అన్వేషించండి

వైఎస్‌ఆర్‌ గుమ్మానికి స్టిక్కర్ కార్యక్రమానికి దీటుగా టీడీపీ లెక్కల ప్రచారం

టీడీపీ స్ట్రాటజీ కమిటి సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి స్టిక్కర్ వేయాలని నిర్ణయానికి దీటుగా టీడీపీ ప్రతిగా కౌంటర్ ప్రచారం షురూ చేయబోతోందీ. 

ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఓట్లు చీలిపోకుండా వైఎస్‌ఆర్‌సీపీ గుమ్మానికి స్టిక్కర్ కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. అందులో మా నమ్మకం నువ్వే జగన్ అనే స్లోగన్‌తో ప్రజలను ఆకట్టుకునే వ్యూహంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. అయితే దీనికి కౌంటర్‌గా తెలుగుదేశం ప్రతి వ్యూహాన్ని రెడీ చేసిందని టాక్ నడుస్తోంది. చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన టీడీపీ స్ట్రాటజి కమిటి ఓ నిర్ణయాన్ని తీసుకుందని తెలుస్తోంది. 

రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశగా అమరావతిలో స్ట్రాటజీ కమిటీ మీటింగ్‌ జరిగింది. పార్టీ శ్రేణులను ముందస్తుకు సిద్ధం చేయాలని పార్టీ సీనియర్లు నిర్ణయించారు. వచ్చే ఎన్నికలకు సన్నద్దం అయ్యే క్రమంలో అధికార పార్టీ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలన్నారు. లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామని చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వాలని తెలుగు దేశం భావిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్న లెక్కలతోనే కౌంటర్ అటాక్ చేయాలని వ్యూహం రెడీ చేస్తున్నారు. 

ఇచ్చిన హామీలను అమలు చేయటం, ఇవ్వని హామీలను కూడా అమలు చేశాం కాబట్టి ఓటు అడిగే హక్కు తమకే ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని వివరించటంతోపాటుగా ప్రతి ఇంటికి పార్టీ స్టిక్కర్ అంటించాలని భావిస్తున్నారు. అయితే అదే సమయంలో తెలుగుదేశం నేతలు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ప్రజలపై ఎంత భారం మోపిందనే విషయాలను వివరించాలని భావిస్తున్నారు. దీంతోపాటు అధికారంలో ఉన్న ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని టీడీపీ స్ట్రాటజి కమిటి సమావేశంలో నిర్ణయించారు.

జగన్ ముందస్తు వ్యూహం ....

జగన్ సర్కార్ ముందస్తుకు సిద్ధమవుతోందని తెలుగుదేశం స్ట్రాటజీ కమిటీ అంచనా వేసింది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని భావిస్తోంది. లోకేష్ ఒక వైపు పాదయాత్ర చేస్తుంటే మరోవైపున జనసేన అదినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు రెడీ అవుతున్నారు. దీంతోపాటు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో విభేదాలు బయటపడుతున్నాయి. అదే సమయంలో వివేకా హత్యకేసు వ్యవహరం, రాజధాని వంటి అంశాలు అధికార పార్టీపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అన్నింటికీ మించి ఖజానా నిండుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వీలైనంత వరకు డబ్బులను పంచి పెట్టి ఎప్పుడైనా జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని తెలుగు దేశం పార్టీ భావిస్తుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొవాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, మోసాలు, ప్రజలకు వివరించి తిరిగి తెలుగు దేశం జెండాను ఎగర వేయాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.


35 నియోజకవర్గాలు ఒక జోన్ గా...

ప్రతి 35 నియోజకవర్గాలను జోన్ గా విభజించి, పార్టీ నాయకులు కార్యకర్తలను సమాయత్తం చేయాలని టీడీపీ స్ట్రాటజి కమిటి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. ముందస్తు ఎన్నికలపై పార్టీ క్యాడర్‌ను అలర్ట్ చేసి, అధికర పక్షానికి దీటుగా బదులు ఇచ్చేందుకు ఇంటింటికి వెళ్ళి కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని అధినేత పిలుపు నిచ్చారని అచ్చెం చెప్పారు. లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం భయపడింది కాబట్టే అడుగడుగునా అడ్డంకులను కలిగిస్తున్నారని, పోలీసుల వైఫల్యాలపై పోరాటం చేయాలని ఆయన అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Allari Naresh on Aa okkati Adakku | మళ్లీ కామెడీ సినిమాలు చేయటంపై అల్లరి నరేష్ | ABP DesamDuvvada Srinivas Interview | టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఇంటర్వ్యూ | ABPHyderabad 16Cars Fire Accident | హైదరాబాద్ యూసుఫ్ గూడలో అగ్నికి ఆహుతైపోయిన 16కార్లు | ABP DesamPawan kalyan Touches feet of Pastor | పిఠాపురంలో మహిళా పాస్టర్ కాళ్లు మొక్కిన పవన్ కళ్యాణ్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Pratinidhi 2: ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
ప్రతినిధి 2 విడుదల వాయిదా... రాజకీయ ఒత్తిళ్లు పని కాకుండా చేశాయా?
KCR Bus Yatra :  పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం  సిద్ధం
పూర్వ వైభవమే లక్ష్యం - కేసీఆర్ బస్సు యాత్రకు సర్వం సిద్ధం
Pemmasani Chandra Sekhar: ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
ఈ ఎంపీ అభ్యర్థుల ఆస్తులు రూ.వేల కోట్లు - అఫిడవిట్ లో వెల్లడి, టాప్ ప్లేస్ ఎవరిదంటే?
Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
Embed widget