అన్వేషించండి

TDP: జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !

Jogi Ramesh: టీడీపీ కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొనడంపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతు శిరీష, మంత్రి పార్థసారధిలను లోకేష్ వివరణ అడిగారు.

Nara Lokesh expressed anger over Jogi Ramesh participation in TDP program: మంత్రి పార్థసారధి,  ఎమ్మెల్యే గౌతు శిరీషలపై టీడీపీ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్ మండిపడ్డారు. వారు నూజివీడులో నిర్వహించిన సర్దార్  గౌతు లచ్చన్న విగ్రహం ఆవిష్కరణ ర్యాలీలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఆయన పాల్గొనడంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. ఆయన కొంత కాలంగా వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పలు కేసుల్లో ఆయన ఇరుక్కున్నారు. అయితే ఇప్పుడు టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అంటున్నారు. 

ఇలా జోగి రమేష్ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై ఆ పార్టీ క్యాడర్ సీరియస్ గా స్పందించింది. దీనికి కారణం జోగి రమేష్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుఇంటిపై దాడికి వెళ్లారు.  అలాగే టీడీపీ నేతలపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. జోగి రమేష్ తీరు అత్యంత ఘోరంగా ఉండటంతో అప్పట్లో టీడీపీ నేతలు మండిపడేవారు. తాము అధికారంలోకి వస్తే జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీ  చేసేవారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో చేర్చుకుంటున్నారని ఇంకెందుకు.. కొడాలి నాని, వల్లభనేని వంశీలను కూడా చేర్చుకోవాలని సెటైర్లు వేస్తున్నారు. 

టీడీపీ కార్యకర్తల ఆగ్రహం నారా లోకేష్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆసలేం జరిగిందో ఆయన ఆరా తీశారు. నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి అనూహ్యంగా జోగి రమేష్ హాజరయ్యారు. ఆయనను ఎవరు పిలిచారన్నది బయటకు రాలేదు. నూజివీడు నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పార్థసారధి ఉండటం, వైసీపీలో ఉన్నప్పుడు ఉన్న పరిచయాల కారణంగా ఆహ్వానించి ఉంటారని భావిస్తున్నారు. సామాజికవర్గ పరంగా ఆలోచించి పిలిచి ఉంటారని ఈ ఇష్యూ ఇంత వరకూ వస్తుందని అనుకోలేదని ఆయన వర్గీయులు అంటున్నారు.  

Also Read: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు

మరో వైపు జోగి రమేష్ పై కూడా వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆయనను జగన్ మైలవరం ఇంచార్జ్ గా నియమించి చాలా కాలం అయింది. అయితే ఆయన ఇంత వరకూ నియోజకవర్గంలో ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదు. పార్టీ పరమైన కార్యక్రమాలు కూడా నిర్వహించడంలేదని అంటున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలతో కలిసి కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. 

Also Read: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి

టాప్ హెడ్ లైన్స్

Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Allagadda Politics: ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget