Mahashivaratri 2026: మహా శివరాత్రి 4 ఝాముల్లో పూజ ఎలా చేయాలి? ఏ ఝాములో ఏ నైవేద్యం సమర్పించాలి?
ShivaPuja 2026: 4 రకాల శివరాత్రులున్నాయి. అన్నిటికన్నా మహాశివరాత్రి అత్యంత విశిష్టమనది. ఈ రోజు నాలుగు ఝాముల్లో పూజా విధానం , శివుడికి సమర్పించాల్సిన నైవేద్యాల గురించి తెలుసుకోండి...

Mahashivratri Puja Vidhi 2026: ఫిబ్రవరి 15 ఆదివారం మహా శివరాత్రి. ఈ సందర్భంగా శివ పూాజా విధానం, నాలుగు ఝాముల సమయాలు, ఆ సమయాల్లో సమర్పించాల్సిన నైవేద్యాల వివరాలు తెలుసుకుందాం.
శివరాత్రి నాలుగు విధాలు
1. నిత్య శివరాత్రి
ప్రతిరోజూ రాత్రివేళ శివుడిని ఆరాధించడమే నిత్య శివరాత్రి
2. పక్ష శివరాత్రి
పదిహేను తిథుల్లో చతుర్థశి లయకారుడైన పరమ శివునికి అత్యంత ప్రీతికరమైనది...ఆరోజు చేసె శివారాధన పక్ష శివరాత్రి
3.మాస శివరాత్రి
ప్రతి నెలలో అమవాస్య ముందు వచ్చే చతుర్దశి తిథి మాస శివరాత్రి. ఈరోజు పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనది, శివపూజకు విశిష్టమైనది
4. మహా శివరాత్రి
సంవత్సరానికి ఓసారి వచ్చేది మహాశివరాత్రి. ఏటా మాఘమాసంలో బహుళపక్ష చతుర్దశి నాడే శివుడు అగ్ని లింగరూపంలో ఆవిర్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు మహాశివరాత్రి
ఇలా నాలుగు విధాలుగా శివుడిని పూజిస్తారు భక్తులు. వీటిలో మహాశివరాత్రి అత్యంత విశిష్టమైనది. శివ అనే నామం ఉచ్ఛరించడమే మోక్షదాయకం. శివ అనే పేరులో శి అనే అక్షరం పాపాలు హరిస్తుంది వ అనే అక్షరం ముక్తిని ప్రసాదిస్తుందని బ్రహ్మ వైవర్త పురాణంలో ఉంది. ఒక్క శివ నామంలోనే ఇంత శక్తి ఉంటే..నాలుగు విధాలుగా శివరాత్రులను జరుపుకుంటే లెక్కలేనంత ఫలితం లభిస్తుందని శాస్త్ర వచనం. వీటిలో మహాశివరాత్రి వ్రతాన్ని చేసినా మోక్షం సిద్ధిస్తుందని చెబుతారు పండితులు
మహాశివరాత్రి ఏ ఝాములో ఎలా పూజచేయాలి?
మహా శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి అభిషేకాలు, పూజలు చేయడంతో పాటు జాగరణ చేయాలని 'లింగ పురాణం' చెబుతోంది. రోజంతా శివనామస్మరణ, అభిషేకాలు చేయడమే కాదు రాత్రి వేళ నాలుగు ఝాముల్లో అభిషేకాలు పూజలు చేయాలని లింగపురాణం చెబుతోంది
ఝాము సుమారు 3 గంటల సమయం ఉంటుంది. ఈ నాలుగు ఝాముల్లో శివుడికి అభిషేకాలు, బిల్వపత్ర సమర్పణ చేస్తారు.
ఫిబ్రవరి 15 ఆదివారం ఝాము సమయాలు గమనిస్తే
మొదటి ఝాము
మొదటి ఝాము సమయం సాయంత్రం దాదాపు ఆరున్నర గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నవరకు. ఈ సమయంలో శివుడిని పాలతో అభిషేకించి, పద్మాలతో పూజచేసి, పులగం నైవేద్యంగా సమర్పించవలెను.
రెండవ ఝాము
రెండవ ఝాము రాత్రి తొమ్మిదిన్నర నుంచి అర్థరాత్రి పన్నెండున్నవరకు ఉంటుంది. ఈ ఝాములో పరమశివుడిని పెరుగుతో అభిషేకించాలి. పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి
మూడవ ఝాము
మూడవ ఝాము సమయం దాదాపు అర్థరాత్రి పన్నెండురన్నర నుంచి మూడున్నవరకు. ఈ ఝాములో శివుడిని నెయ్యితో అభిషేకించి మారేడు దళాలతో పూజించాలి. నువ్వులతో వండిన నైవేద్యాన్ని సమర్పించాలి
నాల్గవ ఝాము
నాల్గవఝాము సమయం దాదాపు మూడున్నర నుంచి సూర్యోదయం వరకు. ఈ సమయంలో శివుడిని తుమ్మిపూలతో పూజించి అన్నాన్ని నివేదించాలి
మహాశివరాత్రి వేళ మూడవ ఝాము అత్యంత విశిష్టమైన సమయం. ఈ సమయంలో శివయ్యను పూజిస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.
మహాశివరాత్రి రోజు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఉపవాసం, జాగరణ.
శివలింగం మూలం బ్రహ్మ స్వరూపం
మధ్యభాగం విష్ణు స్వరూపం
పైభాగం శివస్వరూపం
పానపట్టం గౌరీ స్వరూపం
అంటే..శివలింగాన్ని పూజిస్తే సృష్టి, స్థితి లయకారులైన త్రిమూర్తులను, ఆదిశక్తిని పూజించిన్టే
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
























