అన్వేషించండి

Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ఆలయాలివే!

Akshaya Tritiya 2024:అక్షయ తృతీయ అంటే బంగారం అనే పూనకంతో ఊగిపోవడం కాదు. ఈ రోజుకి ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా కొన్ని ఆలయాలకు అక్షయ తృతీయ చాలా ప్రత్యేకం..ఏ ఏ ఆలయాలో ఇక్కడ తెలుసుకోండి..

Akshaya Tritiya 2024 Unique Events in Temples:  ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత ఉన్న రోజు అక్షయతృతీయ. ఎలాంటి ముహూర్తాలతో సంబంధం లేకుండా రోజు మొత్తం అమృత ఘడియల కిందే పరిగణిస్తారు. సాధారణంగా  ఏదైనా కొత్త పని మొదలుపెడితే తిథి, వారం, నక్షత్రం చూసుకుంటారు..కానీ అక్షయ తృతీయ రోజు అవేమీ చూడాల్సిన అవసరం లేదు. ఈ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ ప్రతి క్షణం శుభముహూర్తమే....ఏపని ప్రారంభించినా జయమే. అయితే ఇదే రోజు కొన్ని ఆలయాలకు ప్రత్యేకం. పైగా అవన్నీ ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన క్షేత్రాలు కావడం మరింత విశేషం..

Also Rad: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా!
  
చార్ ధామ్ యాత్ర ప్రారంభం

చార్ ధామ్ క్షేత్రాలను దీపావళి నుంచి 6 నెలల పాటూ మూసివేసి మళ్లీ అక్షయ తృతీయకు సమీపంలో  తెరుస్తారు. మూసి ఉన్న 6 నెలల కాలంలో దేవతలంతా వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారని నమ్మకం. అది నిజమే అని నిరూపిస్తూ ఆలయం మూసివేసినప్పుడున్న దీపం తిరిగి ఆరు నెలల తర్వాత తెరిచినప్పుడు కూడా అలాగే ఉంటుంది. గంగోత్రి, యమునోత్రిని అక్షయతృతీయ రోజే తెరుస్తారు. ఆ తర్వాత రెండు మూడు రోజుల విరామంలో కేదార్‌నాథ్, బద్రీనాథ్ తలుపులు తెరుచుకుంటాయి.  

Also Read: మాహిష్మతి రాజ్యాన్ని జయించిన మహావీరుడి జయంతి అక్షయ తృతీయ రోజే!

జగన్నాథుడి రథ నిర్మాణం ప్రారంభం

ఆషాడమాసం రాగానే పూరీ జగన్నాథుడి రథాయాత్ర సందడి మొదలవుతుంది. అయితే ఆ రథాన్ని తయారుచేయడం ఏటా అక్షయ తృతీయ రోజు ప్రారంభిస్తారు. నిర్మాణానికి వినియోగించే దుంగలు తీసుకొచ్చి ప్రత్యేక పూజ చేసి రథ నిర్మాణం ఆరంభిస్తారు. వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజు మొదలు పెట్టిన రథనిర్మాణం ఆషాడం వచ్చేసరికి పూర్తవుతుంది..

సింహాద్రి అప్పన్న నిజరూపం

ఏడాది మొత్తం లింగరూపంలో నిండుగా చందనంతో కప్పి ఉండే వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కేవలం అక్షయ తృతీయ రోజు మాత్రం నిజరూపంలో దర్శనమిస్తాడు. ఏడాదికోసారి కనిపించే ఈ దర్శనం కోసం భక్తులు పోటీపడతారు. వరాహం రూపం, మనిషి శరీరం, రెండు చేతులు పైకి కనిపిస్తాయి..కాళ్లు మాత్రం భూమిలో కూరుకుపోయినట్టు ఉంటాయి. ఈ నిజరూపం అక్షయతృతీయ ముందు రోజు అర్థరాత్రికి స్వామిపై ఉన్న చందనం మొత్తం తొలగించి కొన్ని గంటలపాటూ స్వామివారి నిజరూపాన్ని చూసే భాగ్యాన్ని భక్తులకు కల్పించి మళ్లీ చందనం లేపనం చేస్తారు. 

Also Read: అక్షయ పాత్ర మొదట ఎవరు ఎవరికి ఇచ్చారు - ఇప్పుడా పాత్ర ఎక్కడుంది!
 
12 ఆలయాల నుంచి ఒకేసారి ఊరేగింపు

తమిళనాడు కుంభకోణంలో గరుడసేవ అక్షయ తృతీయ నాడు జరుపుకుంటారు. ఈ రోజు సారంగపాణి ఆలయం, ఉప్పిలియప్పన్ ఆలయం సహా మొత్తం 12 వైష్ణవ ఆలయాల నుంచి ఉత్సవమూర్తులు ఒకేసారి గరుడవాహనంపై బయలుదేరుతారు. ఈ వేడుక చూసేందుకు రెండు కళ్లు సరిపోవు..
 
కన్నయ్య పాదాలు చూసే అదృష్టం ఈ ఒక్కరోజే

బృందావనంలో కొలువైన బృందావనమాలికి బంకే బిహారి అనే ఆలయం ఉంది. స్వామి హరిదాస్ నిర్మించిన ఆ క్షేత్రంలో కొలువైన గోపాలుడి పాద దర్శనం కేవలం అక్షయ తృతీయ రోజు మాత్రమే లభిస్తుంది.  బృందావనంలో ఉన్న అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటైన ఇక్కడ.. ఏడాది మొత్తం గోపాలుడి పాదాలు కమలాలతో కప్పి ఉంటాయి. 

Also Read: అక్షయ తృతీయ రోజు కొనుగోలు చేయాల్సిన వస్తువులు ఇవే!

సంస్కృతంలో అక్షయ అంటే 'ఎప్పటికీ తగ్గదు' అని అర్థం...అందుకే ఈ రోజు దాన ధర్మాలు చేయడం, నూతన వ్యాపారాలు ప్రారంభోత్సవం, నూతన గృహ నిర్మాణం చేయడం మంచిది. రోజు మొత్తం శ్రీ మహావిష్ణువుని ధ్యానించండి.   

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
KCR Warns Congress Government: రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి

వీడియోలు

India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు
Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
KCR Warns Congress Government: రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
Balakrishna : యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
Avatar OTT: 'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
Embed widget