అన్వేషించండి

Andhra Pradesh Politics: టీడీపీ క్యాడర్ ఆన్ ఫైర్ - మంత్రి పార్థసారధి అర్థం చేసుకోలేకపోయారా ?

TDP : మంత్రి పార్థసారధిపై టీడీపీ క్యాడర్ ఫైర్ మీద ఉంది. హైకమాండ్‌లో కూడా అదే అసంతృప్తి కనిపిస్తోంది. జోగి రమేష్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనడమే కారణం.

TDP cadre on fire over Minister Parthasaradhi: ఏపీ మంత్రి పార్థసారధి ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఆదివారం రోజు తన నియోజకవర్గంలో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమలో ఆయనతో పాటు జోగి రమేష్ కూడా పాల్గొన్నారు. వీరితో పాటు గౌతు లచ్చన్న మనవరాలు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా పాల్గొన్నారు. ర్యాలీ నిర్వహించారు. సభా వేదిక మీద ఇతర నేతల్ని తక్కువ చేస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని జోగి రమేష్ పొగిడారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి పార్థసారధి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని క్యాడర్ డిమాండ్ చేస్తోంది. 

జోగి రమేష్‌తో వేదిక పంచుకోవడంపై టీడీపీ క్యాడర్ తీవ్ర ఆగ్రహం

నూజివీడులో జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన మనవరాలు గౌరు శిరీష, మంత్రి పార్థసారధి హాజరయ్యారు. అదే కార్యక్రమానికి జోగి రమేష్ వచ్చారు. ఆయనను కూడా నిర్వాహకులు పిలిచారు. అలాగే జిల్లాలో ఇతర గౌడ టీడీపీ నేతలు అయినా కాగిత కృష్ణప్రసాద్ తో పాటు ఇతర సీనియర్ నేతల్ని పిలిచారు. జోగి రమేష్ వస్తున్న కారణంగా వారెవరూ రాలేదు. కానీ వీరు వెళ్లడంతో  టీడీపీ క్యాడర్ ఫైర్ అయింది. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబాన్ని దూషించడమే కాదు.. చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లిన నేతలతో కలిసి పర్యటిస్తారా.. కార్యక్రమంలో పాల్గొంటారా అని టీడీపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడ్డారు. హైకమాండ్ కూడా దీనిపై ఆరా తీసింది.  దంతో  ఇద్దరు నేతలు క్యాడర్ కు క్షమాపణలు చెప్పారు. అది రాజకీయపరంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదని అయినా జోగి రమేష్ తో కలిసి వేదిక పంచుకున్నందుకు క్షమాపణలు చెబుతున్నామన్నారు. మరోసారి అలాంటి తప్పు జరగనివ్వబోమన్నారు. పార్థసారధి పదే పదే వివరణ ఇస్తూ ట్వీట్లు పెట్టారు.  

Also Read: Kakinada Port Ship Seized: రేషన్ బియ్యం అన్‌లోడ్ చేశాకే, షిప్ రిలీజ్ చేయడంపై నిర్ణయం- కాకినాడ కలెక్టర్

ప్రస్తుతం ఉన్న మంత్రి పార్థసారధి వైసీపీలోనే ఉన్నారు. ఆయన ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. అయినప్పటికీ చంద్రబాబు ఆయనకు నూజివీడు టిక్కెట్ ఇచ్చారు. మంత్రి పదవి ఇచ్చారు. ఆయనకు ఇలా ప్రాధాన్యం ఇవ్వడంపై ఎవరూ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే ఆయన వైసీపీలో ఉన్నప్పుడు జోగి రమేష్ తరహాలో నోరు పారేసుకోలేదు. అయితే జోగి రమేష్ ఐదేళ్ల కాలంలో అన్ని హద్దులూ చెరిగిపోయేలా వ్యవహరించారు. లోకేష్,చంద్రబాబు, రఘురామ సహా ఎవర్నీ వదిలి పెట్టలేదు. అత్యంత ఘోరమైన భాష వాడారు. చంద్రబాబు ఇంటిపైకి దాడికి వెళ్లారు. అలాంటి నేతతో కలిసి తిరగడం టీడీపీ క్యాడర్ ను ఆగ్రహానికి గురి చేసింది. కార్యకర్తల మనోభావాల ప్రకారం ..  నారా లోకేష్ కూడా స్పందించారు.   తంలో పలువురు వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు విషయంలో క్యాడర్ అసహనంతో ఉన్నారని వారి నీడి టీడీపీ.. టీడీపీ నేతలపై పడిన క్యాడర్ సహించే పరిస్థితి లేదని నారా లోకేష్ చెప్పినట్లుగా తెలుస్తోంది. అందుకే వారు వెంటనే క్యాడర్ కు సారీ చెప్పారు. కానీ తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం తమ అసంతృప్తిని కొనసాగిస్తూనే ఉన్నారు.  

Also Read:  జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !
 
కొంత మంది  వైసీపీ నేతలకు అత్యంత గడ్డు పరిస్థితి 

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొంత మంది ప్రత్యేకంగా మాటల దాడి చేయడానికి ఓ టీమ్ గా ఉన్నారు. వారందరూ ఇష్టం వచ్చినట్లుగా ప్రతిపక్ష నేతల్ని తిట్టడంతో పాటు దాడులూ చేశారు. చంద్రబాబుఇఇంటిపై దాడి.. టీడీపీ ఆఫీసుపై దాడి వంటి వ్యవహారాల్లో ఉన్న వైసీపీ నేతల నీడ టీడీపీపై పడినా తట్టుకోలేకపోతున్నారు టీడీపీ క్యాడర్. అయితే కాస్త పద్దతిగా ఉన్న వైసీపీ నేతలు టీడీపీలో చేరినా క్యాడర్ రియాక్ట్ కావడం లేదు. జగన్ ఆదేశించారని.. సజ్జల సలహాలు ఇచ్చారని రాజకీయంగా ప్రత్యర్థుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకున్న వారే ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
Special Intensive Revision Voters Telangana: పాతబస్తీలో ఓట్ల గల్లంతు గండం - SIRతో ఓవైసీ ఆందోళన - సగం ఓటర్లు తగ్గిపోతారా?
పాతబస్తీలో ఓట్ల గల్లంతు గండం - SIRతో ఓవైసీ ఆందోళన - సగం ఓటర్లు తగ్గిపోతారా?
Telangana Politics Mind Game: తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ సంచలన ఆరోపణలు
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ ఆరోపణలు
187km రేంజ్‌తో కొత్త Vida VX2 Plus లాంచ్‌ - ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఆన్‌రోడ్ ధర వివరాలు ఇవే!
సింగిల్‌ ఛార్జ్‌తో దాదాపు 190km జర్నీ- భారీ బ్యాటరీతో Vida VX2 Plus లాంచ్‌, తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంత?
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Embed widget