అన్వేషించండి

Chandrababu: 'ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 33 మంది బలి' - సీఈసీకి చంద్రబాబు లేఖ

Andhrapradesh News: పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వ నిర్లక్ష్యంతో 33 మంది ప్రాణాలు కోల్పోయారని.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

Chandrababu Letter To Election Commission: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. పింఛన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 33 మంది చనిపోయారని లేఖలో తెలిపారు. అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తోన్న సీఎస్ పై.. సంబంధిత అధికారులందరిపైనా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. పింఛన్ల పంపిణీకి సంబంధించి టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీపై ఫిర్యాదు చేశారు. 

లేఖలో ఏం చెప్పారంటే.?

'ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారులకు పథకాలు అందించాలన్న కేంద్ర ఎన్నికల సంఘ సూచనలను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా పెన్షన్ల పంపిణీ గ్రామ సచివాలయాల వద్ద చేపట్టాలని సెర్ప్ సీఈవో ఉత్తర్వులు ఇచ్చారు. దీని వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని.. ఇంటింటికీ పెన్షన్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్ ను కోరినా ఫలితం లేకపోయింది. సచివాలయాల్లో 1,34,694 మంది ఉద్యోగులు అందుబాటులో ఉన్న దృష్ట్యా వారి ద్వారా పెన్షన్లు ఇంటింటికీ పంపిణీ చెయ్యొచ్చు. రాజకీయ లబ్ధి పొందేందుకు ఎండలో వృద్ధులు పెన్షన్ దారులను సచివాలయాలకు పిలిచారు. సచివాలయాల వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా 60 లక్షల మంది పెన్షన్ దారులు ఎండలో సచివాలయాలకు వెళ్లి ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే 33 మంది ఎండదెబ్బకు మృతి చెందారు. ఇంటింటికీ వెళ్లి పెన్షన్ అందించి ఉంటే ఇలా జరిగేది కాదు. పింఛను దారులకు సకాలంలో నిధులు, సరైన సౌకర్యాలు కల్పించని అధికారులపై చర్యలు తీసుకోవాలి. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించిన సీఎస్ పైనా చర్యలు చేపట్టాలి. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పింఛన్లు అందించేలా ఆదేశాలు ఇవ్వండి. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించి, 33 మంది మరణానికి కారణమైన అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలి. పెన్షన్ల పంపిణీ విషయంలో టీడీపీపై వైసీపీ చేస్తోన్న దుష్ప్రచారంపైనా చర్యలు తీసుకోండి.' అంటూ చంద్రబాబు లేఖలో కోరారు.

Also Read: Pawan Campaign : కోలుకున్న పవన్ కల్యాణ్ - ఆదివారం నుంచి ఉత్తరాంధ్ర ప్రచారం !

టాప్ హెడ్ లైన్స్

YSRCP Regional Politics AP: వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
వైసీపీ ప్రాంతీయ రాజకీయం- సజ్జల సీమ పోరాటం, ధర్మాన ఉత్తరాంధ్ర ఉద్యమం - పొలిటికల్ మైలేజ్ ఇస్తుందా?
Nara Lokesh Praises Pawan Kalyan : పొగిడేకొద్దీ పొగడాలనిపించేలా పవన్‌పై నారా లోకేష్ పొగడ్తలు - ఇందులో రాజకీయం ఉందా?
పొగిడేకొద్దీ పొగడాలనిపించేలా పవన్‌పై నారా లోకేష్ పొగడ్తలు - ఇందులో రాజకీయం ఉందా?
Telangana Graduate MLC Elections: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందడి - కాంగ్రెస్, బీజేపీ పోటీ.. బీఆర్ఎస్ వ్యూహమేంటి?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget