By: ABP Desam | Updated at : 22 Jan 2023 03:52 PM (IST)
సోషల్ మీడియా మార్కెటింగ్కు కొత్త మార్గదర్శకాలు అందుబాటులోకి వచ్చాయి.
Social Media Guidelines: ప్రస్తుతం ప్రపంచంలో సోషల్ మీడియా ప్లాట్ఫారంల ద్వారా ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా ఒక ఆదాయ వనరు అయిపోయింది. సోషల్ మీడియాలో తమ ఫాలోయింగ్ ద్వారా ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయడంతో పాటు కొందరు తప్పుదారి పట్టిస్తారు కూడా. అయితే అలా తప్పుదారి పట్టించడం ఇప్పుడు చట్టరీత్యా నేరం కానుంది. పెద్ద కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేసుకోవడానికి సోషల్ మీడియా మంచి మాధ్యమం. 2020 సంవత్సరంలో సోషల్ మీడియా రూ.1,275 కోట్ల పెద్ద మార్కెట్గా ఉంది. 2025 నాటికి ఇది 20 శాతం పెరిగే అవకాశం ఉంది.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కంపెనీల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ఇప్పుడు సెలబ్రిటీలు లేదా ఇన్ఫ్లుయెన్సర్లు ఉత్పత్తులను సోషల్ మీడియాలో ప్రచారం చేయలేరు. అయితే దీని కోసం వారు కొంత ముఖ్యమైన సమాచారాన్ని జోడించాల్సి ఉంటుంది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం ఇప్పుడు ప్లాట్ఫారమ్లో ప్రొడక్ట్స్ను ప్రమోట్ చేస్తున్న ప్రతి సెలబ్రిటీ, ఇన్ఫ్లుయెన్సర్ ఈ ప్రమోషన్ కోసం డబ్బు తీసుకున్నారా లేదా అని చెప్పాలి. ఈ సమాచారంతో పాటు వారి ఆర్థిక ప్రయోజనం ప్రచారం వెనుక ఉందని కూడా తెలపాలి. మీడియా నివేదికల ప్రకారం వినియోగదారుల రక్షణ చట్టం 2019 కింద వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. సరైన సమాచారం వినియోగదారునికి చేరాలనే ఉద్దేశ్యంతో ఈ మార్గదర్శకాన్ని తీసుకువచ్చినట్లు డిపార్ట్మెంట్ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు.
కొత్త గైడ్లైన్ ప్రకారం ఇప్పుడు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు ప్రొడక్ట్ ఎండార్స్మెంట్ కోసం డబ్బు అందుకున్నారా లేదా అని చెప్పాలి. ప్రభావితం చేసే వ్యక్తులు ఈ సమాచారాన్ని వీడియోలోనే ఇవ్వాలి. అలాగే వారు ఆ ఉత్పత్తిని ఉపయోగిస్తున్నారా లేదా అని కూడా చెప్పాలి.
లైవ్ స్ట్రీమింగ్ కూడా
ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త మార్గదర్శకం ప్రత్యక్ష ప్రసారానికి కూడా వర్తిస్తుంది. సెలబ్రిటీలు లేదా ఇన్ఫ్లుయెన్సర్లు ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లో లైవ్ స్ట్రీమ్ ద్వారా ఉత్పత్తిని ప్రమోట్ చేస్తే, ఇందులో కూడా వారు ఉత్పత్తి గురించి సరైన సమాచారాన్ని అందించాలి.
నిబంధనలు పాటించకుంటే 50 లక్షల జరిమానా
ఎవరైనా మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే రూ.10 లక్షల జరిమానా విధిస్తామని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అదే సమయంలో పదేపదే ఉల్లంఘనలకు పాల్పడితే ఈ జరిమానా రూ.50 లక్షలకు పెరుగుతుంది. ఏ ఉత్పత్తులనూ ప్రచారం చేయకుండా ఆరు సంవత్సరాల పాటు నిషేధం విధించనున్నారు.
Amazon Deal: అమెజాన్లో ఈ ఫోన్పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.12 వేలు తగ్గింపు!
Amazon Deal: మీ భాగస్వామికి బెస్ట్ వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? - అమెజాన్లో వీటిపై ఓ లుక్కేయండి!
Elon Musk to Mr Tweet: ట్విట్టర్ లో పేరు మార్చుకున్న ఎలన్ మస్క్, ఆటాడేసుకుంటున్న నెటిజన్స్
OnePlus 11R: లాంచ్ కు ముందే స్పెసిఫికేషన్లు లీక్, OnePlus 11R ప్రత్యేకతలు ఇవే!
BharOS: ఆండ్రాయిడ్కి పోటీగా భారత ఓఎస్, ‘BharOS’ రూపొందించిన మద్రాస్ ఐఐటీ
నేడు సీబీఐ ముందుకు అవినాష్ రెడ్డి- వివేకా హత్య కేసులో ఇంకెన్ని ట్విస్ట్లు!
Tarak ratna Health Update : మెరుగైన వైద్యం కోసం బెంగళూరు ఆసుపత్రికి తారకరత్న, కుప్పం నుంచి గ్రీన్ ఛానల్
Heart Attack: ఈ శరీరభాగాల్లో అసౌకర్యంగా ఉంటే అది గుండె సమస్య కావచ్చు, తేలిగ్గా తీసుకోకండి
Ratha Sapthami 2023 Slokas: రథసప్తమి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన శ్లోకాలు