అన్వేషించండి

Why TMC MPs Not Joined BJP: బీజేపీలో చేరలేదు - తృణమూల్‌ను లాక్కోలేదు - బెంగాల్ తిరుగుబాటు ఎంపీల మాస్టర్ ప్లాన్ ఊహించనిదే !

Shiv Sena NCP Vs TMC Legal Case: లోక్‌సభలో తృణమూల్ ఎంపీలు నేరుగా బీజేపీలో చేరకుండా, అసలైన టీఎంసీ అని క్లెయిమ్ చేయకుండా అనామక NCPI పార్టీలో విలీనం అయ్యారు. దీని వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి?

NCPI Merger Strategy Amit Shah: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలు నేరుగా దేశంలోనే అత్యంత బలమైన అధికార పార్టీ అయిన బీజేపీలో చేరకుండా, ఎవరికీ తెలియని ఎన్‌సీపీఐ అనే అనామక పార్టీలో విలీనం కావడం వెనుక భారత రాజ్యాంగం, చట్టాల్లోని లూప్‌హోల్స్‌తో కూడిన ఒక మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ మైండ్ గేమ్ ఉంది. చాలా మందికి  బీజేపీలో ఎందుకు విలీనం కాలేదు? లేదా శివసేన, ఎన్సీపీ తరహాలో ‘మాదే అసలైన టీఎంసీ’ అని ఎందుకు క్లేయిమ్ చేసుకోలేదు? అన్న సందేహాలున్నాయి. 

 నేరుగా బీజేపీలో ఎందుకు చేరలేదు?  

తిరుగుబాటు ఎంపీలు నేరుగా బీజేపీలో చేరిపోతే, పశ్చిమ బెంగాల్ సెంటిమెంట్‌ను మమతా బెనర్జీ  సులభంగా వాడుకోగలరు.  బీజేపీ భయపెట్టి, మా ఎంపీలను కొనేసింది అంటూ బెంగాలీ ప్రజల్లో ఆమె సానుభూతి పొందే అవకాశం ఉంది. అందుకే,  వీరంతా తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయి, బెంగాల్ చిరునామాగా ఉన్న  ఎన్‌సీపీఐ పార్టీని  టేకోవర్  చేసుకున్నారు. కాకోలి ఘోష్ దస్తీదార్ వంటి సీనియర్ తిరుగుబాటు నేత ముందే ఎన్‌సీపీఐ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడం ఇందులో భాగమే. దీనివల్ల మేము బెంగాల్ ప్రయోజనాల కోసమే ప్రత్యేకంగా నిలబడ్డాం అని చెప్పుకోవడానికి, అదే సమయంలో కేంద్రంలోని ఎన్డీయే  కూటమికి మద్దతు ఇవ్వడానికి వీలు పడుతుంది.

 శివసేన, ఎన్సీపీ లాగా  మాదే అసలైన టీఎంసీ  అని ఎందుకు అనలేదు? 

మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే , అజిత్ పవార్  తరహాలో వీరు క్లెయిమ్ చేయకపోవడానికి ప్రధాన కారణం.. సుప్రీంకోర్టు ఇటీవలి తీర్పులు , ఎన్నికల కమిషన్ నిబంధనలు అనుకోవచ్చు.  కేవలం ఎంపీల మెజార్టీ సరిపోదు, శివసేన, ఎన్సీపీ కేసుల్లో కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే కాదు, పార్టీ ప్రాథమిక సభ్యులు, జిల్లా అధ్యక్షులు, క్షేత్రస్థాయి క్యాడర్  కూడా తమ వైపు ఉన్నారని వారు నిరూపించుకోగలిగారు.  టీఎంసీ విషయంలో పశ్చిమ బెంగాల్‌లోని అట్టడుగు క్యాడర్, జిల్లా కమిటీలు, మున్సిపల్ కౌన్సిలర్లు ఇప్పటికీ మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీల గుప్పిట్లోనే ఉన్నారు. కేవలం ఢిల్లీలో ఉన్న 20 మంది ఎంపీలు తిరుగుబాటు చేసినంత మాత్రాన  మాదే అసలైన టీఎంసీ  అంటే ఎన్నికల కమిషన్ ఒప్పుకోదు. పైగా ఆ లీగల్ ఫైట్ తెమలడానికి ఏళ్ల సమయం పడుతుంది. చట్టం ప్రకారం కేవలం ఒక పార్టీకి చెందిన రెండు వంతుల  ప్రజాప్రతినిధులు విడిపోతే సరిపోదు. ఆ విడిపోయిన గ్రూప్ ఖచ్చితంగా మరొక రాజకీయ పార్టీలో విలీనం  కావాలి. అప్పుడే వారిపై అనర్హత వేటు పడదు.
 
 ఎన్‌సీపీఐ ను ఒక షెల్ కంపెనీ లా ఎందుకు వాడుకున్నారు? 

తిరుగుబాటు ఎంపీలకు తమ పదవులు ఊడిపోకుండా ఉండాలంటే తక్షణమే ఒక రిజిస్టర్డ్ రాజకీయ పార్టీ కావాలి. కొత్త పార్టీ పెట్టాలంటే ఎలక్షన్ కమిషన్ చుట్టూ తిరగాలి, దానికి చాలా సమయం పడుతుంది. ఈ లోగా మమతా బెనర్జీ వీరిపై అనర్హత వేటు వేయించే ప్రమాదం ఉంది. అందుకే, 2023లో రిజిస్టర్ అయ్యి, ఎలాంటి ఆస్తులు లేదా క్రియాశీల క్యాడర్ లేని ఎన్‌సీపీఐ ని ఒక చట్టపరమైన రక్షణ కవచం  లా వాడుకున్నారు. ఒక వ్యాపారవేత్త నష్టాల్లో ఉన్న చిన్న కంపెనీని కొనుగోలు చేసి తన వ్యాపారాన్ని విస్తరించుకున్నట్లు.. ఈ 20 మంది ఎంపీలు ఎన్‌సీపీఐ లోకి విలీనమై, రాత్రికి రాత్రే ఆ పార్టీని పార్లమెంట్‌లో 5వ అతిపెద్ద శక్తిగా మార్చేశారు.

 మిత్రపక్షంగా ఉంచితేనే బీజేపీకి లాభం! 

ఈ మొత్తం డ్రామా వెనుక అమిత్ షా మాస్టర్ ప్లాన్ ఉందని ఎక్కువ మంది నమ్మకం. ఈ 20 మంది ఎంపీలను బీజేపీలో చేర్చుకుంటే లోక్‌సభలో బీజేపీ బలం 260 కి పెరుగుతుంది. కానీ, దానికంటే వారిని ఎన్‌సీపీఐ అనే ప్రత్యేక మిత్రపక్షంగా ఉంచడం వల్ల ఎన్డీయే కూటమిలో ఎక్కువ లాభం ఉంది. కూటమిలో చంద్రబాబు , నితీష్ కుమార్ లపైనే పూర్తిగా ఆధారపడకుండా, తమకు విధేయులుగా ఉండే 20 మంది ఎంపీల ఎన్‌సీపీఐ గ్రూప్‌ను ఎన్డీయేలో చేర్చడం ద్వారా బీజేపీ తన బేరసారాల శక్తిని పెంచుకుంది. జైరాం రమేష్ విమర్శించినట్లు.. ఎన్డీయేలో టీడీపీ ప్రాధాన్యతను తగ్గించడానికి ఇదొక వ్యూహాత్మక అడుగు అనుకోవచ్చు. సుప్రీంకోర్టు కోరల్లో చిక్కుకోకుండా, మమతా బెనర్జీకి లీగల్ ఛాన్స్ ఇవ్వకుండా, బెంగాల్ సెంటిమెంట్‌ దెబ్బతినకుండా మరియు కేంద్రంలో బీజేపీకి పూర్తి విధేయులుగా ఉంటూనే సొంత అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎన్‌సీపీఐ విలీనం అనేది అత్యంత వ్యూహాత్మకమైన, లీగల్ సేఫ్ రూట్. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao Milchy Milk Controversy: హరీష్ రావు చుట్టూ ముదురుతున్న పాల రాజకీయం - మిల్చీమిల్క్‌పై సమాధానం చెప్పలేరా?
హరీష్ రావు చుట్టూ ముదురుతున్న పాల రాజకీయం - మిల్చీమిల్క్‌పై సమాధానం చెప్పలేరా?
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
TDP MLAs Dissatisfaction: టీడీపీ ఎమ్మెల్యేల్లో గూడుకట్టుకుపోతున్న అసంతృప్తి - బయటపడుతున్న వారు కొందరే - హైకమాండ్ గుర్తించదా?
టీడీపీ ఎమ్మెల్యేల్లో గూడుకట్టుకుపోతున్న అసంతృప్తి - బయటపడుతున్న వారు కొందరే - హైకమాండ్ గుర్తించదా?
Chandrababu Naidu Strategy Against YSRCP: వైసీపీ ట్రాప్ లో పడొద్దు.. ప్రతి సవాళ్లు చేయొద్దు! టీడీపీ హైకమాండ్ లైన్ వ్యూహమా? చేతకానితనమా?
వైసీపీ ట్రాప్ లో పడొద్దు.. ప్రతి సవాళ్లు చేయొద్దు! టీడీపీ హైకమాండ్ లైన్ వ్యూహమా? చేతకానితనమా?
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Ek Din OTT : ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Fake IAS Officer Wedding Fraud: ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Embed widget