అన్వేషించండి

YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?

YSRCP Silent on NEET Controversy: జాతీయ స్థాయి రాజకీయ సెగను రీజినల్ మైలేజీగా మార్చడంలో వైఎస్‌ జగన్ విఫలమవుతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏ చిన్న అడుగూ వేయడానికి ఆయన సిద్ధంగా లేకపోవడమే దీనికి కారణం.

AP Political Polarization 2026: దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వర్సెస్ ఇండియా   కూటమి ప్రతిపక్షాల నడుమ తీవ్రమైన రాజకీయ పొలరైజేషన్ నడుస్తోంది.  నీట్  క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం నుంచి పార్లమెంట్ నిరసనల వరకు ప్రతి అంశమూ కేంద్ర వర్సెస్ విపక్షాలుగా ప్రత్యక్ష రణరంగాన్ని తలపిస్తోంది. అయితే, దేశమంతటా ఈ స్థాయిలో రాజకీయ వేడి రగులుతుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం చిత్రమైన రాజకీయ నిశ్శబ్దం  అలముకుంది. ఏపీలో కూడా ఎన్డీఏ శ్రేణుల పాలన నడుస్తుండటం, ప్రధాన ప్రతిపక్షంగా వైయస్సార్‌సీపీ ఉండటంతో జాతీయ స్థాయి అంశాలపై ఇక్కడ కూడా రాజకీయ సెగ రావలసి ఉంది. కానీ, ఆ స్థాయి ప్రతిస్పందన ఏపీ రాజకీయాల్లో కనిపించకపోవడం పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.

జగన్‌కు మంచి రాజకీయ అవకాశం

రాష్ట్రంలో విపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో నీట్ బాధితులు, విద్యార్థుల పక్షాన నిరసన ప్రదర్శనలు చేపట్టినప్పటికీ, ఏపీలో ఆ పార్టీకి ఉన్న పరిమిత బలమైన కేడర్, ఓటు బ్యాంక్ దృష్ట్యా ఆ ఆందోళనలు అధికార పక్షంపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. నిజానికి, వైయస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇది ఓ అరుదైన రాజకీయ అవకాశం. రాష్ట్రంలో లక్షలాది మంది నీట్ అభ్యర్థులు, యువత ఆందోళనలో ఉన్న వేళ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిలదీస్తూ గళమెత్తి ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా వైయస్సార్‌సీపీకి మైలేజీ వచ్చి ఉండేది. కానీ, వైయస్సార్‌సీపీ ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా విద్యార్థి పోరాటంలోకి దూకలేకపోయింది.

కాక్రోచ్‌లకు మద్దతు ప్రకటించలేకపోయిన వైసీపీ

ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న ప్రతిపక్షాల సమరానికి జగన్ మద్దతు ఇవ్వకపోవడం వెనుక ఆయన సొంత రాజకీయ సమీకరణలు ఉన్నప్పటికీ, కనీసం స్వతంత్రంగా విద్యార్థుల హక్కుల కోసమైనా గళం విప్పకపోవడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్‌తో జట్టుకట్టడం ఇష్టం లేకపోయినా, యువత బహుళ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఈ అంశంపై క్షేత్రస్థాయిలో తిరుగుబాటు జెండా ఎగరేసి ఉంటే వైయస్సార్‌సీపీ మళ్లీ జనామోదాన్ని పొందేందుకు అది నైతిక బలాన్ని ఇచ్చేది. కానీ, జగన్ ధైర్యంగా ముందుకు రాకపోవడం వల్ల ఏపీలో అధికార కూటమికి ఎలాంటి విపక్ష నిరసనల సెగ తగలకుండా సురక్షితంగా బయటపడే అవకాశం లభించింది. జాతీయ స్థాయిలో నడుస్తున్న ప్రతిపక్షాల వేవ్‌ను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో వైయస్సార్‌సీపీ నాయకత్వం చూపుతున్న ‘అతి జాగ్రత్త వైఖరి  వెనుక బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంతో నేరుగా విభేదించడం వల్ల రాబోయే రోజుల్లో  చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయనే భయాలు వైయస్సార్‌సీపీ వైఖరిని నియంత్రిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఢిల్లీ పర్యటనల ద్వారా కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించేందుకు జగన్ యత్నించిన తీరు చూస్తే, ఆయన కేంద్ర అధికార పీఠంతో నేరుగా ఢీ కొట్టేందుకు అస్సలు సిద్ధంగా లేరని స్పష్టమవుతోంది.

రాజకీయంగా ఈ మౌనం వల్ల వైసీపీకి నష్టమే

ఈ రక్షణాత్మక రాజకీయ ధోరణి వల్ల ప్రధానంగా నష్టపోతోంది వైయస్సార్‌సీపీ మాత్రమేనని చెబుతున్నారు.  ఒక ప్రతిపక్షంగా ప్రజలు, యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై వీధుల్లోకి వచ్చి పోరాడటంలో విఫలమైనప్పుడు, ఆ రాజకీయ ఖాళీని  ఇతర శక్తులు పూరించే ప్రమాదం ఉంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి పార్టీ కేడర్‌ను తిరిగి సమీకరించడానికి, కొత్త ఉత్సాహాన్ని నింపడానికి  నీట్ వంటి జాతీయ అంశం ఒక అద్భుతమైన రాజకీయ అస్త్రంగా ఉపయోగపడి ఉండేది. కానీ, ఆ అవకాశాన్ని వైయస్సార్‌సీపీ చేజేతులా వదులుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  ప్రతిపక్షం నుంచి గట్టి ప్రతిఘటన లేదా రాజకీయ నిరసనలు లేకపోవడంతో, కూటమి ప్రభుత్వం తమ పాలనాజెండాను చాలా సులువుగా అమలు చేయగలుగుతోంది. ఒకవైపు దేశమంతటా విపక్షాలు కేంద్రాన్ని కుదిపేస్తుంటే, ఏపీలో మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి రాజకీయ ఇబ్బందులు లేకుండా అత్యంత కంఫర్టబుల్ జోన్‌లో కొనసాగుతోంది.

అగ్రెసివ్ గా లేకపోతే పొలిటికల్ మైలేజీ ఎలా? 

జాతీయ స్థాయిలో వస్తున్న అవకాశాలను అందుకోవడంలో, ప్రజా సమస్యలపై అగ్రెసివ్ మైలేజీ సాధించడంలో వైఎస్ జగన్ అనుసరిస్తున్న ఈ  వెనకడుగు వైఖరి వైయస్సార్‌సీపీ భవిష్యత్ రాజకీయాలకు ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. ప్రతిపక్ష హోదాలో ఉంటూ కూడా కేంద్రంతో లేదా అధికార కూటమితో తలపడటానికి వెనుకాడటం వల్ల పార్టీ మద్దతుదారుల్లో తీవ్ర నిరాశ నెలకొంటోంది. రాబోయే రోజుల్లోనైనా జగన్ తన రాజకీయ శైలిని మార్చుకుని, ప్రజల్లో ఉండే సమస్యలపై పోరాట బాట పడతారా లేక ఇదే సైలెంట్ స్ట్రాటజీని కొనసాగిస్తారా అనేది చూడాల్సి ఉంది.


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
AP Municipal Elections: ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
ఏపీలో ప్రత్యక్ష పద్ధతిలో మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు.. చట్టంలో మార్పులతో ఎవరికి లాభం?
Advertisement

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget