అన్వేషించండి

Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?

YSRCP Criticism on PM Modi: నిన్నటి వరకు కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఆచితూచి వ్యవహరించిన వైసీపీ తన రూట్ మార్చినట్లు కనిపిస్తోంది. మోదీ ఏడు సూత్రాల పై ఘాటుగా స్పందించడం చర్చనీయాంశమైంది.

YSRCP Criticism on PM Modi 7 Appeals: పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీతో ఒక రకమైన అప్రకటిత మిత్రత్వం  కొనసాగించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు తన రాజకీయ వ్యూహాన్ని సమూలంగా మార్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల కారణంగా  ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన  సెవెన్ అప్పీల్స్  పిలుపుపై వైసీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇది కేవలం ఒక విధానపరమైన విమర్శ మాత్రమే కాదని, బీజేపీతో తెగతెంపులు చేసుకునే దిశగా పడుతున్న తొలి అడుగు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

 మోదీ సూత్రాలపై ఎద్దేవా -  బాధ్యత ఎవరిది? 

తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన వైసీపీ అధికార ప్రతినిధి పేర్ని, ప్రధాని మోదీపై నేరుగా విమర్శలు గుప్పించారు. ప్రజలకు నీతులు చెప్పే ముందు మోదీ ఆ సూత్రాలను స్వయంగా ఆచరించి చూపాలి  అంటూ ఎద్దేవా చేశారు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు ప్రజలే కారణమన్నట్లుగా ప్రధాని వ్యవహరించడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లు ఆపాలని, విదేశీ పర్యటనలు వాయిదా వేసుకోవాలని చెప్పడం కాదని మోదీ ఆచరించాలన్నారు.  

 తమిళనాడు ఎఫెక్ట్ - విజయ్ బాటలో జగన్? 

తమిళనాడులో సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని  తమిళ వెట్రి కజగం సాధించిన విజయం, అక్కడ ఆయన అనుసరిస్తున్న రాజకీయ పంథా జగన్‌ను ఆకర్షించినట్లు కనిపిస్తోంది. విజయ్ నేరుగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌తో జతకట్టి అక్కడ అధికారంలోకి రావడంతో, జగన్ కూడా అదే తరహా ప్రయోగానికి సిద్ధమవుతున్నారని సమాచారం. బీజేపీ ,  టీడీపీ,జనసేన ఒకే కూటమిలో ఉండటంతో  జగన్ ఇక బీజేపీపై ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది.  చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న జగన్, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఆ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  బీజేపీ కూటమిని ఢీకొట్టాలంటే కాంగ్రెస్‌తో కలవడమే ఏకైక మార్గమని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. విజయ్ పార్టీని నెత్తికెక్కించుకున్న వైసీపీ సోషల్ మీడియా విభాగాలు కూడా, బీజేపీకి వ్యతిరేకంగా గళం వినిపించడం ద్వారా కాంగ్రెస్ వైపు వెళ్లేందుకు క్షేత్రస్థాయిలో సంకేతాలు పంపుతున్నాయి.

 కేంద్రంపై పోరాటమే ఇక ఏకైక అజెండా? 

రాష్ట్రంలో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి బలంగా ఉండటంతో, జగన్ ఇక తన పోరాటాన్ని నేరుగా కేంద్రంపైకి మళ్లించాలని నిర్ణయించుకున్నారు. గతంలో  విభజన హామీలు, ప్రత్యేక హోదా విషయాల్లో కేంద్రంపై మెతక వైఖరి అవలంబించారనే విమర్శలను చెరిపివేసేందుకు మోదీని నేరుగా టార్గెట్ చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవల  పార్లమెంట్ లో ప్రత్యేకహోదా అంశాన్ని వైసీపీ ఎంపీలు ప్రస్తావించారు.  ప్రధాని మోదీ విఫలమవుతున్నారని వైసీపీ అధికారికంగా ప్రకటించడం అంటే, భవిష్యత్తులో బీజేపీతో దోస్తీకి శాశ్వతంగా ముగింపు పలికినట్లేనని భావించవచ్చు. విజయ్ స్ఫూర్తితో కాంగ్రెస్ వైపు అడుగులు వేయడం ద్వారా జగన్ తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. ఒకవేళ జగన్ నిజంగానే కాంగ్రెస్‌తో జట్టు కడితే, అది ఏపీలో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా పెద్ద సంచలనంగా మారనుంది. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Janasena Delhi Meeting: ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
మోడీ vs నెహ్రూ ! దేశానికి సుదీర్ఘ ప్రధాని ఎవరు ??, Modi or Nehru, Who is longest serving PM??
మోడీ vs నెహ్రూ ! దేశానికి సుదీర్ఘ ప్రధాని ఎవరు ??, అసలు లెక్కలు ఏం చెప్తున్నాయి!
Rajinikanth vs Vijay Rivalry: దళపతి విజయ్‌కు పోటీగా అల్లుడిని రంగంలోకి దింపుతున్న రజనీకాంత్‌! ఆసక్తిగా మారుతున్న తమిళనాడు రాజకీయాలు!
దళపతి విజయ్‌కు పోటీగా అల్లుడిని రంగంలోకి దింపుతున్న రజనీకాంత్‌! ఆసక్తిగా మారుతున్న తమిళనాడు రాజకీయాలు!
MLA Thomas: నేను తల్చుకుంటే డ్రాయర్‌పై పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టిస్తా - మాజీ డిప్యూటీ సీఎంకు ఎమ్మెల్యే వార్నింగ్
నేను తల్చుకుంటే డ్రాయర్‌పై పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టిస్తా - మాజీ డిప్యూటీ సీఎంకు ఎమ్మెల్యే వార్నింగ్
Advertisement

వీడియోలు

Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Womens T20 World Cup 2026 | మహిళల టీ20 వరల్డ్‌కప్‌కు టీమిండియా రెడీ
Who is Cricketer Bharti Fulmali | ట్రోలర్స్ నోర్లు మూయించిన మహిళా క్రికెటర్
Seniors Complain Against Gautam Gambhir | గౌతమ్ గంభీర్‌పై బీసీసీఐకి ఫిర్యాదు ?
Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bharat Future City Hyderabad:ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!
ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!
TMC Crisis 2026: యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
యూ టూ కల్యాణ్ బెనర్జీ - దీదీకి అల్టిమేటం - ఇంకెవరు మిగులుతారు?
Janasena Delhi Meeting: ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
ఢిల్లీలో జనసేన మూడు రోజుల ప్రత్యేక సమావేశాలు - జాతీయ స్థాయికి సేనగళం - పవన్ నెక్ట్స్ లెవల్ ప్లాన్ !
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
వరలక్ష్మి గారు సారీ అండి... అపాలజీ యాక్సెప్టెడ్ - కాంట్రవర్సీకి చెక్
Actor Karthik : గుర్తు పట్టలేని స్థితిలో సీతాకోకచిలుక హీరో - ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?
గుర్తు పట్టలేని స్థితిలో సీతాకోకచిలుక హీరో - ఇప్పుడెలా ఉన్నారో తెలుసా?
Indian Seafarers Killed Oman:హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
హొర్మూజ్ సమీపంలో నౌకలపై అమెరికా క్షిపణి దాడులు! ముగ్గురు భారతీయ నావికా సిబ్బంది మృతి!
Vastu Tips Telugu: ఇంటి ద్వారానికి కట్టిన పచ్చని తోరణం ఎప్పుడు తీయాలి?
ఇంటి ద్వారానికి కట్టిన పచ్చని తోరణం ఎప్పుడు తీయాలి?
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Hardik Pandya Ruled Out of ODI | ఆఫ్ఘాన్ వన్డే సిరీస్‌కు హార్దిక్ దూరం ?
Embed widget