అన్వేషించండి

Telangana Investment Politics : రేవంత్ ప్రభుత్వంపై సోషల్ మీడియా ఎటాక్ - బీఆర్ఎస్‌ సైన్యానికి కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వలేకపోతోందా ?

Telangana : బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంతో రేవంత్ సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆ ప్రచార ధాటిని తట్టుకోలేక అమెరికా నుంచి అధికారులు కూడా వివరణ వీడియోలు రిలీజ్ చేయాల్సి వస్తోంది.

Telangana Politics :  రాజకీయాల్లో ఇప్పుడు ప్రతిపక్షమంటే రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన పని లేదు. ఆ పని చేయాల్సినప్పుడు చేయవచ్చు..కానీ రోజూ సోషల్  మీడియా ద్వారా ప్రభుత్వంపై విరుచుకుపడవచ్చు. ఈ విషయలో భారత రాష్ట్ర సమితికి ఉన్న  నిర్మాణాత్మక సోషల్  మీడియా సైన్యం ప్రభుత్వంపై ఓ రకమైన యుద్ధం చేస్తోంది. సోషల్ మీడియా సైన్యానికి రూల్స్ ఏమీ ఉండవు. ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు పెంచడానికి ఎలాంటి వార్త ఉపయోగపడుతుందో.. అలాంటి దాన్ని తెరపైకి తెచ్చి ప్రచారం చేయడమే. ప్రభుత్వం సీరియస్ అయి కేసులు పెడితే అదో అడ్వాంటేజ్ కానీ.. మైనస్‌గా భావించడం లేదు. పలితంగా ప్రభుత్వంపై ఎటాక్ అంతకంతకూ పెరిగిపోతోంది. దీనికి కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా బలం సరిపోవడం లేదు. ఆ విషయం స్పష్టంగానే కనిపిస్తోంది. 

రేవంత్ అమెరికా పర్యటనపై ఉద్దృతంగా వ్యతిరేక ప్రచారం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లారు. అధికార, మంత్రుల  బృందంతో ఆయన వెళ్లారు. పెట్టుబడుల ఆకర్షణలో గత పదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత క్రియాశీలకంగా పని చేసిన అధికారి జయేష్ రంజన్. కేటీఆర్ ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్లినా ఆయనే పక్కన ఉంటారు. మొత్తం పెట్టుబడుల వ్యవహారాలు, ఎంవోయూలు..చర్చలు ఆయన పర్యవేక్షణలో జరుగుతాయని అధికారులు అందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయనకు ప్రాధాన్యం తగ్గలేదు. బీఆర్ఎస్ హయాంలో ఎంత ప్రాధాన్యం ఉందో.. కాంగ్రెస్ హయాంలోనూ అంత కంటే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. తాజాగా రేవంత్ పర్యటనను కూడా ఆయనే సమన్వయ పరుస్తున్నారు. పెట్టుబడుల ప్రతిపాదనలు, ఎంవోయూలను ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే స్వచ్చబయో అనే ఓ కంపెనీతో చేసుకున్న ఎంవోయూ వివాదాస్పదమయింది. ఆ కంపెనీ ఇటీవలే ప్రారంభించారని  దానికి రేవంత్ సోదరుడు యజమానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా బయట  పెట్టి అసలు రేవంత్ సర్కార్ చేసుకుంటున్న ఒప్పందాలన్నీ ఫేక్ అని ప్రచారం ఉద్దృతంగా చేసింది. దీంతో  జయేష్ రంజన్ స్వయంగా వివరణ ఇస్తూ వీడియో విడుదల చేయాల్సి వచ్చింది. 

నిప్పు లేకుండా పొగ రాదు - బీజేపీ, బీఆర్ఎస్ మధ్య విలీన చర్చలు నిజమేనా ?

క్రమంగా  పెరుగుతున్న వ్యతిరేక ప్రచారం

కేటీఆర్ తమ పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని అత్యంత పటిష్టంగా నిర్మించుకన్నారు. వ్యవస్థీకృతమైన సోషల్ మీడియా విభాగాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉంచుకున్నారు. పార్టీ కోసం విస్తృతంగా సోషల్ మీడియాలో  పని చేసే వారు హైదరాబాద్  లో మాత్రమే కాదు.. ప్రపంచంలో అనేక దేశాల్లో ఉంటారు. వీరందర్నీ కోఆర్డినేట్ చేసే వ్యవస్థను కూడా పకడ్బందీగా నియమించుకున్నారు. అందుకే ఓ అంశాన్ని ట్రెండ్ చేయాలంటే.. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇట్టే చేసేస్తుంది. సోషల్ మీడియా ప్రభావం తెలుసు కాబట్టి.. కేటీఆర్ ఓడపోయిన తర్వాత కూడా సోషల్ మీడియా బలహీనపడకుండా చూసుకుంటున్నారు. దానికి ఇప్పుడు ప్రతిపలం కనిపిస్తోంది . కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చికాకు పెట్టడంలో సోషల్ మీడియా విభాగమే కీలకంగా ఉంది. కేసులు అయినా ఎవరూ భయపడటం లేదు. 

జీఎస్టీ కుంభకోణం కేసులో కీలక పరిణామం.. మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ కు సిఐడి నోటీసులు.?

నిజమా.. ఫేకా అన్నది కాదు.. వైరల్ చేయడమే టార్గెట్ ! 

రాజకీయాల్లో నిజమా.. ఫేకా అన్నదానికి ఇప్పుడు విలువలేదు. ఎంత మంది  ప్రజల్ని నమ్మించగలమన్నదే కీలకం. ప్రభుత్వంపై అపోహలు.. వ్యతిరేకత పెంచగలిగితే ఎలాంటి అవకాశాన్ని అయినా వదలరు. గత ఐదు నెలల కాలంలో  బీఆర్ఎస్ సోషల్ మీడియా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్ని ప్రచారాలు చేసిందో లెక్కే లేదు. కరెంట్ ఉండదన్న దగ్గర నుంచి.. ప్రతి సమస్యనూ భూతద్దంలో చూపించడం ప్రారంభించారు. చివరికి మంత్రులు కూడా స్పందించాల్సి వచ్చింది. అయితే.. బీఆర్ఎస్ సోషల్ మీడియాకు.. తమ సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వెనుకబడిపోయింది. కౌంటర్లు ఇవ్వలేకపోతున్నామని .. అనిపించడంతో .. కొత్తగా టీముల్ని ఎంపిక చేుసకోవాలని అనుకుంటున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో ఇన్నోవేటివ్ ఆలోచనలతో ఉండే.. రాజకీయ వ్యూహకర్త.. సునీల్ కనుగోలును ఈ అంశంలో సంప్రదించారని ఆయన త్వరలోనే లీడ్ తీసుకుంటారని.. కాంగ్రెస్ సోషల్ మీడియా కష్టాలు తీరిపోతాయని అంటున్నారు. అయితే ఇప్పటికైతే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆరోపణలు చేయడం... కాంగ్రెస్ వివరణ ఇచ్చుకోవడంతోనే సరిపోతోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Congress Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
Puducherry Elections 2026: పుదుచ్చేరి ఎన్నికల్లో టీవీకే పార్టీనే గేమ్ ఛేంజర్ - ఓడించేది.. గెలిపించేది విజయే !
పుదుచ్చేరి ఎన్నికల్లో టీవీకే పార్టీనే గేమ్ ఛేంజర్ - ఓడించేది.. గెలిపించేది విజయే !
Telangana CM Revanth : 99 రోజుల ప్రణాళికపై సీఎం రేవంత్ దృష్టి - ఈ కార్యక్రమంతో ఏం సాధించాలనుకుంటున్నారు?
99 రోజుల ప్రణాళికపై సీఎం రేవంత్ దృష్టి - ఈ కార్యక్రమంతో ఏం సాధించాలనుకుంటున్నారు?
TDP Trap: మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?
మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?

వీడియోలు

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolikapudi Srinivasa Rao: నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
Chandrababu in the Assembly: బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
India Condoles Khamenei Death: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
Bookie OTT : మంచు లక్ష్మి కీలక పాత్రలో 'బూకీ' - ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోలీవుడ్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
మంచు లక్ష్మి కీలక పాత్రలో 'బూకీ' - ఓటీటీలోకి వచ్చేస్తోన్న కోలీవుడ్ మూవీ... స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
Citroen Basalt లేదా Kia Syros .. ఇంజిన్, ఫీచర్ల పరంగా ఏ SUV బెటర్? వ్యత్యాసం ఏంటీ
Citroen Basalt లేదా Kia Syros .. ఇంజిన్, ఫీచర్ల పరంగా ఏ SUV బెటర్? వ్యత్యాసం ఏంటీ
Embed widget