అన్వేషించండి

Chandrababu: 'ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 33 మంది బలి' - సీఈసీకి చంద్రబాబు లేఖ

Andhrapradesh News: పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యంతో 33 మంది ప్రాణాలు కోల్పోయారని.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

Chandrababu Letter To Election Commission: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పింఛన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 33 మంది చనిపోయారని లేఖలో తెలిపారు. అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తోన్న సీఎస్ పై.. సంబంధిత అధికారులందరిపైనా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పింఛన్ల పంపిణీకి సంబంధించి టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీపై ఫిర్యాదు చేశారు. 

లేఖలో ఏం చెప్పారంటే.?

'ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారులకు పథకాలు అందించాలన్న కేంద్ర ఎన్నికల సంఘ సూచనలను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్ల పంపిణీ గ్రామ సచివాలయాల వద్ద చేపట్టాలని సెర్ప్ సీఈవో ఉత్తర్వులు ఇచ్చారు. దీని వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని.. ఇంటింటికీ పెన్షన్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్ ను కోరినా ఫలితం లేకపోయింది. సచివాలయాల్లో 1,34,694 మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్న దృష్ట్యా వారి ద్వారా పెన్షన్లు ఇంటింటికీ పంపిణీ చెయ్యొచ్చు. రాజకీయ లబ్ధి పొందేందుకు ఎండలో వృద్ధులు పెన్షన్ దారులను సచివాలయాలకు పిలిచారు. సచివాలయాల వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా 60 లక్షల మంది పెన్షన్ దారులు ఎండలో సచివాలయాలకు వెళ్లి ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే 33 మంది ఎండదెబ్బకు మృతి చెందారు. ఇంటింటికీ వెళ్లి పెన్షన్ అందించి ఉంటే ఇలా జరిగేది కాదు. పింఛను దారులకు సకాలంలో నిధులు, సరైన సౌకర్యాలు కల్పించని అధికారులపై చర్యలు తీసుకోవాలి. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన సీఎస్ పైనా చర్యలు చేపట్టాలి. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పింఛన్లు అందించేలా ఆదేశాలు ఇవ్వండి. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించి, 33 మంది మరణానికి కారణమైన అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలి. పెన్షన్ల పంపిణీ విషయంలో టీడీపీపై వైసీపీ చేస్తోన్న దుష్ప్రచారంపైనా చర్యలు తీసుకోండి.' అంటూ చంద్రబాబు లేఖలో కోరారు.

Also Read: Pawan Campaign : కోలుకున్న పవన్ కల్యాణ్ - ఆదివారం నుంచి ఉత్తరాంధ్ర ప్రచారం !

టాప్ హెడ్ లైన్స్

Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Rebel BRA MLAs looking back | ఫిరాయింపు ఎమ్మెల్యేల ‘రివర్స్ గేర్’.. గులాబీ గూటివైపు చూపులు?
Telangana Graduate MLC Elections 2027: పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా పోటీకి యువనేతలు పోటాపోటీ -అన్ని పార్టీలు యువతకే ప్రాధాన్యం ఇవ్వనున్నాయా?
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
SIR Enumeration Uncollectable Votes: తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
చిత్తూరు జిల్లాలో దారుణం- అధికారుల వేధింపులతో ఆశా వర్కర్ ఆత్మహత్య! 
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Embed widget