అన్వేషించండి

Simhachalam Chandanotsavam 2024: వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం - సింహాద్రి అప్పన్న చందనోత్సవం గురించి ఈ విషయాలు తెలుసా!

Simhachalam Chandanotsavam : ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజు సింహాచలంలో చందనోత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ ఏడాది మే 10న చందనోత్సవం... ఈ రోజే ఎందుకు నిజరూప దర్శనం ఉంటుంది....

Simhachalam Chandanotsavam 2024 : నారసింహ క్షేత్రాలు దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే చాలా ఉన్నాయి. అయితే వీటన్నింటికి భిన్నంగా ఉంటుంది సింహాచల క్షేత్రం. వరాహం - నారసింహ రూపం కలసిన రూపం కేవలం సింహాచలంలో మాత్రమే కొలవైంది. వరాహ నరసింహ స్వామి దర్శనభాగ్యం లభించడమే జన్మజన్మల అదృష్టంగా భావిస్తారు. ఇక నిజరూపం దర్శనం అంటే...ఏడాదికి ఓసారి లభించే ఈ అపురూపాన్ని చూసేందుకు భక్తులు పోటీపడతారు. ఆ అపురూపమైన రోజే చందనోత్సవం...ఇది వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ రోజు

Also Read: సింహాద్రి అప్పన్న నుంచి కాటమరాయుడి వరకూ ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ నారసింహ క్షేత్రాలు

చందనోత్సవం ఎందుకు?

 హిరణ్యాక్షుడు, హిరణ్య కశిపుడు అనే ఇద్దరు రాక్షసులను హతమార్చేందుకు శ్రీ మహావిష్ణువు ధరించిన వరుస అవతారాలే వరాహం, నారసింహం. అయితే హిరణ్యాక్షుడిని వధించేందుకు వేసిన వరాహ రూపాన్ని పూర్తిగా విరమించకముందే..ప్రహ్లాదుడి పిలుపు మేరకు హిరణ్య కశిపుడి అవతారంలో వచ్చేశాడు. అందుకే ఈ వరాహం-నారసింహం కలసి రూపం కనిపిస్తుంది. అసుర సంహారం తర్వాత నృసింహుడు భీకరరూపం వీడకపోవడం చూసి లోకాలన్నీ వణికిపోయాయి. ఆ సమయంలో బ్రహ్మదేవుడు చందన వృక్షానికి తానిచ్చిన వరం గుర్తొచ్చింది... ఉగ్రం, ఉష్ణం, తాపం నివారించే శక్తిని చందన వృక్షానికి ప్రసాదించింది బ్రహ్మనే. ఆ విషయం ప్రహ్లాదుడికి సూచించడంతో వెంటనే ఆ భక్తుడు చందనసేవ చేసి నారసింహుడి ఉగ్రరూపాన్ని శాంతింపచేశాడు. ఆరోజే అక్షయ తృతీయ. శాంతించిన నృసింహస్వామి ప్రహ్లాదుడి కోరిక మేరకు సింహగిరిపై కొలువయ్యాడు. 

Also Read: యాదాద్రి సహా తెలంగాణలో నారసింహస్వామి కొలువైన మహిమాన్వితే క్షేత్రాలివే

స్వామి పుట్టలో ఎందుకున్నారు! 

తనను రక్షించమని..తండ్రికి కనిపించమని ప్రహ్లాదుడు ప్రార్థించడంతో వెంటనే గరుత్మంతుడిపైనుంచి స్వామివారు కిందకు దూకారట. ఆ సమయంలో పాదాలు పాతాళంలోకి వెళ్లాయని...అందుకే వరాహ నారసింహుడి పాదాలు ఇక్కడ కనిపించవని చెబుతారు. ప్రహ్లాదుడు తర్వాత ఆ చందన సేవ ఆగిపోయింది..స్వామివారి రూపంపై పుట్టలు పుట్టుకొచ్చాయి. కొంతకాలానికి పురూరవ చక్రవర్తి పుష్పకవిమానంపై వెళుతుండగా ... సరిగ్గా స్వామివారు పుట్టలో నిక్షిప్తమైన ప్రదేశానికి వచ్చేసరికి విమానం ఆగిపోయింది. ఆ రాత్రికి అక్కడే బసచేసిన పురూరవుడికి నారసింహుడు కలలో కనిపించి తన ఉనికి గురించి చెప్పాడు. అలా పుట్టలో ఉన్న స్వామివారిని బయటకుతీసి ప్రతిష్టించి మళ్లీ చందనోత్సవం నిర్వహిస్తున్నారు. 12 అడుగుల పుట్టలో దొరికిన గుర్తుగా 12 మణుగుల చందనాన్ని నారసింహుడికి సమర్పిస్తుంటారు..

Also Read:  అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయాలివే!

చందనోత్సవం విధానం ఇదే!

తమిళనాడు నుంచి జాజిపోకల అనే గంధపు చెక్కలు తెప్పించి...ఉత్సవానికి కొన్ని రోజుల ముందు నుంచే ప్రత్యేక పూజలు చేసి గంధం తీయడం ప్రారంభిస్తారు. చందనోత్సవానికి ముందు రోజు రాత్రికి స్వామివారిపై ఉన్న గంధాన్ని తొలగిస్తారు. అక్షయ తృతీయ రోజు తెల్లవారు ఝాము నుంచే నిజరూపం దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. మొదట దర్శన భాగ్యం ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజులకే కల్పిస్తారు. అర్థరాత్రి వరకూ నిజరూపం దర్శనం తర్వాత  సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం 108 వెండి కలశాలతో  పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. ఆ తర్వాత 3 మణుగులు అంటే 120 కిలోల చందనం లేపనంగా పూస్తారు. మళ్లీ నిజరూపం నుంచి నిత్యరూపంలోకి స్వామివారు మారుతారు. అయితే ఈ చందనం ఒక్కసారి కాదు..సంవత్సర కాలంలో మూడుసార్లు పూస్తారు. ఏడాదికి నాలుగుసార్లు ఒక్కోసారి 3 మణుగుల చొప్పున మొత్తం 12 మణుగుల చందనం లేపనంగా పూస్తారు. ఈ మొత్తం చందనాన్ని అక్షయ తృతీయ రోజు వలిచి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.  

Also Read: అక్షయ పాత్ర మొదట ఎవరు ఎవరికి ఇచ్చారు - ఇప్పుడా పాత్ర ఎక్కడుంది!

అద్వైత దర్శనానికి ప్రతీక
అక్షయ తృతీయ రోజు కొన్ని గంటలు మాత్రమే కనిపించే స్వామిరూపం ఎలా ఉంటుందో తెలుసా...
వరాహ ముఖం
మనిషి శరీరం
తెల్లని జూలు
రెండు చేతులు
భూమిలో ఉండిపోయిన పాదాలు
...ఈ నిజ రూపాన్ని దర్శించుకునేందుకు లక్షల మంది భక్తులు పోటీపడతారు. ఈ దర్శనం తర్వాత చందన లేపనం చేయగానే లింగరూపంలో కనిపిస్తారు స్వామివారు. ఇదే అద్వైత దర్శనానికి ప్రతీక..

లోకాలనేలే స్వామి చల్లగా ఉన్నప్పుడే జగమంతా చల్లదనం ఉంటుందని భక్తుల విశ్వాసం.. అందుకే ఈ చందనోత్సవం...

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Gade Innaiah Arrest: గాదె ఇన్నయ్య అరెస్ట్.. జనగామలో అదుపులోకి తీసుకున్న NIA అధికారులు
గాదె ఇన్నయ్య అరెస్ట్.. జనగామలో అదుపులోకి తీసుకున్న NIA అధికారులు
YS Jagan Birthday: వైఎస్ జగన్‌కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల సహా ప్రముఖులు బర్త్‌డే విషెస్
వైఎస్ జగన్‌కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల సహా ప్రముఖులు బర్త్‌డే విషెస్

వీడియోలు

Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్
Sanju Samson about Opener Place | ఓపెనర్ ప్లేస్ సంజు రియాక్షన్ ఇదే
Sanju Samson For T20 World Cup 2026 | మొత్తానికి చోటు దక్కింది...సంజూ వరల్డ్ కప్పును శాసిస్తాడా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Gade Innaiah Arrest: గాదె ఇన్నయ్య అరెస్ట్.. జనగామలో అదుపులోకి తీసుకున్న NIA అధికారులు
గాదె ఇన్నయ్య అరెస్ట్.. జనగామలో అదుపులోకి తీసుకున్న NIA అధికారులు
YS Jagan Birthday: వైఎస్ జగన్‌కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల సహా ప్రముఖులు బర్త్‌డే విషెస్
వైఎస్ జగన్‌కు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల సహా ప్రముఖులు బర్త్‌డే విషెస్
Nora Fatehi Car Accident: హీరోయిన్ కారుకు యాక్సిడెంట్... లేటెస్ట్‌ హెల్త్‌ అప్డేట్ - ఇప్పుడు అందాల భామకు ఎలా ఉందంటే?
హీరోయిన్ కారుకు యాక్సిడెంట్... లేటెస్ట్‌ హెల్త్‌ అప్డేట్ - ఇప్పుడు అందాల భామకు ఎలా ఉందంటే?
Revolver Rita OTT : ఓటీటీలోకి కీర్తి సురేష్ 'రివాల్వర్ రీటా' - ఎప్పటి నుంచి ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కీర్తి సురేష్ 'రివాల్వర్ రీటా' - ఎప్పటి నుంచి ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: తుపాకీతో కాల్చుకుని హైడ్రా కమిషనర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం.. బెట్టింగ్ యాప్స్‌తో నష్టాలు!
తుపాకీతో కాల్చుకుని హైడ్రా కమిషనర్ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం.. బెట్టింగ్ యాప్స్‌తో నష్టాలు!
Honda Activa vs TVS Jupiter.. యాక్టివా లేదా టీవీఎస్ జూపిటర్ ధర, మైలేజ్, ఫీచర్లలో ఏది బెస్ట్
Honda Activa vs TVS Jupiter.. యాక్టివా లేదా టీవీఎస్ జూపిటర్ ధర, మైలేజ్, ఫీచర్లలో ఏది బెస్ట్
Embed widget