News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

AP Legislative Council : మండలిలో సంపూర్ణ ఆధిపత్యంపై తప్పిన వైఎస్ఆర్‌సీపీ లెక్క- ప్రతిపక్ష వాయిస్ గట్టిగానే వినిపిస్తుందా ?

ఏపీ శాసనమండలిలో బలబలాలేంటి ?

టీడీపీకి ప్రతిపక్ష హోదా లభించిందా ?

జాతీయ పార్టీల ఉనికి చట్టసభల్లో కనిపించదా ?

FOLLOW US: 
Share:

AP Legislative Council : ఆంధ్రప్రదేశ్   శాసనమండలి స్వరూపం మారనుంది. శాసనమండలిలో అధికార పార్టీ పూర్తి మెజార్టీ సాధించింది.  బీజేపీ ప్రాతినిధ్యం కోల్పోయింది. అలాగే శాసనసభలోనూ ఆ పార్టీకి ప్రాతినిధ్యం కూడా లభించలేదు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో శాసనమండలిలో బలాబలాలు మారనున్నాయి. మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 58గా ఉంది. వీరిలో అధికార వైఎస్ఆర్‌సీపీ సభ్యుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 33 నుంచి గవర్నర్‌ కోటాలో నామినేట్‌ అయిన వారితో కలిపి 45కు చేరుకోనుంది. ప్రతిపక్ష టీడీపీ సభ్యుల సంఖ్య  సంఖ్య 17 నుంచి 10కి తగ్గనుంది. పీడీఎఫ్‌కు ప్రస్తుతం అయిదుగురు సభ్యులుండగా ఇక ఆ సంఖ్య మూడుకు పరిమితం కానుంది.                  

మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయిన బీజేపీ 

బీజేపీ ఉన్న ఒక్క సభ్యుడూ తాజా ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీ మండలిలో ప్రాతినిధ్యం కోల్పోయింది. శాసనమండలిలో ఇప్పటి వరకూ ఆ పార్టీ నేత పీవీఎన్‌ మాధవ్‌ ఎమ్మెల్సీగా ఉన్నారు.ఇటీవల జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో ఎమ్మెల్సీ స్థానం ఒక్కటి కూడా ఆపార్టీకి లేకుండా పోయింది. దీంతో చట్టసభల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రాతినిధ్యం లేదు. ఎమ్మెల్యే కోటాలో 7, స్థానిక సంస్థల కోటాలో 9, పట్టభద్రుల కోటాలో 3, ఉపాధ్యాయుల కోటాలో 2 మొత్తంగా 21 స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో 17 స్థానాలు వైఎస్‌ఆర్‌సీపీ , 4 స్థానాలు టీడీపీ  దక్కించుకున్నాయి. టీడీపీకి చెందిన మొత్తం 11 మంది సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరు అంటే 29న కొందరు, మే నెలాఖరుతో మరికొందరి సభ్యుల పదవీకాలం పూర్తికానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి నలుగురు గెలిచారు.                   

భారీగా తగ్గనునన టీడీపీ బలం 

ఉత్తరాంధ్ర నుంచి వేపాడ చిరంజీవి రావు, తూర్పు రాయలసీమ నుంచి కంచర్ల శ్రీకాంత్‌, పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్‌ స్థానం నుంచి భూమిరెడ్డి రామగోపాల్‌ రెడ్డి, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మహిళా నేత, అధికార ప్రతినిధి పంచుమర్తి అనూరాధ విజయం సాధించడంతో కొత్తగా వీరు శాసనమండలి లో అడుగు పెట్టనున్నారు. అలాగే అధికార వైసీపీకి చెందిన ఏడుగురు సభ్యుల పదవీకాలం ఈ నెలాఖరుతో పూర్తికానుంది. తాజా ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన 17 మంది గెలిచారు. దీంతో పెద్దల సభ లో వైకాపా పూర్తి మెజార్టీ ని సాధించనుంది.అలాగే ప్రస్తుతం ఎన్నికైన నలుగురు సభ్యులతో టీడీపీ 8 మందితో ప్రతిపక్ష హోదా ను నిలబెట్టుకోనుంది.  గ్రాడ్యూయేట్స్ తో పాటు ఎమ్మెల్యే కోటాలో అనూహ్య విజయం సాధించడంతో ఇది సాధ్యమయింది.     

వైసీపీకి పూర్తి మెజార్టీ !  

మండలిలో ప్రస్తుత వివిధ పార్టీల బలాబలాలు ఇలా ఉన్నాయి… ప్రస్తుతం అధికార వైకాపా 45, టీడీపీ -10, పీడీఎఫ్‌- 2, ఇండిపెండెంట్‌ -1 స్థానంలో వున్నారు. అయితే ఈ ఏడాది మే లో ఇద్దరు టీడీపీ సభ్యులు రిటైర్‌ కానున్నారు. అలాగే ఈ జులైలో గవర్నర్‌ కోటాలో భర్తీ కానున్న మరో 2 ఎమ్మెల్సీ స్థానాలతో కలిపి అధికార పార్టీ బలం 47కు చేరనుంది. టీడీపీ కేవలం 8 మంది సభ్యులకు పరిమితం కానుంది. మళ్లీ రెండేళ్ల తర్వాతే మండలికి వివిధ కేటగిరీల కింద ఎన్నికలు జరుగుతాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ పార్టీకి చాలా పరిమితంగా సభ్యులు ఉండేవారు. ఇప్పుడు పూర్తి మెజార్టీ వచ్చింది.                  

Published at : 25 Mar 2023 06:13 AM (IST) Tags: AP Cm Jagan AP Politics ap legislative council

ఇవి కూడా చూడండి

BRS On Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టుపై ఎక్కువగా బాధపడుతున్న బీఆర్ఎస్ - హఠాత్తుగా మార్పు ఎందుకు ?

BRS On Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టుపై ఎక్కువగా బాధపడుతున్న బీఆర్ఎస్ - హఠాత్తుగా మార్పు ఎందుకు ?

Chandrababu Naidu Arrest : బీజేపీకి సమస్యగా చంద్రబాబు అరెస్టు ఇష్యూ - కమలం పార్టీ మద్దతుతోనే జగన్ ఇదంతా చేస్తున్నారా ?

Chandrababu Naidu Arrest :  బీజేపీకి సమస్యగా చంద్రబాబు అరెస్టు ఇష్యూ  -   కమలం పార్టీ మద్దతుతోనే జగన్ ఇదంతా చేస్తున్నారా ?

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా  ?

KTR vs Revanth Reddy: కాంగ్రెస్ 6 గ్యారంటీలు చూసి కేసీఆర్ కు చలి జ్వరం, కేటీఆర్ కి మతి తప్పింది - రేవంత్ రెడ్డి ఫైర్

KTR vs Revanth Reddy: కాంగ్రెస్ 6 గ్యారంటీలు చూసి కేసీఆర్ కు చలి జ్వరం, కేటీఆర్ కి మతి తప్పింది - రేవంత్ రెడ్డి ఫైర్

జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు

జగన్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా!- ప్రజాసమస్యలు వదిలేసి కేసుల చుట్టే టీడీపీ చర్చలు

టాప్ స్టోరీస్

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'

Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?