అన్వేషించండి

Telangana Politics: బండి భగీరథ కేసుతో ముగిసిన దోస్తీ ముచ్చట.. తెలంగాణలో ఇక గులాబీ వర్సెస్ కమలం డైరెక్ట్ ఫైట్! బీఆర్ఎస్ తట్టుకుంటుందా?

Bandi Bhagirath Case:తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా సాగుతున్న లోపాయికారీ ఒప్పందాల' ప్రచారానికి భగీరథ్ ఉదంతం పూర్తిగా తెర దించేసింది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య కలవలేని రాజకీయ శత్రుత్వం కనిపిస్తోంది.

BRS vs BJP:  తెలంగాణ రాజకీయ క్షేత్రంలో గత కొంతకాలంగా తెరవెనుక సాగుతున్న పొత్తుల ఊహాగానాలకు, రహస్య అవగాహన ప్రచారాలకు బండి భగీరథ్ పోక్సో కేసు ఉదంతం తెరదించేసింది. వచ్చే ఎన్నికల నాటికి అధికార కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా.. లోపాయికారీగా భారత్ రాష్ట్ర సమితి , భారతీయ జనతా పార్టీ  ల మధ్య ఒక బలమైన కూటమి లేదా అవగాహన ఏర్పడే అవకాశం ఉందనే నమ్మకం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపించింది. దీనికి బలం చేకూరుస్తూ బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్‌లు కేంద్రంలోని బీజేపీ లీడర్‌షిప్‌ను నేరుగా విమర్శించకుండా, కేవలం రాష్ట్ర స్థాయి నేతలపైనే విమర్శల బాణాలు ఎక్కుపెడుతూ వచ్చారు. కానీ, తాజా లీగల్ బ్యాటిల్ ఈ గులాబీ-కమలం సమీకరణాలను పూర్తిగా మార్చేసి, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పక్కాగా త్రిముఖ పోరు జరగబోతోందనే స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది.

సయోధ్యకు తావులేదు - బీఆర్ఎస్ దూకుడు 

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసును, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను బీఆర్ఎస్ లీడర్‌షిప్ రాజకీయంగా అత్యంత దూకుడుగా టేకప్ చేసింది. బండి సంజయ్‌ను కేంద్ర మంత్రిమండలి నుంచి తొలగించాలంటూ కేటీఆర్ స్వయంగా డిమాండ్ చేయడం, క్షేత్రస్థాయిలో గులాబీ కేడర్ నిరసనలకు దిగడం ద్వారా తాము బీజేపీతో ఎలాంటి సయోధ్యకూ సిద్ధంగా లేమని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. అవకాశం దొరికితే చట్టపరమైన అంశాలను అస్త్రాలుగా మార్చుకుని తమను దారుణంగా దెబ్బకొట్టడానికి, రాజకీయంగా అగాధంలోకి నెట్టడానికి బీఆర్ఎస్ కాచుకుని కూర్చుందనే చేదు వాస్తవం ఈ ఉదంతంతో కమలనాథులకు పూర్తిగా అర్థమైంది.

మెత్తటి వైఖరి వీడనున్న బీజేపీ 

ఈ తాజా ఉదంతంతో బీజేపీ అగ్రనాయకత్వం తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పటివరకు బీఆర్ఎస్ పట్ల చూపిస్తూ వచ్చిన   సానుభూతిని ఇకపై కొనసాగించాల్సిన అవసరం లేదనే తుది నిర్ణయానికి ఢిల్లీ పెద్దలు వచ్చినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత ఫుల్ జోష్‌లో ఉన్న బీజేపీ, తన తదుపరి ప్రధాన టార్గెట్‌గా తెలంగాణను ఎంచుకుంది. బెంగాల్ తరహాలోనే ఇక్కడ కూడా దూకుడు రాజకీయాలను ప్రదర్శించాలని భావిస్తున్న తరుణంలో, బీఆర్ఎస్ ఇస్తున్న కౌంటర్లు కమలదళాన్ని మరింత రెచ్చగొట్టేలా మార్చాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో పూర్తిగా నిర్వీర్యం చేయడమే ఏకైక లక్ష్యంగా బీజేపీ తన అసలు గేమ్ ను ప్రారంభించబోతోందని విశ్వసనీయ సమాచారం.

 రాబోయే రోజుల్లో రివర్స్ అటాక్ 

ప్రస్తుతం నడుస్తున్న పోక్సో కేసు  తీవ్రత కాస్త చల్లబడిన తర్వాత.. బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ ప్లాన్ చేస్తున్న రివర్స్ ఎటాక్ అంతకంటే వంద రెట్లు ఎక్కువ దూకుడుగా ఉంటుందని పార్టీ అంతర్గత వర్గాలు విశ్లేషిస్తున్నాయి.   రాబోయే రెండు, మూడు నెలల వ్యవధిలోనే బీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి కేంద్రం తరఫున అసలైన పొలిటికల్ మ్యూజిక్ ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మారిన పరిణామాల వల్ల తెలంగాణ రాజకీయాల్లో ఒకేసారి రెండు సమాంతర యుద్ధాలు జరగబోతున్నాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఓటు బ్యాంకును, కేడర్‌ను ఆకర్షించే ప్రయత్నంలో ఉండగా, మరోవైపు కేంద్రంలోని బీజేపీ తన రాజకీయ ,చట్టపరమైన వ్యూహాలతో గులాబీ దళాన్ని డిఫెన్స్‌లోకి నెట్టేందుకు సిద్ధమవుతోంది.  బీఆర్ఎస్ తన ఉనికిని ఎలా కాపాడుకుంటుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.  

మొత్తం మార్చేసిన బండి భగీరథ కేసు

మొత్తానికి బండి భగీరథ కేసు కేవలం ఒక వ్యక్తిగత చట్టపరమైన వివాదంగా మిగిలిపోకుండా.. తెలంగాణ భవిష్యత్తు పొత్తుల పటాన్ని మార్చేసిన టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఇకపై ఎలాంటి రహస్య అవగాహనలకు తావులేకుండా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒంటరిగానే బరిలోకి దిగడం ఖాయమైంది. ఈ త్రిముఖ పోరులో ఎవరు ఎవరిని దెబ్బతీస్తారు, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కమలం, గులాబీ పార్టీలు ఎలా పంచుకుంటాయి అనే అంశాలపైనే రాబోయే ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. చదరంగం లాంటి తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన పరిణామాలు చోటుచేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

NEET Controversy Political: నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
నీట్ పోరులో పొలిటికల్ ట్విస్ట్ - విద్యార్థుల ఆందోళన బీజేపీ vs కాంగ్రెస్ పోరుగా ఎలా మారింది?
YS Jagan Delhi: జగన్ ఢిల్లీ రాజకీయం - మోదీ, అమిత్ షాలతో సమావేశానికి ప్రయత్నం - రాజకీయంగా మేలేనా !?
జగన్ ఢిల్లీ రాజకీయం - మోదీ, అమిత్ షాలతో సమావేశానికి ప్రయత్నం - రాజకీయంగా మేలేనా !?
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
Advertisement

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget