అన్వేషించండి

Redmi Max Smart TV: ఈ టీవీ ఇంట్లో ఉంటే థియేటర్‌కు వెళ్లక్కర్లేదు ఇంక - ఎన్ని ఇంచులో తెలుసా?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తన 100 అంగుళాల స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. ఇది ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది.

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ ఏకంగా 100 ఇంచెస్ స్మార్ట్ టీవీని చైనాలో లాంచ్ చేసింది. రెడ్‌మీ బ్రాండింగ్‌లో ఈ టీవీ మార్కెట్లోకి వచ్చింది. ఇందులో 100 అంగుళాల 4కే స్క్రీన్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా వీటిలో ఉంది. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా ఇందులో అందించారు. ఇందులో వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (వీఆర్ఆర్), ఆటో లో లేటెన్సీ మోడ్ (ఏఎల్ఎల్ఎం) ఫీచర్లు కూడా ఉన్నాయి. డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు.

రెడ్‌మీ మ్యాక్స్ 100 ఇంచెస్ టీవీ
ఈ టీవీ ధరను 19,990 యువాన్లుగా (సుమారు రూ.2,39,500) నిర్ణయించారు. బ్లాక్ కలర్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. చైనాలో దీనికి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 6వ తేదీ నుంచి సేల్ కూడా ప్రారంభం కానుంది.రెడ్‌మీ మ్యాక్స్ 86 అంగుళాల టీవీ చైనాలో 7,999 యువాన్ల (సుమారు రూ.95,700) ధరతో గతేడాది లాంచ్ అయింది.

రెడ్‌మీ మ్యాక్స్ 100 ఇంచెస్ టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 100 ఇంచుల 4కే ఐపీఎస్ ప్యానెల్‌ను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా... పీక్ బ్రైట్‌నెస్ 700 నిట్స్‌గా ఉంది. డాల్బీ విజన్, ఐమ్యాక్స్ ఎన్‌హేన్స్‌డ్, హెచ్‌డీఆర్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. హెచ్‌డీఆర్10, హెచ్‌డీఆర్10+, హెచ్ఎల్‌జీ ఫార్మాట్లను ఇది సపోర్ట్ చేయనుంది. 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్‌ను ఇది అందించనుంది.

ఏఎండీ ఫ్రీసింక్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్, ఆటో లో లేటెన్సీ మోడ్ వంటి ఫీచర్లు ఇందులో అందించారు. ల్యాగ్, స్క్రీన్ టియరింగ్, ఫ్రీజింగ్ వంటివి జరగకుండా ఆటో లో లేటెన్సీ మోడ్ ఉపయోగపడనుంది. ప్రస్తుత తరం గేమింగ్ కన్సోల్స్‌కు కూడా కనెక్ట్ అయ్యేలా ఈ టీవీని రూపొందించారు.

ఇందులో క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను అందించారు. కార్టెక్స్-ఏ73 కోర్లు ఇందులో ఉన్నాయి. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను వీటిలో అందించారు. డాల్బీ డిజిటల్ ప్లస్, డాల్బీ అట్మాస్ సపోర్ట్‌లను కూడా ఇందులో అందించారు. 30W స్పీకర్లను కంపెనీ ఇందులో అందించింది. వైఫై 6, మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక ఎథర్‌నెట్ పోర్టు కూడా ఉన్నాయి. ఎంఐయూఐ టీవీ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుందని కంపెనీ తెలిపింది.

Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?

Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?

టాప్ హెడ్ లైన్స్

Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
WhatsApp Usernames Cyber Security Risks: వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం సీరియస్.. అసలు అభ్యంతరాలేంటి? మెటా వాదన ఏంటి?
Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లోని అశ్లీల కంటెంట్‌పై ప్రభుత్వం సీరియస్‌! మెటాకు నోటీసులు! 
ఇన్‌స్టాగ్రామ్‌లోని అశ్లీల కంటెంట్‌పై ప్రభుత్వం సీరియస్‌! మెటాకు నోటీసులు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget