అన్వేషించండి

kedaranath Yatra 2025: 42 రోజుల్లో 10 లక్షల మంది భక్తులు - కేదార్‌నాథ్‌ యాత్ర విశేషాలు, జాగ్రత్తలు, పూర్తి సమాచారం!

Kedarnath Dham Yatra: ఉత్తరాఖండ్‌లో చార్ ధామ్ యాత్రకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. మే 2న ప్రారంభమైన ఈ యాత్రకు ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో భక్తులు తరలివస్తున్నారు

Kedaranath Yatra 2025: కేవలం 42 రోజుల్లో  10 లక్షల మంది భక్తులు కేదార్ నాథ్ ని దర్శించుకున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. చార్ ధామ్ యాత్ర కష్టమైనా , ఛాలెంజింగ్ మార్గం అయినా, వరుస ప్రమాదాలు జరుగుతున్నా కేదార్‌నాథ్ ధామ్‌లో భక్తుల సందడి పెరుగుతూనే ఉంది. 

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి కేదార్‌నాథ్ ఆలయం. సముద్ర మట్టానికి 3 వేల 583 అడుగులో ఎత్తులో మందాకినీ నది పక్కన ఉంది కేదార్ నాథ్ ఆలయం. పరమేశ్వరుడి భక్తులకు అత్యంత ఇష్టమైన క్షేత్రం ఇది. హిమాలయాల్లో ఉన్న కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యుమునోత్రిని చార్‌ధామ్ యాత్రగా పిలుస్తారు.

కేదార్ నాథ్ ఆలయాన్ని పాండవులు నిర్మించారని పురాణాల్లో ఉంది. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత వ్యాసమహర్షి సూచన మేరకు పాండవులు కేదార్‌నాథ్ లో శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఏడాదిలో ఆరు నెలల పాటూ పూజలందుకుంటాడు ఇక్కడ శివయ్య. మిగిలిన ఆరునెలలు మంచునిండడంతో మూసివేస్తారు. మిగిలిన 6 నెలలు ఉఖీ మఠ్ లో పూజలు నిర్వహిస్తారు.  

చారిత్రక ఆధారాలప్రకారం సుమారు 1200 సంవత్సరాల క్రితం చార్ ధామ్ యాత్ర ప్రారంభించారు. అప్పటి నుంచి ఏటా ఎలాంటి ఆటంకం లేకుండా యాత్ర కొనసాగుతోంది. ప్రపంచం నలుమూలల నుంచి యాత్రికులు భారీగా తరలివస్తుంటారు. ఏటా అక్షయ తృతీయ రోజు తెరుచుకునే ఈ ఆలయాలను దర్శించుకోవడం అంటే సాహసయాత్రలా భావిస్తారు భక్తులు. దీపావళి తర్వాత మంచు కురిసే సమయంలో ఆలయ తలుపులు మూసేస్తారు. చలికాలం మొదలైనప్పుడు అప్పటి వాతావరణ పరిస్థితులను చూసుకుని ఆలయానికి వెళ్లే మార్గాలు మూసివేస్తారు. అందుకే చార్ ధామ్ యాత్ర చేయాలి అనుకున్నా..ముఖ్యంగా కేదార్ నాథ్ వెళ్లాలి అనుకున్నా వర్షాకాలం ఆరంభంకాకముందు వెళ్లడమే మంచిది. ఏటా మహాశివరాత్రి తర్వాత నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ఆలయానికి వెళ్లాలి అనుకుంటే రోడ్డు మార్గం అందుబాటులో ఉండదు. ట్రెక్కింగ్ ద్వారా వెళ్లాలి లేదంటే డోలీ సేవలు వినియోగించుకోవచ్చు.  

మన దేశంలో కేదార్‌నాథ్ యాత్ర హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి మొదలవుతుంది. ఈ ప్రాంతాలకు సమీపంలో రైలు సౌకర్యం ఉంది,  బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. విమాన సేవలున్నాయి. చార్ ధామ్ యాత్రకు వెళ్లాలి అనుకుంటే కచ్చితంగా ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండవు అందుకే ముందుగానే రూమ్స్, గెస్ట్ హౌస్ లు
 
కేదార్‌నాథ్ వెళ్లాలనుకునే వారు కనీసం వారం రోజుల సమయం తీసుకోవాలి. ఇక్కడికి వెళ్లాలనుకునే వారు హోటల్స్, రూమ్స్, ధర్మశాలలు, గెస్ట్ హౌసెస్‌ను ముందుగా బుక్ చేసుకోవాలి. ఎందుకంటే దాదాపు పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి కానీ చార్ ధామ్ యాత్రలో ఎలాంటి సౌకర్యాలు ఉండవు.  అందుకే అన్నీ ముందుగానే చూసుకోవాల్సి ఉంటుంది. టార్చ్, ఛార్జర్, ప్రాధమిక చికిత్స కోసం సామగ్రి , వాటర్ బాటిల్స్, స్వెట్టర్లు కచ్చితంగా ఉంచుకోవాలి. చేతిలో నగదు ఉంచుకోవడం అవసరం.

షేర్ మార్కెట్ ఏ నెలలో పెరుగుతుంది , ఏ నెలలో డౌన్ అవుతుంది - ఇప్పుడు పెట్టుబడులు పెట్టడం సేఫేనా తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

బంగారం, వెండి ధరల్లో భారీ హెచ్చు తగ్గులు..ఏ ఏ నెలల్లో పుత్తడి ధర తగ్గుతుందో పూర్తి సమాచారం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

12-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
12-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
అంతర్గత అంధకారాన్ని తొలగించే అమావాస్య ! ఆగష్టు 12 సూర్యగ్రహణం..ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
అంతర్గత అంధకారాన్ని తొలగించే అమావాస్య ! ఆగష్టు 12 సూర్యగ్రహణం..ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget