అన్వేషించండి

YSRCP: టీడీపీపై ఇప్పుడు ఆన్ లైన్ .. ఎన్నికలకు ముందు గ్రౌండ్ వార్ - వైఎస్ఆర్‌సీపీ పొలిటికల్ రీ బ్రాండింగ్ ప్లాన్!

YSRCP : వైసీపీ ప్రజాపోరాటాల్లో రీ బ్రాండింగ్ వ్యూహం అమలు చేస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకతను ఓట్లుగా మల్చుకునేందుకు పెద్ద ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

YSRCP online war:  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేనప్పటికీ, ప్రజల గొంతుకగా నిలిచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త  రీ-బ్రాండింగ్  వ్యూహంతో ముందుకు వెళ్తోంది. గత ఎన్నికల ఓటమిని విశ్లేషించుకున్న అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు పరిపాలనను కేవలం విమర్శించడమే కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవ్వడమే లక్ష్యంగా కొత్త కార్యాచరణను రూపొందించారు. 

టార్గెట్ అమరావతి                                    

రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రభుత్వం చూపిస్తున్న లెక్కలపై వైఎస్సార్‌సీపీ ఎదురుదాడి ప్రారంభించింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి   సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అనే ప్రభుత్వ వాదన పచ్చి అబద్ధమని ధ్వజమెత్తారు. ఎకరాకు రూ. 3.63 కోట్ల రిజిస్ట్రేషన్ విలువ ఉన్న భూమిని రూ. 50 కోట్లుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, సచివాలయ భవనాలకు చదరపు అడుగుకు రూ. 20 వేలకు పైగా ఖర్చు చేయడం భారీ కుంభకోణానికి నిదర్శనమని ఆయన ఆరోపించారు. ఈ  అవినీతి  ప్రచారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలని పార్టీ భావిస్తోంది.

సోషల్ మీడియాపై ఎక్కువ దృష్టి                              

గత వైఎస్సార్‌సీపీ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు ఇప్పుడు నీరుగారిపోతున్నాయనే అంశాన్ని జగన్ తన ప్రధాన అస్త్రంగా మార్చుకున్నారు.  వచ్చే ఎన్నికల నాటికి యువతను, సోషల్ మీడియా జనరేషన్‌ను ఆకట్టుకోవడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ తన డిజిటల్ విభాగాన్ని ప్రక్షాళన చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా YSRCP Social Media 2026  పేరిట రిజిస్ట్రేషన్ డ్రైవ్ చేపట్టి, ప్రతి నియోజకవర్గంలో చురుకైన కార్యకర్తలను ఎంపిక చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ఎండగట్టడం, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని పోల్చి చూపడం ద్వారా  డిజిటల్ పోరాటం సాగించాలని జగన్ తన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

 పాదయాత్ర దిశగా జగన్.. మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి!                    

అసెంబ్లీలో బలం తక్కువగా ఉన్నా, ప్రజల్లో తనకున్న పట్టు తగ్గలేదని నిరూపించుకునేందుకు జగన్ మళ్ళీ  పాదయాత్ర కు సిద్ధమవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయ్యాక, వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఏలూరు వంటి నియోజకవర్గాల నేతలతో వీక్లీ మీటింగ్స్ నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు.  ప్రస్తుతానికి వైఎస్సార్‌సీపీ అనుసరిస్తున్న ఈ  రీ-బ్రాండింగ్  వ్యూహం క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. అయితే, కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, ప్రజల సమస్యలపై నిలకడగా పోరాడటంపైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను ఓట్లుగా మలచుకోవాలంటే, జగన్ తన వ్యూహాలను మరింత పకడ్బందీగా అమలు చేయాల్సి ఉంటుంది.          

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Mavigun Vs Amaravati: అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
Telangana Political Narrative : రేవంత్ అసెంబ్లీ వ్యూహం వేరు.. మంత్రుల దూకుడు వేరు! కాంగ్రెస్‌కు సమన్వయ లోపం చిక్కులు తెచ్చిపెడుతోందా?
రేవంత్ అసెంబ్లీ వ్యూహం వేరు.. మంత్రుల దూకుడు వేరు! కాంగ్రెస్‌కు సమన్వయ లోపం చిక్కులు తెచ్చిపెడుతోందా?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP and Telangana: నేడు ఏపీలో ఈ జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం, 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
నేడు ఏపీలో ఈ జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం, 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Embed widget