అన్వేషించండి

TDP: జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !

Jogi Ramesh: టీడీపీ కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొనడంపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతు శిరీష, మంత్రి పార్థసారధిలను లోకేష్ వివరణ అడిగారు.

Nara Lokesh expressed anger over Jogi Ramesh participation in TDP program: మంత్రి పార్థసారధి,  ఎమ్మెల్యే గౌతు శిరీషలపై టీడీపీ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్ మండిపడ్డారు. వారు నూజివీడులో నిర్వహించిన సర్దార్  గౌతు లచ్చన్న విగ్రహం ఆవిష్కరణ ర్యాలీలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఆయన పాల్గొనడంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. ఆయన కొంత కాలంగా వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పలు కేసుల్లో ఆయన ఇరుక్కున్నారు. అయితే ఇప్పుడు టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అంటున్నారు. 

ఇలా జోగి రమేష్ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై ఆ పార్టీ క్యాడర్ సీరియస్ గా స్పందించింది. దీనికి కారణం జోగి రమేష్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుఇంటిపై దాడికి వెళ్లారు.  అలాగే టీడీపీ నేతలపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. జోగి రమేష్ తీరు అత్యంత ఘోరంగా ఉండటంతో అప్పట్లో టీడీపీ నేతలు మండిపడేవారు. తాము అధికారంలోకి వస్తే జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీ  చేసేవారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో చేర్చుకుంటున్నారని ఇంకెందుకు.. కొడాలి నాని, వల్లభనేని వంశీలను కూడా చేర్చుకోవాలని సెటైర్లు వేస్తున్నారు. 

టీడీపీ కార్యకర్తల ఆగ్రహం నారా లోకేష్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆసలేం జరిగిందో ఆయన ఆరా తీశారు. నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి అనూహ్యంగా జోగి రమేష్ హాజరయ్యారు. ఆయనను ఎవరు పిలిచారన్నది బయటకు రాలేదు. నూజివీడు నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పార్థసారధి ఉండటం, వైసీపీలో ఉన్నప్పుడు ఉన్న పరిచయాల కారణంగా ఆహ్వానించి ఉంటారని భావిస్తున్నారు. సామాజికవర్గ పరంగా ఆలోచించి పిలిచి ఉంటారని ఈ ఇష్యూ ఇంత వరకూ వస్తుందని అనుకోలేదని ఆయన వర్గీయులు అంటున్నారు.  

Also Read: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు

మరో వైపు జోగి రమేష్ పై కూడా వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆయనను జగన్ మైలవరం ఇంచార్జ్ గా నియమించి చాలా కాలం అయింది. అయితే ఆయన ఇంత వరకూ నియోజకవర్గంలో ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదు. పార్టీ పరమైన కార్యక్రమాలు కూడా నిర్వహించడంలేదని అంటున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలతో కలిసి కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. 

Also Read: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pak National Arrest: హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
Tirupati Crime News: తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
Pahalgam Attack Effect: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
Pahalgam Terror Attack: పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

CSK Comparison With RCB Wins | IPL 2025 లో గతేడాది RCB మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయిన CSKKavya Maraan Expression vs CSK IPL 2025 | హావభావాలతో మ్యాచ్ టెన్షన్ మొత్తం చూపించిన కావ్యామారన్CSK Failures in IPL 2025 | MS Dhoni కెప్టెన్ అయినా రాతను మార్చుకోలేకపోయిన CSKCSK vs SRH Match Highlights IPL 2025  | చెన్నై పై గెలిచి ఆశలు మిగుల్చుకున్న సన్ రైజర్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pak National Arrest: హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
హైదరాబాద్‌లో పాకిస్తాన్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అసలేం జరిగిందంటే
Tirupati Crime News: తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
తిరుపతిలో ఏనుగుల బీభత్సం, పొలంలో రైతును తొక్కి చంపిన గజరాజులు
Pahalgam Attack Effect: ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులకు రాష్ట్ర డీజీపీ డెడ్‌లైన్, వారికి 29 వరకు ఛాన్స్
Pahalgam Terror Attack: పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
పీవోకేను లాక్కొండి, మీకు అండగా ఉంటాం: మోదీకి రేవంత్ రెడ్డి సూచన
IPL 2025 SRH VS CSK Result Update: చెన్నైకి చెక్.. చేపాక్ లో తొలి విక్టరీ సాధించిన సన్ రైజర్స్, రాణించిన కిషన్, హర్షల్, సీఎస్కే కి 7వ ఓటమి
చేపాక్ కోట బద్దలు.. చెన్నైకి చెక్.. చేపాక్ లో తొలి విక్టరీ సాధించిన సన్ రైజర్స్, రాణించిన కిషన్, హర్షల్, సీఎస్కే కి 7వ ఓటమి
Andhra Pradesh: ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
ఏపీలో మత్స్యకారులకు గుడ్ న్యూస్- శనివారం ఖాతాల్లో 20 వేలు వేయనున్న ప్రభుత్వం
Pahalgam Terror Attack : తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
తెలంగాణలో ఉన్న పాక్‌ పౌరులకు డీజీపీ ఫైనల్ వార్నింగ్
Vidadala Rajini: మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
మాజీ మంత్రి విడదల రజనీకి ఊరట - ఇక అరెస్టు లేనట్లే
Embed widget