదే టెక్నో ఫాంటం వీ ఫోల్డ్. బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023 ఈవెంట్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ ప్రాసెసర్ను అందించారు. అంటుటు టెస్టింగ్ ప్లాట్ఫాంలో 10.8 లక్షల స్కోరును సాధించింది. ఈ ఫోన్ త్వరలో మనదేశంలో కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది.
ఈ ఫోన్ ధర ఇప్పటికే ఆన్లైన్లో లీక్ అయింది. ఇందులో బేస్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.89,999 కాగా, 12 జీబీ ర్యామ్ + 512 జీబీ వేరియంట్ ధర రూ.99,999గా ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద ఈ ఫోన్ను రూ.79,999కే అందించే అవకాశం ఉంది. బ్లాక్, వైట్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం మనదేశంలో అత్యంత చవకైన ఫోల్డబుల్ ఇదే కావచ్చు. ఎందుకంటే శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ల ధర రూ.లక్ష వరకు ఉంది.
వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్ - డిస్అప్పీయరింగ్ మెసేజ్ల కోసం మల్చిపుల్ ఆప్షన్లు
Redmi Note 12 Turbo: రూ.34 వేలలోపే 1000 జీబీ స్టోరేజ్ స్మార్ట్ ఫోన్ - రెడ్మీ సూపర్ మొబైల్ వచ్చేసింది!
GitHub Layoffs: భారతదేశంలో ఇంజినీరింగ్ టీం మొత్తాన్ని తొలగించిన గిట్హబ్ - ఏకంగా 142 మందిపై వేటు!
Moto G13: రూ.10 వేలలోపు ధరతోనే మోటొరోలా కొత్త ఫోన్ - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!
Third Party Apps: థర్డ్ పార్టీ యాప్స్ డౌన్ లోడ్ చేస్తున్నారా? అయితే, APK ఫైల్ గురించి కాస్త తెలుసుకోండి!
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి