అన్వేషించండి

ICC Champions Trophy: సరికొత్త వివాదం.. టీమిండియా జెర్సీపై పీసీబీ అభ్యంతరం

2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్, పాక్ ల మధ్య క్రికెట్ సంబంధాలు క్షీణించాయి.ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు.చివరగా ఇరుజట్ల మధ్య 2013లో ఆఖరుగా ద్వైపాక్షిక వన్డే, టీ20 సిరీస్ లు జరిగాయి. 

Ind Vs Pak: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో కొత్త వివాదం ప్రారంభమైంది. బీసీసీఐ వైఖరితోనే అనవసర వివాదం చోటు చేసుకుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆరోపిస్తోంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని వచ్చేనెల 19 నుంచి పాక్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్ల జెర్సీలపై పాక్ పేరు ఉండాలి. అయితే బీసీసీఐ తాజాగా విడుదల చేసిన టీమిండియా జెర్సీపై పాకిస్థాన్ పేరు లేదని తెలుస్తోంది. దీనిపై పీసీబీ విరుచుక పడింది. బోర్డు అధికారి మాట్లాడుతూ.. క్రీడల్లోకి రాజకీయాలను తేవడం సరికాదని వ్యాఖ్యానించాడు. టోర్నీకి సంబంధించిన కొన్ని సంప్రదాయాలను కూడా బీసీసీఐ పాటించడం లేదని ఆక్షేపించాడు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇరుదేశాల అభిమానులు కామెంట్లతో చర్చను హాట్ గా మారుస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరలైంది. 

కెప్టెన్ మీటింగ్ కు నో..
భారత ప్రభుత్వ సూచనతో టీమిండియాను పాక్ కు పంపించేందుకు బీసీసీఐ ససేమిరా అంటోంది. బీసీసీఐ పట్టుదల కారణంగానే ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ నిర్వహణలోకి దుబాయ్ కూడా వచ్చి చేరింది. హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్న ఈ టోర్నీలో కేవలం భారత్ ఆడే మ్యాచ్ లు మాత్రమే దుబాయ్ లో జరుగుతాయి. లీగ్ మ్యాచ్ లతోపాటు నాకౌట్ చేరుకుంటే సెమీస్, ఫైనల్ మ్యాచ్ లు కూడా దుబాయ్ లోనే జరిపేందుకు పీసీబీ అంగీకరించింది. అలాగే ఐసీసీ చాంపియన్స్ టోర్నీకి ముందు కెప్టెన్లతో జరిపే సమావేశానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మను కూడా పంపబోమని వెల్లడించింది. ఏదేనా ఐసీసీ టోర్నీ జరిగేముందు కెప్టెన్లతో మీటింగ్ నిర్వహించి, ఫొటో షూట్ తీయించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ సమావేశం పాక్ లో జరుగుతుండటంతో అక్కడకి రోహిత్ ను పంపేందుకు బీసీసీఐ నో చెప్పినట్లు తెలిసింది. 

ద్వైపాక్షిక సిరీస్ లు రద్దు..
2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత భారత్, పాక్ ల మధ్య క్రికెట్ సంబంధాలు క్షీణించాయి. దాదాపు ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు చెల్లు చీటి పడింది. చివరగా ఇరుజట్ల మధ్య 2013 జనవరిలో ఆఖరుగా ద్వైపాక్షిక వన్డే, టీ20 సిరీస్ లు జరిగాయి. అప్పటి నుంచి ఆసియాకప్, ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఇరుజట్లు పాల్గొంటున్నాయి. భారత్ లో పర్యటించేందుకు పాక్ ఆసక్తిగానే ఉన్నా, బీసీసీఐ ఖాతరు చేయడం లేదు. అలాగే పాక్ కు తమ జట్టును ససేమిరా పంపబోమని పలుమార్లు వెల్లడించింది. అయితే ఈసారి ఐసీసీ టోర్నీ 29 సంవత్సరాల తర్వాత పాక్ లో జరుగుతుండటంతో హైబ్రిడ్ మోడల్లో ఆడటానికి అంగీకరించింది. దీనికి బదులుగా పాక్ కూడా భారత్ లో పర్యటించబోదు. ఆసియాకప్, ఐసీసీ టోర్నీలు భారత్ లో జరిగినా, తటస్థ వేదికలపైనే ఆడుతుంది. దీనికి బీసీసీఐ కూడా అంగీకరించింది. ఏదేమైనా రాజకీయ కారణాలతో ఇరుజట్ల మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతినడంపై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు నిరాశ పడుతున్నారు. 

Also Read: Sanju Samson: ఆ కారణాలతోనే సంజూకి చోటు దక్కలేదు - బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ దిగ్గజ క్రికెటర్ వ్యాఖ్యలు

టాప్ హెడ్ లైన్స్

IND VS ENG 5th T20i Preview: శ్రేయస్  కెప్టెన్సీకి పొంచి ఉన్న గండం.. ఇంగ్లాండ్‌తో లాస్ట్ పోరుకు టీమిండియా సై, సంజూ శాంసన్ కంబ్యాక్ పై ఊహాగానాలు!
శ్రేయస్  కెప్టెన్సీకి పొంచి ఉన్న ముప్పు.. ఇంగ్లాండ్‌తో లాస్ట్ పోరుకు టీమిండియా సై, సంజూ శాంసన్ కంబ్యాక్ పై ఊహాగానాలు!
Smriti Mandhana Historic Milestone:  స్మృతి మంధాన సరికొత్త హిస్టారికల్ రికార్డ్..ఆ మైలురాయిని అందుకున్న యంగెస్ట్ ప్లేయర్ గా ఘ‌న‌త‌
స్మృతి మంధాన సరికొత్త హిస్టారికల్ రికార్డ్..ఆ మైలురాయిని అందుకున్న యంగెస్ట్ ప్లేయర్ గా ఘ‌న‌త‌
BCCI Series Defeat Review: ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
ఇంగ్లాండ్ చేతిలో  టీ20 సిరీస్ ఘోర పరాజయంతో గంభీర్ కోచ్ పదవిపై బీసీసీఐ బిగ్ యాక్షన్ ప్లాన్, శ్రేయస్ కెప్టెన్సీ మార్పు వల్లే కొంపమునిగిందా!
IND vs ENG 4th T20I: భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Khammam Sabha: కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
కాచుకో కేసీఆర్! 2029లో 182 సీట్లు.. 117 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం - సీఎం రేవంత్ రెడ్డి సంచలన జోస్యం!
Akhil Akkineni : తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
తండ్రి కాళ్లపై పడిన హీరో అఖిల్ - అయ్యగారితో కింగ్ ఎమోషనల్ మూమెంట్
Kagaznagar Thief Caught: ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
ఇంత అమాయకంగా దొంగతనం చేస్తారా? అడ్డంగా దొరికాక ఒళ్లు హూనం కాకుండా ఉంటుందా?
Double Occupancy OTT : పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
పగలు అమ్మాయి... రాత్రి అబ్బాయి - ఓటీటీలోకి సడన్‌గా తమిళ రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Roshan Kanakala : సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
సుమ కొడుకు రోషన్ సరికొత్త ప్రయోగం - సైన్స్ ఫిక్షన్ జానర్... స్పెషాలిటీ ఏంటంటే?
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Supreme Court Litigant Hurls Abuses Judges: సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
సుప్రీంకోర్టులో కలకలం! జడ్జీలపైకి ఫైళ్లు విసిరి, బూతులు తిట్టిన పిటిషనర్.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ!
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
Embed widget