అన్వేషించండి

Jio 5G Phone: రూ.10 వేలలోపే జియో 5జీ ఫోన్ - ప్రత్యేకతలు ఏంటంటే?

భారతదేశ నంబర్ వన్ టెలికాం ఆపరేటర్ జియో త్వరలో చవకైన 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది.

భారత టెలికం రంగ సంచలనం జియో.. సరికొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తీసుకురాబోతుందని వార్తలు వస్తున్నాయి. జియో ఫోన్ 5G పేరుతో ఈ కొత్త ఫోన్‌ను జనాల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. త్వరలోనే ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తుంది. ఇంత వరకు ఈ ఫోన్ విడుదల గురించి కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ.. త్వరలోనే ఈ  ఫోన్ ను  అందుబాటులోకి వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

జియో నుంచి 2017లో తొలి ఫీచర్ ఫోన్ విడుదల అయ్యింది. ఈ ఫోన్ కు జనాల నుంచి మంచి ఆదరణ దక్కింది. గతేడాది 4జీ ఫోన్ కూడా జియో లాంచ్ చేసింది. ఈ ఫోన్ కూడా వినియోగదారులను బాగానే ఆకట్టుకుంది.  ఇక భారత్ లో 5G సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో 5G  స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ముఖేష్ అంబానీ కంపెనీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. జియో 5జీ ఫోన్ కు సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఇవే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇంతకీ ఈ లేటెస్ట్ ఫోన్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.. 

జియో 5G  ఫోన్  స్పెసిఫికేషన్లు, ఫీచర్లు 
జియో 5G స్మార్ట్ ఫోన్  హెచ్‌డీ+ రిజల్యూషన్‌ స్క్రీన్‌తో రానుంది. 6.5-అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేతో ఈ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.  60Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్టు చేస్తుంది.  ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 480  5జీ  ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు కొన్ని జియో యాప్ లకు  మాత్రమే సపోర్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. గతంలో జియో నుంచి వచ్చిన ఫోన్ మాదిరిగానే ఇందులో ఫీచర్లు కూడా ఉంటాయని తెలుస్తోంది. గూగుల్ అసిస్టెంట్, రీడ్ అలౌడ్ టెక్ట్స్, గూగుల్ లెన్స్, గూగుల్ ట్రాన్స్ లేట్ ఉండనున్నాయి.

ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో రానుంది, 18W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. జియో 5G  ఫోన్ USB టైప్ C ఛార్జింగ్ పోర్ట్‌ ను కలిగి ఉంటుందట. ఇక ఫోటోలు, వీడియోల కోసం  13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా ఉండనున్నాయని తెలుస్తోంది. ముందు భాగంలో సెల్పీల కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా అమర్చినట్లు సమాచారం. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌ను సైతం అందించనున్నారని వార్తలు వస్తున్నాయి. 
 
జియో 5G  ఫోన్ ధర ఎంతంటే?
జియో నుంచి వస్తున్న ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ.10 వేలకు మించి ఉండదని తెలుస్తోంది. గతేడాది 4G ఫోన్‌ను జియో రూ. 6,499 రూపాయలకే  మార్కెట్లోకి విడుదల చేసింది. ఆ తర్వాత దాని ధరను మరింత తగ్గించారు. ఇప్పుడు రూ.ఐదు వేలలోపే ఆ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ధర కూడా దానికి కాస్త ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026: టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
టి20 ప్రపంచ కప్‌ ఆడే భారత జట్టులో వీళ్లకే ఛాన్స్‌? రిషబ్ పంత్ ,యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌కి తప్పని నిరాశ!
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
T20 World Cup 2026: కాసేపట్లో టి20 ప్రపంచ కప్ 2026 భారత జట్టు ప్రకటన! ముంబై సమావేశంలో ముగ్గురు క్రికెటర్లపైనే చర్చ!
కాసేపట్లో టి20 ప్రపంచ కప్ 2026 భారత జట్టు ప్రకటన! ముంబై సమావేశంలో ముగ్గురు క్రికెటర్లపైనే చర్చ!
Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
Bigg Boss Telugu Grand Finale : బిగ్​బాస్​ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజివీ.. నిధి అగర్వాల్ రాకతో కళ్యాణ్​కు గాయం!
బిగ్​బాస్​ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజివీ.. నిధి అగర్వాల్ రాకతో కళ్యాణ్​కు గాయం!
Peddi Review : ఆ స్టోరీకి చికిిరీ గికిరీలు అవసరమా? - వారు తిన్న కంచంలో ఉమ్మేసినట్లే... రివ్యూయర్స్‌కు విశ్వక్ స్ట్రాంగ్ కౌంటర్
ఆ స్టోరీకి చికిిరీ గికిరీలు అవసరమా? - వారు తిన్న కంచంలో ఉమ్మేసినట్లే... రివ్యూయర్స్‌కు విశ్వక్ స్ట్రాంగ్ కౌంటర్
Embed widget