అన్వేషించండి

GST Law Panel: 'గేమ్స్ ఆఫ్ స్కిల్', 'గేమ్స్ ఆఫ్ ఛాన్స్'పై జీఎస్టీ ఎంత? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తర్వాతే నిర్ణయం!

దేశంలో ఆన్ లైన్ గేమింగ్ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో.. వాటిపై జీఎస్టీ ఎంత వసూలు చేయాలనే అంశంపై ప్రభుత్వం చర్చిస్తోంది. గేమ్స్ ఆఫ్ స్కిల్, గేమ్స్ ఆఫ్ ఛాన్స్ ను నిర్వచించి.. పన్ను అమలు చేయాలని భావిస్తోంది.

కరోనా లాక్ డౌన్ అనంతరం భారత్ లో ఆన్ లైన్ గేమింగ్ మరింత ఊపందుకుంది. గతంలో పోల్చితే పెద్ద సంఖ్యలో పిల్లలు, పెద్దలు ఆన్ లైన్ గేమ్స్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా ఆన్ లైన్ గేమ్స్ పై జీఎస్టీ ఎంత విధించాలని అనే అంశంపై జీఎస్టీ కౌన్సిల్ చర్చిస్తోంది. నైపుణ్యం అవసరమయ్యే గేమ్‌ ల విషయంలో తక్కువ పన్ను ఉండేలా చూడాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సూచించాయి. ఈ నేపథ్యంలో  GST కౌన్సిల్ లా కమిటీ ప్రత్యేక పన్నుల రూపకల్పనను సులభతరం చేయడానికి 'గేమ్స్ ఆఫ్ స్కిల్',  'గేమ్స్ ఆఫ్ ఛాన్స్' నిర్వచనాలపై చర్చించింది. ఈ మేరకు బెంగళూరులో ఇండస్ట్రీ నిపుణులతో ప్యానెల్ సమావేశమైంది. వాస్తవానికి అన్ని రాష్ట్రాలు లా కమిటీలో భాగం కావు. అందుకే వీటి నిర్వచనంపై ముసాయిదా నివేదిక రూపొందిస్తోంది. ఆ నివేదికను అన్ని రాష్ట్రాల అభిప్రాయాల కోసం పంపిస్తుంది.

'గేమ్స్ ఆఫ్ స్కిల్'కు తక్కువ పన్ను విధించాలంటున్న రాష్ట్రాలు 

'గేమ్స్ ఆఫ్ స్కిల్'కు తక్కువ పన్ను అమలు చేయాలని  చాలా రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర GST అధికారులు వేర్వేరు పన్నుల రూపకల్పనపై ఆలోచిస్తున్నారు. 'గేమ్స్ ఆఫ్ స్కిల్'ను 'గేమ్స్ ఆఫ్ ఛాన్స్'తో సమానంగా పరిగణించరాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ గేమ్‌లపై GST  విధించడం అనేది గడిచిన సంవత్సర కాలంగా సంక్లిష్ట సమస్యగా మారింది. ఆయా గేమ్స్ కు సంబంధించి స్పష్టమైన నిర్వచనం లేనప్పుడు పన్ను ఎంత విధించాలి అనే విషయంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఒకవేళ ఆన్‌లైన్ గేమ్ పోర్టల్‌లకు పన్ను నోటీసులు పంపినా.. కేసులు కోర్టుకు చేరే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 'గేమ్స్ ఆఫ్ స్కిల్'కు తక్కువ రేటుతో పన్ను విధించాలని గేమింగ్ ఇండస్ట్రీ డిమాండ్ చేస్తోంది. అందుకే ముందుగా  'గేమ్స్ ఆఫ్ స్కిల్',  'గేమ్స్ ఆఫ్ ఛాన్స్' నిర్వచనాన్ని ఖరారు చేసిన తర్వాతే పన్ను విధించాలని జీఎస్టీ లా కౌన్సిల్ నిర్ణయించింది. 

నివేదిక రూపొందిస్తున్న కేంద్ర మంత్రుల బృందం

ఈ అంశానికి సంబంధించి కేంద్ర మంత్రుల బృందం (GoM) GST కౌన్సిల్‌కు ఒక నివేదికను సమర్పించాలనుకుంటున్నట్లు పీటీఐ వెల్లడించింది. ఇది చట్టబద్ధంగా సమర్థించదగినదిగా ఉండటంతో పాటు కోర్టులలో సవాలు చేసే అవకాశం ఉండదు. GoM తన నివేదికను ఖరారు చేసే ముందు అన్ని గేమింగ్ సంస్థల వాటాదారులను సంప్రదిస్తుంది. అయితే  గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత డిసెంబర్ నెలాఖరులోగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగే అవకాశం ఉంది. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో ఆన్‌ లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలపై పన్ను విధించడంపై GoM నివేదికపై కౌన్సిల్ చర్చిస్తుంది.

ఆన్లైన్ గేమింగ్ పై మరింత చర్చ జరగాలన్న GST కౌన్సిల్

జూన్‌లో మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఆధ్వర్యంలోని మంత్రుల బృందం ఆన్‌లైన్ గేమింగ్ రంగంపై 28 శాతం పన్ను విధించాలని GST కౌన్సిల్‌కు సూచించింది. కౌన్సిల్ మాత్రం   ఆన్‌లైన్ గేమింగ్, కాసినోలపై పన్ను విధించడంపై మరింత చర్చించాల్సిందిగా GoMని కోరింది. ప్రస్తుతం, 'గేమ్స్ ఆఫ్ ఛాన్స్'పై 28 శాతం GST కొనసాగుతోంది. ఇందులో కొన్ని రకాల బెట్టింగ్/గ్యాంబ్లింగ్ కూడా ఉన్నాయి. అయితే, స్కిల్ గేమింగ్ రంగం 18 శాతం GST చెల్లిస్తుంది. భారతదేశంలోని ఆన్ లైన్ గేమర్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. COVID-19 లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ గేమింగ్ చాలా రెట్లు పెరిగింది.  KPMG నివేదిక ప్రకారం, ఆన్‌లైన్ గేమింగ్ రంగం 2021లో రూ. 13,600 కోట్ల నుంచి 2024-25 నాటికి రూ. 29,000 కోట్లకు పెరగబోతుంది.

Also Read: నెల రోజుల్లోగా అందుబాటులోకి ట్విట్టర్ ‘బ్లూ’ సబ్‌ స్క్రిప్షన్ సర్వీస్, ఎలన్ మస్క్ వెల్లడి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Worldbank funds to Amaravati: అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులు విడుదల  3500కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి
అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులు విడుదల 3500కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి
Telangana Latest News: తెలంగాణలో 55 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు- సంచలన విషయాలు వెల్లడించిన ఏసిబి
తెలంగాణలో 55 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు- సంచలన విషయాలు వెల్లడించిన ఏసిబి
Supreme Court judges Assets: ప్రజల ఎదుట ఆస్తుల వివరాలు - సుప్రీంకోర్టు జడ్జిల కీలక నిర్ణయాలు
ప్రజల ఎదుట ఆస్తుల వివరాలు - సుప్రీంకోర్టు జడ్జిల కీలక నిర్ణయాలు
Prakash Raj: పవన్ కల్యాణ్ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? - డిప్యూటీ సీఎంకు మరోసారి ప్రకాష్ రాజ్ కౌంటర్
పవన్ కల్యాణ్ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? - డిప్యూటీ సీఎంకు మరోసారి ప్రకాష్ రాజ్ కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs SRH Match Preview IPL 2025  ఈడెన్ లో దుల్లగొట్టేసి ఫామ్ లోకి వచ్చేయాలని సన్ రైజర్స్Virat Kohli Sympathy Drama IPL 2025 | కొహ్లీ కావాలనే సింపతీ డ్రామాలు ఆడాడాSiraj Bowling vs RCB IPL 2025 | మియా మావ బౌలింగ్ కి..వణికిపోయిన ఆర్సీబీRCB vs GT IPL 2025 Match Trolls | అయ్యిందా బాగా అయ్యిందా అంటున్న CSK, MI ఫ్యాన్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Worldbank funds to Amaravati: అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులు విడుదల  3500కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి
అమరావతికి ప్రపంచబ్యాంక్ నిధులు విడుదల 3500కోట్లు ప్రభుత్వ ఖాతాలోకి
Telangana Latest News: తెలంగాణలో 55 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు- సంచలన విషయాలు వెల్లడించిన ఏసిబి
తెలంగాణలో 55 మంది ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు- సంచలన విషయాలు వెల్లడించిన ఏసిబి
Supreme Court judges Assets: ప్రజల ఎదుట ఆస్తుల వివరాలు - సుప్రీంకోర్టు జడ్జిల కీలక నిర్ణయాలు
ప్రజల ఎదుట ఆస్తుల వివరాలు - సుప్రీంకోర్టు జడ్జిల కీలక నిర్ణయాలు
Prakash Raj: పవన్ కల్యాణ్ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? - డిప్యూటీ సీఎంకు మరోసారి ప్రకాష్ రాజ్ కౌంటర్
పవన్ కల్యాణ్ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? - డిప్యూటీ సీఎంకు మరోసారి ప్రకాష్ రాజ్ కౌంటర్
HCU Land Dispute: కంచ గచ్చిబౌలి భూమిపై సుప్రీం కీలక నిర్ణయం- హైకోర్టు రిజిస్ట్రార్, సీఎస్‌కు ఆదేశాలు 
కంచ గచ్చిబౌలి భూమిపై సుప్రీం కీలక నిర్ణయం- హైకోర్టు రిజిస్ట్రార్, సీఎస్‌కు ఆదేశాలు 
HCU Land Dispute: హెచ్‌సీయూకి ఆనుకొని ఉన్న 400 ఎకరాల్లో ఎకో పార్క్‌- ఎవరు కొనుక్కున్నా గుంజుకుంటాం: కేటీఆర్
హెచ్‌సీయూకి ఆనుకొని ఉన్న 400 ఎకరాల్లో ఎకో పార్క్‌- ఎవరు కొనుక్కున్నా గుంజుకుంటాం: కేటీఆర్
Kohli Injury Update: కోహ్లీ గాయంపై తాజా అప్డేట్.. సిరాజ్ ను రిటైన్ చేసుకోక‌పోవ‌డంపై స్పందించిన ఆర్సీబీ కోచ్..
కోహ్లీ గాయంపై తాజా అప్డేట్.. సిరాజ్ ను రిటైన్ చేసుకోక‌పోవ‌డంపై స్పందించిన ఆర్సీబీ కోచ్..
Anantapuram Latest News: పరిటాల రవి హత్య కేసుపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు- సూటుకేసు బాంబుపై జగన్ మాట్లాడాలని డిమాండ్
పరిటాల రవి హత్య కేసుపై మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు- సూటుకేసు బాంబుపై జగన్ మాట్లాడాలని డిమాండ్
Embed widget