అన్వేషించండి

Sharmila News: షర్మిలపై వైసీపీ నేతల వ్యాఖ్యలు బూమ్‌రాంగ్‌ అవుతాయా..?

వైఎస్‌ షర్మిలపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. షర్మిలకు దీటుగా బదులివ్వడం ద్వారా కట్టడి చేయవచ్చని వైసీపీ నేతలు భావిస్తే స్వీయ తప్పిదంగా మారుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

YSRCP Wrong Step ON Sharmila: ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిలపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం జగన్‌తో విబేధించిన షర్మిల కొన్నాళ్ల కిందట కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఏపీ బాధ్యతలను చేపట్టారు. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత రాజకీయంగా ఆమె ఫుల్‌ యాక్టివ్‌ అయ్యారు. జిల్లాలు వారీగా పర్యటిస్తూ కేడర్‌తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె అధికార వైసీపీతోపాటు సీఎం జగన్మోహన్‌రెడ్డిపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రెండు రోజులు కిందటి వరకు రాజకీయపరమైన విమర్శలకు పరిమితమైన షర్మిల.. తాజాగా కుటుంబపరమైన విమర్శలకు దిగిపోయారు. తన అన్న సీఎం జగన్మోహన్‌రెడ్డికి, తనకు మధ్య ఉన్న గొడవ, దానికి కారణం ఎవరన్న విషయాలను మీడియా ముఖంగానే ఆమె వెల్లడిస్తున్నారు. కుటుంబంలో వచ్చిన గొడవకు సంబంధించి షర్మిల మాట్లాడుతున్న సమయంలో కాస్త పరుష పదజాలాన్నే వాడుతున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీ నేతలను ఆగ్రహానికి గురి చేస్తోంది. షర్మిల చేసే రాజకీయ వ్యాఖ్యలకు అంతే ధీటుగా బదులిస్తున్న వైసీపీ నేతలు.. కుటుంబ పరంగా షర్మిల చేస్తున్న వ్యాఖ్యలను ఖండించడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. షర్మిల రోజురోజుకూ దిగజారి వ్యాఖ్యానిస్తున్నారంటూ వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఇదే ఇప్పుడు ఆ పార్టీ నేతలకు మింగుడు పడని అంశంగా మారింది. 

వైసీపీకి ఇబ్బందిగా పరిణమించే ప్రమాదం.. 

వైఎస్‌ షర్మిల ప్రజల్లోకి వెళ్లి అధికార వైసీపీపై చేస్తున్న విమర్శలు కొంత వరకు అధికార పార్టీకి ఇబ్బందిగా పరిణమించే అవకాశముందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు రాజకీయ విమర్శలు చేసినప్పుడు.. అంతే ధీటుగా వైసీపీ నేతలు బదులిచ్చేవారు. కానీ, ఇప్పుడు షర్మిల కుటుంబపరమైన అంశాలను బయటకు తీసి ఆరోపణలు చేస్తుండడంతో వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు. షర్మిల చేస్తున్న ఆరోపణలను ఖండించలేక, దానిపై మరింత గట్టిగా విమర్శలు చేయలేక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఒకరిద్దరు నేతలు బయటకు వచ్చిన షర్మిలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. సజ్జల, రోజా వంటి నేతలు వ్యాఖ్యలతో షర్మిల మరింతగా రెచ్చిపోతున్నారన్న భావన వైసీపీ నేతల్లో ఉంది. షర్మిల రోజురోజుకూ చేసే తీవ్ర వ్యాఖ్యలు ఎన్నికలు ముందు పార్టీకి ఇబ్బందిగా పరిణమించే ప్రమాదముందని పలువురు భావిస్తున్నారు. రాజకీయ విమర్శలు వల్ల ఇబ్బంది లేకపోయినా.. కుటుంబ వ్యవహారాలను బయటకు తెచ్చి ఆరోపణలు చేయడం వల్ల వైఎస్‌ కుటుంబ ప్రతిష్ట మసకబారుతుందని, ఇది ఒకరకంగా జగన్మోహన్‌రెడ్డికి ఇబ్బందికరంగా పరిణమించే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

కట్టడి సాధ్యపడుతుందా..?

కాంగ్రెస్‌ పార్టీ తరపున షర్మిల ప్రజల్లోకి జోరుగా వెళుతున్నారు. అధికార, ప్రతిపక్షాలపై ధీటైన విమర్శలు చేస్తున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల్లో టికెట్లు రాని నేతలకు షర్మిల ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. ఆయా పార్టీల్లో సీట్ల పంపకాలు తేలిన తరువాత ఎంతో మంది నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లలో అయినా బలమైన అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీలో బరిలో దించే అవకాశం కనిపిస్తోంది. అధికార, ప్రతిపక్షాలపై సమాన స్థాయిలో విమర్శలు చేస్తున్న షర్మిలను రెచ్చగొట్టేలా వైసీపీ నాయకులు విమర్శలు చేయడం వల్ల అది పార్టీకి ఇబ్బందిగా పరిణమిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. షర్మిల పూర్తిగా తెగించి బరిలోకి దిగిన నేపథ్యంలో ఆమెపై ఎంత తక్కువ విమర్శలు చేస్తే వైసీపీకి అంత మేలు కలుగుతుంది. షర్మిలకు ఽధీటుగా బదులివ్వడం ద్వారా కట్టడి చేయవచ్చని వైసీపీ నేతలు భావిస్తే మాత్రం స్వీయ తప్పిదంగా మారుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం షర్మిల తన అన్న జగన్మోహన్‌రెడ్డిపై కోపంతో రగిలి పోతున్నారు. ఈ తరుణంలో ఆమెపై వైసీపీ నేతలు చేసే విమర్శలు ఆమెను మరింత రెచ్చగొట్టేందుకు కారణమవుతాయి. కాబట్టి, షర్మిల చేసే ఆరోపణలపై ఆచి, తూచి వ్యవహరించడం ద్వారా రాజకీయంగా కొంతైనా వైసీపీకి తగిలే డ్యామేజీకి అడ్డుకట్ట వేయవచ్చని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి ఆ దిశగా వైసీపీ నాయకులు ఆలోచన చేస్తారా..? లేదా.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget