అన్వేషించండి

Kakinada Port Ship Seized: రేషన్ బియ్యం అన్‌లోడ్ చేశాకే, షిప్ రిలీజ్ చేయడంపై నిర్ణయం- కాకినాడ కలెక్టర్

Andhra Pradesh News | కాకినాడ పోర్టులో కొన్ని రోజుల కిందట పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. అయితే విదేశీ నౌక స్టెల్లా షిప్ ను సీజ్ చేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాకినాడ కలెక్టర్ తెలిపారు.

PDS Rice found in Stella Ship at Kakinada port | కాకినాడ: కాకినాడ పోర్టులో పీడీఎస్ బియ్యం లోడింగ్ చేసినట్లు గుర్తించిన స్లెల్లా నౌకను సీజ్ చేశారా లేదా అనేది మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. మొదట కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌ మోహన్‌ షిప్‌ను సీజ్ చేశారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనంతరం కాకినాడ పోర్టుకు వెళ్లి పరిశీలించారు. ఆ సమయంలో అధికారులు మొదట పవన్ కళ్యాణ్ ను షిప్ లోకి వెళ్లేందుకు అనుమతించలేదు. చివరకు పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం ఉన్న విదేశీ నౌక స్టెల్లాను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. సీజ్ ద షిప్ అని పవన్ చెప్పిన మాట దేశవ్యప్తంగా ట్రెండింగ్ అయింది. కానీ స్టెల్లా షిప్‌ను ఎవరూ సీజ్ చేయలేదు అనేది వాస్తవం. ఆ వివరాలిలా ఉన్నాయి..

640 టన్నులు కాదు అంతకుమించి రేషన్ బియ్యం గుర్తింపు

కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున రేషన్‌ బియ్యం విదేశాలకు అక్రమ రవాణాపై కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. తాను పరిశీలించిన తరువాత నవంబరు 29న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ విదేశీ నౌక స్టెల్లా ఎల్ పనామా షిప్‌ను పరిశీలించారు. ఏపీ ప్రభుత్వం దీనిపై చర్యలు చేపట్టింది. యాంకరేజ్ పోర్టులో భారీ ఎత్తున పీడీఎస్ బియ్యంతో దొరికిన స్టెల్లా షిప్‌లో ఉన్న బియ్యంపై ఐదు విభాగాల అధికారులను బృందంగా ఏర్పాటు చేశారు. అధికారులు దాదాపు 12 గంటల పాటు స్టెల్లా ఓడలోని 5 కంపార్ట్‌మెంట్లలో తనిఖీలు నిర్వహించి 12 వరకు శాంపిల్స్‌ సేకరించారు. స్టెల్లా షిప్‌లో దాదాపు 4వేల టన్నుల బియ్యం ఉండగా, అందులో 1,320 టన్నుల పీడీఎస్‌ బియ్యం (PDS Rice) ఉన్నట్టు టీమ్ నిర్ధరించింది. 640 టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయని మొదట అనుకున్నాం, కానీ తనిఖీల అనంతరం దానికి రెట్టింపు రేషన్ బియ్యం ఉందని గుర్తించినట్లు చెప్పారు.

బియ్యం అన్‌లోడ్ చేశాకే షిప్ పై నిర్ణయం

కాకినాడ పోర్టులో ప్రస్తుతం లోడ్‌ చేయాల్సిన బియ్యం 12 వేల టన్నుల వరకు ఉంది. స్టెల్లా ఓడలో గుర్తించిన 1,320 టన్నుల రేషన్ బియ్యాన్ని వెంటనే అన్‌లోడ్‌ చేయించి అనంతరం సీజ్‌ చేస్తాం. రేషన్ బియ్యం అన్ లోడ్ చేసిన తరువాతే షిప్ సీజ్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ ఓడ ద్వారా సత్యం బాలాజీ రైస్‌ ఇండస్ట్రీస్‌ బియ్యం ఎగుమతి చేస్తోందని దర్యాప్తులో తేలినట్లు కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. అయితే ఆ రైస్ ఇండస్ట్రీస్ వారు ఇంత పెద్ద ఎత్తున బియ్యం ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ నిల్వ చేశారు తదితర అంశాలపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. పీడీఎస్ బియ్యం లేదు అని అధికారులు నిర్ధారించిన తరువాతే లోడింగ్ అనుమతిస్తాం. డీప్‌సీ వాటర్‌ పోర్టు, యాంకేజ్‌ పోర్టులో మరో చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తామన్నారు.

పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం ఒక్క గ్రాము కూడా రాష్ట్రం దాటకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నిజాయితీగా బియ్యం వ్యాపారం చేసే వారికి ఏ ఇబ్బంది ఉండదని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ.. రేషన్‌ బియ్యం అంశంపై 13 సంస్థలపై కేసులు నమోదు చేశామన్నారు. గోదావరి జిల్లాల్లో తనిఖీలు చేపట్టగా 89 మిల్లుల నుంచి రేషన్‌ బియ్యం సరఫరా అయినట్లు పేర్కొన్నారు. 

Also Read: Andhra News: రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిట్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Embed widget