అన్వేషించండి

Revanth Reddy: నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?

Telangana CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న రాజకీయ శైలిలో వస్తున్న మార్పులను స్వయంగా విశ్లేషించుకుంటున్నారు. ఆవేశం తగ్గించుకుని ఆలోచనతో రాజకీయాలు చేస్తానని అంటున్నారు.

Revanth Reddy  New Strategy:  తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి అంటేనే  గళం, బలం. ప్రతిపక్ష నేతగా ఆయన చేసిన ప్రసంగాలు ఎంత ఆవేశంగా ఉండేవో అందరికీ తెలిసిందే. సీఎం అయిన తర్వాత కూడా కేసీఆర్, కేటీఆర్ మాటలకు అంతే ఘాటుగా బదులిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన మాటల్లో మార్పు కనిపిస్తోంది.  రాజకీయ ఉపన్యాసాల్లో ఆవేశంగా ఉండే నా పనితీరు, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక మారింది" అని ఆయన చేసిన వ్యాఖ్యలు  మార్పు ను సూచిస్తున్నాయి.  పీసీసీ బాధ్యత వేరు, రాష్ట్రాన్ని పాలించే బాధ్యత వేరని.. పదవి ఇచ్చే హుందాతనం తన శైలిని మార్చుకునేలా చేసిందని ఆయన పరోక్షంగా అంగీకరించారు.

హుందా అయిన రాజకీయాలకే ప్రాధాన్యం 

 మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై జరిగిన పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా రేవంత్ రెడ్డి తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు.  రాష్ట్ర ప్రయోజనాల రీత్యా నా పనితీరులో మార్పులు చేసుకున్నాను  అని చెప్పడం ద్వారా, వ్యక్తిగత రాజకీయాల కంటే అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, హైదరాబాద్ భవిష్యత్తుకు ఒక  గ్రోత్ ఇంజిన్  అని భావిస్తున్న రేవంత్, తనలో ఏదో చేసి చూపించాలన్న తపనను బహిరంగంగానే చాటుకున్నారు.  ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టును లూటిఫికేషన్  అని విమర్శిస్తుంటే, రేవంత్ రెడ్డి మాత్రం ఆవేశపడకుండా అంతే హుందాగా సమాధానమిచ్చారు.  రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరైనా నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను  అని ప్రకటించడం ఆయన నాయకత్వ లక్షణాల్లోని మార్పును సూచిస్తోంది. 

మాటతీరుపై ఆత్మవిమర్శ 

 గతంలో కేసీఆర్, కేటీఆర్ వంటి రాజకీయ ప్రత్యర్థులపై ఆయన వాడిన ఘాటు భాష పలుమార్లు వివాదాస్పదమైంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అంతటి కఠిన పదజాలం వాడటం సమంజసం కాదన్న విమర్శలు మేధావుల నుంచి, రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమయ్యాయి. ఈ  కారణంగా ఆవేశం కంటే బాధ్యత ముఖ్యం అని గుర్తించిన రేవంత్, తన భాషకు స్వస్తి పలికి అభివృద్ధి మంత్రం పఠించాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.రాజకీయాల్లో ప్రతిచర్య అనేది సహజం. రేవంత్ రెడ్డి గతంలో ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడినప్పుడు, బీఆర్ఎస్ నేతలు కూడా అంతకు మించి అన్నట్లుగా ప్రతిదాడి చేసేవారు. ఈ పరస్పర దూషణల వల్ల అసలు ప్రజా సమస్యలు పక్కకు వెళ్లి, వ్యక్తిగత విమర్శలే హైలైట్ అయ్యేవి. ఇప్పుడు రేవంత్ తన భాషను మార్చుకోవడం ద్వారా, బీఆర్ఎస్ నేతలకు ఆ అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. తను మౌనంగా ఉండి పని చేసి చూపిస్తే, ప్రతిపక్షాలు చేసే విమర్శలు అర్థరహితంగా మారుతాయని ఆయన వ్యూహంగా ఉంది.

 నిర్మాణాత్మక రాజకీయాలకు ఆహ్వానం 

మూసీ పునరుజ్జీవనం వంటి భారీ ప్రాజెక్టుల విషయంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు ఆసక్తికరంగా ఉంది. కేవలం పట్టుదలకు పోకుండా,  రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరైనా నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తే తీసుకుంటాను అని ప్రకటించడం ద్వారా అందరినీ కలుపుకుని పోయే దిశగా అడుగులు వేస్తున్నారు. ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైన ముఖ్యమంత్రి పదవికి ఉండాల్సిన హుందాతనాన్ని కాపాడుతూనే, వివాదాలకు దూరంగా ఉండి ఫలితాలు సాధించాలన్న తపన ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవి అనేది వ్యక్తిగత హోదా కాదు, అది ఒక బాధ్యత అని రేవంత్ భావిస్తున్నారు. మూసీ ప్రక్షాళన వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే కేవలం రాజకీయాలు సరిపోవని, అందరి మద్దతు అవసరమని ఆయన గుర్తించారు. 
 
రేవంత్ రెడ్డిలో కనిపిస్తున్న ఈ సానుకూల మార్పు తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని చల్లబరిచే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి తన భాషను నియంత్రించుకోవడం వల్ల, రాష్ట్రంలో ఆరోగ్యకరమైన రాజకీయ చర్చలకు దారితీస్తుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి ఇదే శైలిని కొనసాగిస్తే, ప్రత్యర్థులు కూడా విమర్శల స్థాయిని తగ్గించక తప్పదు. ఇది అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాలకే మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?
నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Embed widget