అన్వేషించండి

Srilanka News: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం, క్రికెట్‌ బోర్డ్‌ని రద్దు చేసిన క్రీడాశాఖ

Sri Lanka Cricket board: క్రికెట్ బోర్డ్‌ని రద్దు చేస్తూ శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

Sri Lanka Cricket board: 


Srilanka News: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. క్రికెట్‌ బోర్డ్‌ని (Srilanka Cricket Board Sacked) రద్దు చేస్తూ ప్రకటన చేసింది. ఇటీవలే భారత్‌-శ్రీలంక జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక ఘోర ఓటమి పాలైంది. ఈ క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. బోర్డ్‌ని రద్దు చేసే ముందే బోర్డ్ కార్యదర్శి రాజీనామా చేశారు. శ్రీలంక క్రీడాశాఖ మంత్రి రోషన్ రణసింఘే ( Roshan Ranasinghe) బోర్డుని రద్దు చేశారు. బోర్డులోని సభ్యులందరినీ తొలగించారు. ఆ స్థానంలో మధ్యంతర కమిటీని ఏర్పాటు చేశారు. దానికి అర్జున రణతుంగ (Arjuna Ranatunga) నేతృత్వం వహించనున్నారు. 1996లో శ్రీలంక ప్రపంచ కప్ గెలిచింది. ఆ సమయంలో టీమ్ కేప్టెన్‌గా ఉన్నారు రణతుంగ. ఏడుగురు సభ్యులతో కూడిన ఈ కమిటీలో రణతుంగతో పాటు ముగ్గురు జడ్జ్‌లను సభ్యులుగా నియమించారు.

క్రికెట్ బోర్డ్‌ సెక్రటరీ మోహన్ డి సిల్వా (Mohan de Silva) రాజీనామా చేసిన వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది క్రీడాశాఖ. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంపై శ్రీలంక క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. క్రికెట్ బోర్డ్ సెక్రటరీ ఇంటి ఎదుట ఆందోళనలు నిర్వహించారు. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం మధ్యంతర కమిటీని నియమించిన క్రీడాశాఖ...క్రికెట్ ఎన్నికలు (Sri Lanka Cricket Election) జరిగేంత వరకూ ఈ కమిటీని కొనసాగించనుంది. మ్యాచ్‌ ఓటమితో పాటు క్రికెట్‌ బోర్డ్‌లు అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలూ బోర్డు రద్దుకి దారి తీశాయి. వీటిపై పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించారు క్రీడామంత్రి రోషన్ రణసింఘే. ఇందుకోసమే మధ్యంతర కమిటీని నియమించినట్టు వెల్లడించారు. క్రికెట్‌ బోర్డులో అవినీతి తగ్గించడంతో పాటు కీలక ప్రతిపాదనలు చేయాలన్న ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పాటైంది. ఇప్పటి వరకూ round-robin league లో శ్రీలంక 7 మ్యాచ్‌లు ఆడగా...అందులో 5 మ్యాచ్‌లు ఓడిపోయింది. ఫలితంగా సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Delhi Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూకంపం, అప్రమత్తంగా ఉండాలన్న ప్రధాని మోదీ
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.