అన్వేషించండి

TDP: జోగి రమేష్ నీడ టీడీపీపై ఎందుకు పడింది ? - గౌతు శిరీష, మంత్రి పార్ధసారధిపై లోకేష్ ఫైర్ !

Jogi Ramesh: టీడీపీ కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొనడంపై నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతు శిరీష, మంత్రి పార్థసారధిలను లోకేష్ వివరణ అడిగారు.

Nara Lokesh expressed anger over Jogi Ramesh participation in TDP program: మంత్రి పార్థసారధి,  ఎమ్మెల్యే గౌతు శిరీషలపై టీడీపీ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్ మండిపడ్డారు. వారు నూజివీడులో నిర్వహించిన సర్దార్  గౌతు లచ్చన్న విగ్రహం ఆవిష్కరణ ర్యాలీలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు. ఆయన పాల్గొనడంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగింది. ఆయన కొంత కాలంగా వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పలు కేసుల్లో ఆయన ఇరుక్కున్నారు. అయితే ఇప్పుడు టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అందుకే టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అంటున్నారు. 

ఇలా జోగి రమేష్ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై ఆ పార్టీ క్యాడర్ సీరియస్ గా స్పందించింది. దీనికి కారణం జోగి రమేష్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుఇంటిపై దాడికి వెళ్లారు.  అలాగే టీడీపీ నేతలపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. జోగి రమేష్ తీరు అత్యంత ఘోరంగా ఉండటంతో అప్పట్లో టీడీపీ నేతలు మండిపడేవారు. తాము అధికారంలోకి వస్తే జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీ  చేసేవారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో చేర్చుకుంటున్నారని ఇంకెందుకు.. కొడాలి నాని, వల్లభనేని వంశీలను కూడా చేర్చుకోవాలని సెటైర్లు వేస్తున్నారు. 

టీడీపీ కార్యకర్తల ఆగ్రహం నారా లోకేష్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆసలేం జరిగిందో ఆయన ఆరా తీశారు. నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇది టీడీపీ నేతల ఆధ్వర్యంలోనే జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి అనూహ్యంగా జోగి రమేష్ హాజరయ్యారు. ఆయనను ఎవరు పిలిచారన్నది బయటకు రాలేదు. నూజివీడు నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా పార్థసారధి ఉండటం, వైసీపీలో ఉన్నప్పుడు ఉన్న పరిచయాల కారణంగా ఆహ్వానించి ఉంటారని భావిస్తున్నారు. సామాజికవర్గ పరంగా ఆలోచించి పిలిచి ఉంటారని ఈ ఇష్యూ ఇంత వరకూ వస్తుందని అనుకోలేదని ఆయన వర్గీయులు అంటున్నారు.  

Also Read: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు

మరో వైపు జోగి రమేష్ పై కూడా వైఎస్ఆర్‌సీపీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆయనను జగన్ మైలవరం ఇంచార్జ్ గా నియమించి చాలా కాలం అయింది. అయితే ఆయన ఇంత వరకూ నియోజకవర్గంలో ఒక్క కార్యక్రమం కూడా నిర్వహించలేదు. పార్టీ పరమైన కార్యక్రమాలు కూడా నిర్వహించడంలేదని అంటున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలతో కలిసి కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. 

Also Read: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి షాక్! వాహనాల కొనుగోలుదారులపై 10 శాతం రోడ్‌ సెస్‌
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి షాక్! వాహనాల కొనుగోలుదారులపై 10 శాతం రోడ్‌ సెస్‌
Hyderabad Crime News: భర్త కోసం దొంగగా మారిన సాఫ్ట్‌వేర్ భార్య! రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!
భర్త కోసం దొంగగా మారిన సాఫ్ట్‌వేర్ భార్య! రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!
Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 

వీడియోలు

Anil Ravipudi on Social Media Trolls | మీమర్స్ ట్రోల్స్ వేసుకుంటే వేసుకోండి..నేను ఎంజాయ్ చేస్తా |ABP
Rohit Sharma Records Ind vs NZ ODI | క్రిస్ గేల్ రికార్డును అధిగమించిన హిట్‌మ్యాన్
RCB vs UP WPL 2026 | ఆర్సీబీ సూపర్ విక్టరీ
Washington Sundar Ruled Out | గాయంతో బాధ‌ప‌డుతున్న వాషింగ్ట‌న్ సుంద‌ర్
Devdutt Padikkal record in Vijay Hazare Trophy | దేవదత్ పడిక్కల్ అరుదైన రికార్డు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి షాక్! వాహనాల కొనుగోలుదారులపై 10 శాతం రోడ్‌ సెస్‌
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి షాక్! వాహనాల కొనుగోలుదారులపై 10 శాతం రోడ్‌ సెస్‌
Hyderabad Crime News: భర్త కోసం దొంగగా మారిన సాఫ్ట్‌వేర్ భార్య! రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!
భర్త కోసం దొంగగా మారిన సాఫ్ట్‌వేర్ భార్య! రీజన్ తెలిస్తే షాక్ అవుతారు!
Modi congratulates Pawan Kalyan: కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
కెంజుట్సు ఘనతకు ప్రధాని మోదీ ఫిదా - పవన్ కల్యాణ్‌కు అభినందన సందేశం
YSRCP Latest News:
"ఇరుసుమండ బ్లో అవుట్ వెనుక కుట్ర- కోట్లు చేతులు మారాయి" వైసీపీ సంచలన ఆరోపణలు 
Bhogi Mantalu 2026: ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ఆరోగ్యానికి, పర్యావరణానికి ముప్పు తెచ్చే భోగి మంటలు వద్దు, ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Digital Arrest Scams: డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
డిజిటల్ అరెస్ట్ మోసాలపై ఉక్కుపాదానికి కేంద్రం ప్రయత్నాలు - మల్టీఏజెన్సీ ప్యానెల్‌ నియామకం
Nara Vari Palle Sankranti: ముఖ్యమంత్రి కుటుంబం అంతా నారా వారి పల్లెలోనే - హుషారుగా సంక్రాంతి సంబరాలు !
ముఖ్యమంత్రి కుటుంబం అంతా నారా వారి పల్లెలోనే - హుషారుగా సంక్రాంతి సంబరాలు !
Adilabad Latest News: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 16న పర్యటించనున్న ముఖ్యమంత్రి! సదర్మాట్ బ్యారేజి, చనాక-కోరాట ప్రాజెక్టు  ప్రారంభోత్సవం!
Embed widget