అన్వేషించండి

Revanth Reddy: నాడు ఆవేశం.. నేడు ఆలోచన - రేవంత్ రెడ్డి ఘాటు భాష లేని హై క్వాలిటీ రాజకీయం చేయబోతున్నారా?

Telangana CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న రాజకీయ శైలిలో వస్తున్న మార్పులను స్వయంగా విశ్లేషించుకుంటున్నారు. ఆవేశం తగ్గించుకుని ఆలోచనతో రాజకీయాలు చేస్తానని అంటున్నారు.

Revanth Reddy  New Strategy:  తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి అంటేనే  గళం, బలం. ప్రతిపక్ష నేతగా ఆయన చేసిన ప్రసంగాలు ఎంత ఆవేశంగా ఉండేవో అందరికీ తెలిసిందే. సీఎం అయిన తర్వాత కూడా కేసీఆర్, కేటీఆర్ మాటలకు అంతే ఘాటుగా బదులిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన మాటల్లో మార్పు కనిపిస్తోంది.  రాజకీయ ఉపన్యాసాల్లో ఆవేశంగా ఉండే నా పనితీరు, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాక మారింది" అని ఆయన చేసిన వ్యాఖ్యలు  మార్పు ను సూచిస్తున్నాయి.  పీసీసీ బాధ్యత వేరు, రాష్ట్రాన్ని పాలించే బాధ్యత వేరని.. పదవి ఇచ్చే హుందాతనం తన శైలిని మార్చుకునేలా చేసిందని ఆయన పరోక్షంగా అంగీకరించారు.

హుందా అయిన రాజకీయాలకే ప్రాధాన్యం 

 మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై జరిగిన పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా రేవంత్ రెడ్డి తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు.  రాష్ట్ర ప్రయోజనాల రీత్యా నా పనితీరులో మార్పులు చేసుకున్నాను  అని చెప్పడం ద్వారా, వ్యక్తిగత రాజకీయాల కంటే అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు, హైదరాబాద్ భవిష్యత్తుకు ఒక  గ్రోత్ ఇంజిన్  అని భావిస్తున్న రేవంత్, తనలో ఏదో చేసి చూపించాలన్న తపనను బహిరంగంగానే చాటుకున్నారు.  ప్రతిపక్షాలు ఈ ప్రాజెక్టును లూటిఫికేషన్  అని విమర్శిస్తుంటే, రేవంత్ రెడ్డి మాత్రం ఆవేశపడకుండా అంతే హుందాగా సమాధానమిచ్చారు.  రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరైనా నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తే స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను  అని ప్రకటించడం ఆయన నాయకత్వ లక్షణాల్లోని మార్పును సూచిస్తోంది. 

మాటతీరుపై ఆత్మవిమర్శ 

 గతంలో కేసీఆర్, కేటీఆర్ వంటి రాజకీయ ప్రత్యర్థులపై ఆయన వాడిన ఘాటు భాష పలుమార్లు వివాదాస్పదమైంది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అంతటి కఠిన పదజాలం వాడటం సమంజసం కాదన్న విమర్శలు మేధావుల నుంచి, రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమయ్యాయి. ఈ  కారణంగా ఆవేశం కంటే బాధ్యత ముఖ్యం అని గుర్తించిన రేవంత్, తన భాషకు స్వస్తి పలికి అభివృద్ధి మంత్రం పఠించాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.రాజకీయాల్లో ప్రతిచర్య అనేది సహజం. రేవంత్ రెడ్డి గతంలో ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడినప్పుడు, బీఆర్ఎస్ నేతలు కూడా అంతకు మించి అన్నట్లుగా ప్రతిదాడి చేసేవారు. ఈ పరస్పర దూషణల వల్ల అసలు ప్రజా సమస్యలు పక్కకు వెళ్లి, వ్యక్తిగత విమర్శలే హైలైట్ అయ్యేవి. ఇప్పుడు రేవంత్ తన భాషను మార్చుకోవడం ద్వారా, బీఆర్ఎస్ నేతలకు ఆ అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. తను మౌనంగా ఉండి పని చేసి చూపిస్తే, ప్రతిపక్షాలు చేసే విమర్శలు అర్థరహితంగా మారుతాయని ఆయన వ్యూహంగా ఉంది.

 నిర్మాణాత్మక రాజకీయాలకు ఆహ్వానం 

మూసీ పునరుజ్జీవనం వంటి భారీ ప్రాజెక్టుల విషయంలో రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు ఆసక్తికరంగా ఉంది. కేవలం పట్టుదలకు పోకుండా,  రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరైనా నిర్మాణాత్మకమైన సూచనలు ఇస్తే తీసుకుంటాను అని ప్రకటించడం ద్వారా అందరినీ కలుపుకుని పోయే దిశగా అడుగులు వేస్తున్నారు. ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైన ముఖ్యమంత్రి పదవికి ఉండాల్సిన హుందాతనాన్ని కాపాడుతూనే, వివాదాలకు దూరంగా ఉండి ఫలితాలు సాధించాలన్న తపన ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి పదవి అనేది వ్యక్తిగత హోదా కాదు, అది ఒక బాధ్యత అని రేవంత్ భావిస్తున్నారు. మూసీ ప్రక్షాళన వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పూర్తి చేయాలంటే కేవలం రాజకీయాలు సరిపోవని, అందరి మద్దతు అవసరమని ఆయన గుర్తించారు. 
 
రేవంత్ రెడ్డిలో కనిపిస్తున్న ఈ సానుకూల మార్పు తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని చల్లబరిచే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి తన భాషను నియంత్రించుకోవడం వల్ల, రాష్ట్రంలో ఆరోగ్యకరమైన రాజకీయ చర్చలకు దారితీస్తుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి ఇదే శైలిని కొనసాగిస్తే, ప్రత్యర్థులు కూడా విమర్శల స్థాయిని తగ్గించక తప్పదు. ఇది అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాలకే మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kerala BJP: కేరళలో బీజేపీ ఆశలు - కింగ్ మేకర్ అయ్యేనా?
కేరళలో బీజేపీ ఆశలు - కింగ్ మేకర్ అయ్యేనా?
Revanth Reddy Soft Hindutva: కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
JanaSena MLA Problems: దారి తప్పుతున్న ఎమ్మెల్యేలతో జనసేనానికి చిక్కులు - కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందేనా?
దారి తప్పుతున్న ఎమ్మెల్యేలతో జనసేనానికి చిక్కులు - కఠిన చర్యలకు సిద్ధం కావాల్సిందేనా?
Opinion Poll 2026: పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేది ఎవరు? తమిళనాడులో విజయ్‌ ఎఫెక్ట్‌ ఎంత? సంచలనంగా మారుతున్న లేటెస్ట్ సర్వే!
పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేది ఎవరు? తమిళనాడులో విజయ్‌ ఎఫెక్ట్‌ ఎంత? సంచలనంగా మారుతున్న లేటెస్ట్ సర్వే!
Advertisement

వీడియోలు

Bumrah vs Vaibhav Suryavanshi IPL 2026 | బుమ్రా యార్కర్ల ముందు వైభవ్ నిలబడగలడా?
Ashwin about CSK’s Failure IPL 2026 | సీఎస్కే వైఫల్యంపై అశ్విన్ కామెంట్స్
Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sayali Surve: సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు
సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు
Revanth Reddy Soft Hindutva: కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
Monsoon in India 2026: ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
First Night Crime: హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
Embed widget