అన్వేషించండి

Telangana Investment Politics : రేవంత్ ప్రభుత్వంపై సోషల్ మీడియా ఎటాక్ - బీఆర్ఎస్‌ సైన్యానికి కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వలేకపోతోందా ?

Telangana : బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంతో రేవంత్ సర్కార్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆ ప్రచార ధాటిని తట్టుకోలేక అమెరికా నుంచి అధికారులు కూడా వివరణ వీడియోలు రిలీజ్ చేయాల్సి వస్తోంది.

Telangana Politics :  రాజకీయాల్లో ఇప్పుడు ప్రతిపక్షమంటే రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన పని లేదు. ఆ పని చేయాల్సినప్పుడు చేయవచ్చు..కానీ రోజూ సోషల్  మీడియా ద్వారా ప్రభుత్వంపై విరుచుకుపడవచ్చు. ఈ విషయలో భారత రాష్ట్ర సమితికి ఉన్న  నిర్మాణాత్మక సోషల్  మీడియా సైన్యం ప్రభుత్వంపై ఓ రకమైన యుద్ధం చేస్తోంది. సోషల్ మీడియా సైన్యానికి రూల్స్ ఏమీ ఉండవు. ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలు పెంచడానికి ఎలాంటి వార్త ఉపయోగపడుతుందో.. అలాంటి దాన్ని తెరపైకి తెచ్చి ప్రచారం చేయడమే. ప్రభుత్వం సీరియస్ అయి కేసులు పెడితే అదో అడ్వాంటేజ్ కానీ.. మైనస్‌గా భావించడం లేదు. పలితంగా ప్రభుత్వంపై ఎటాక్ అంతకంతకూ పెరిగిపోతోంది. దీనికి కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ సోషల్ మీడియా బలం సరిపోవడం లేదు. ఆ విషయం స్పష్టంగానే కనిపిస్తోంది. 

రేవంత్ అమెరికా పర్యటనపై ఉద్దృతంగా వ్యతిరేక ప్రచారం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లారు. అధికార, మంత్రుల  బృందంతో ఆయన వెళ్లారు. పెట్టుబడుల ఆకర్షణలో గత పదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత క్రియాశీలకంగా పని చేసిన అధికారి జయేష్ రంజన్. కేటీఆర్ ఎప్పుడు విదేశీ పర్యటనకు వెళ్లినా ఆయనే పక్కన ఉంటారు. మొత్తం పెట్టుబడుల వ్యవహారాలు, ఎంవోయూలు..చర్చలు ఆయన పర్యవేక్షణలో జరుగుతాయని అధికారులు అందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయనకు ప్రాధాన్యం తగ్గలేదు. బీఆర్ఎస్ హయాంలో ఎంత ప్రాధాన్యం ఉందో.. కాంగ్రెస్ హయాంలోనూ అంత కంటే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. తాజాగా రేవంత్ పర్యటనను కూడా ఆయనే సమన్వయ పరుస్తున్నారు. పెట్టుబడుల ప్రతిపాదనలు, ఎంవోయూలను ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు. అయితే స్వచ్చబయో అనే ఓ కంపెనీతో చేసుకున్న ఎంవోయూ వివాదాస్పదమయింది. ఆ కంపెనీ ఇటీవలే ప్రారంభించారని  దానికి రేవంత్ సోదరుడు యజమానికి బీఆర్ఎస్ సోషల్ మీడియా బయట  పెట్టి అసలు రేవంత్ సర్కార్ చేసుకుంటున్న ఒప్పందాలన్నీ ఫేక్ అని ప్రచారం ఉద్దృతంగా చేసింది. దీంతో  జయేష్ రంజన్ స్వయంగా వివరణ ఇస్తూ వీడియో విడుదల చేయాల్సి వచ్చింది. 

నిప్పు లేకుండా పొగ రాదు - బీజేపీ, బీఆర్ఎస్ మధ్య విలీన చర్చలు నిజమేనా ?

క్రమంగా  పెరుగుతున్న వ్యతిరేక ప్రచారం

కేటీఆర్ తమ పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని అత్యంత పటిష్టంగా నిర్మించుకన్నారు. వ్యవస్థీకృతమైన సోషల్ మీడియా విభాగాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉంచుకున్నారు. పార్టీ కోసం విస్తృతంగా సోషల్ మీడియాలో  పని చేసే వారు హైదరాబాద్  లో మాత్రమే కాదు.. ప్రపంచంలో అనేక దేశాల్లో ఉంటారు. వీరందర్నీ కోఆర్డినేట్ చేసే వ్యవస్థను కూడా పకడ్బందీగా నియమించుకున్నారు. అందుకే ఓ అంశాన్ని ట్రెండ్ చేయాలంటే.. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇట్టే చేసేస్తుంది. సోషల్ మీడియా ప్రభావం తెలుసు కాబట్టి.. కేటీఆర్ ఓడపోయిన తర్వాత కూడా సోషల్ మీడియా బలహీనపడకుండా చూసుకుంటున్నారు. దానికి ఇప్పుడు ప్రతిపలం కనిపిస్తోంది . కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చికాకు పెట్టడంలో సోషల్ మీడియా విభాగమే కీలకంగా ఉంది. కేసులు అయినా ఎవరూ భయపడటం లేదు. 

జీఎస్టీ కుంభకోణం కేసులో కీలక పరిణామం.. మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ కు సిఐడి నోటీసులు.?

నిజమా.. ఫేకా అన్నది కాదు.. వైరల్ చేయడమే టార్గెట్ ! 

రాజకీయాల్లో నిజమా.. ఫేకా అన్నదానికి ఇప్పుడు విలువలేదు. ఎంత మంది  ప్రజల్ని నమ్మించగలమన్నదే కీలకం. ప్రభుత్వంపై అపోహలు.. వ్యతిరేకత పెంచగలిగితే ఎలాంటి అవకాశాన్ని అయినా వదలరు. గత ఐదు నెలల కాలంలో  బీఆర్ఎస్ సోషల్ మీడియా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్ని ప్రచారాలు చేసిందో లెక్కే లేదు. కరెంట్ ఉండదన్న దగ్గర నుంచి.. ప్రతి సమస్యనూ భూతద్దంలో చూపించడం ప్రారంభించారు. చివరికి మంత్రులు కూడా స్పందించాల్సి వచ్చింది. అయితే.. బీఆర్ఎస్ సోషల్ మీడియాకు.. తమ సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వెనుకబడిపోయింది. కౌంటర్లు ఇవ్వలేకపోతున్నామని .. అనిపించడంతో .. కొత్తగా టీముల్ని ఎంపిక చేుసకోవాలని అనుకుంటున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో ఇన్నోవేటివ్ ఆలోచనలతో ఉండే.. రాజకీయ వ్యూహకర్త.. సునీల్ కనుగోలును ఈ అంశంలో సంప్రదించారని ఆయన త్వరలోనే లీడ్ తీసుకుంటారని.. కాంగ్రెస్ సోషల్ మీడియా కష్టాలు తీరిపోతాయని అంటున్నారు. అయితే ఇప్పటికైతే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆరోపణలు చేయడం... కాంగ్రెస్ వివరణ ఇచ్చుకోవడంతోనే సరిపోతోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections 2026: అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన DMK.. సీఎం స్టాలిన్ పోటీ చేసేది ఎక్కడంటే..
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
ఏపీ రాజధాని అమరావతిపై చట్ట సవరణ! ట్రెండ్‌ సెట్ చేస్తున్న తీర్మానంపై సమగ్ర విశ్లేషణ!
Bengal Elections 2026: ప్రాంతీయ సెంటిమెంట్‌తో మమత ఎత్తుగడ.. జాతీయవాద మంత్రంతో బీజేపీ ఎదురుదాడి - బెంగాల్‌లో పైచేయి ఎవరిది?
ప్రాంతీయ సెంటిమెంట్‌తో మమత ఎత్తుగడ.. జాతీయవాద మంత్రంతో బీజేపీ ఎదురుదాడి - బెంగాల్‌లో పైచేయి ఎవరిది?
Andhra Pradesh Delimitation Politics: అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ పెనుగండమే - టీడీపీ అడ్వాంటేజ్ తీసుకుంటుందా?

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Iran War Updates: గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులు - కువైట్ ఎయిర్ పోర్టుపై దాడి - విస్తరిస్తున్న యుద్ధం!
Revanth Reddy: అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
అక్కా!మూసీ ప్రాజెక్టుపై వేసిన కేసులు వెనక్కి తీసుకోమని మీ కొడుక్కి చెప్పు! రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్‌!
Family Entertainers : వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
వీకెండ్ ఈ మూవీస్ చూసి ఎంజాయ్ చెయ్యండి - తెలుగు టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఇవే
Telangana: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల జీతంలో 15 శాతం కోత! చట్టాన్ని తీసుకొస్తున్న తెలంగాణ!
Affordable Mileage Cars: రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
రూ. 6 లక్షల ధరలో 6 ఎయిర్‌బ్యాగ్స్.. మీకు ఏ కారు బెస్ట్, వివరాలు చెక్ చేసుకోండి
Rupali Chakankar and Ashok Kharat: కీచకబాబాతో మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సంబంధాలు - పదవి పోయింది!
కీచకబాబాతో మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సంబంధాలు - పదవి పోయింది!
Embed widget