అన్వేషించండి

Telangana Congress: రాహుల్‌ గాంధీకి కోపం వచ్చిందా? గెటవుట్‌ అయ్యే నేతలెవ్వరు?

తెలంగాణ నేతల తీరుపై రాహుల్‌గాంధీకి కోపం వచ్చిందా..? అందుకే ఆయన హెచ్చరించారా..? వరంగల్‌ సభలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని జిల్లాలో చర్చగా మారాయి.

బీజేపీ, టీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉంటే అంతే.. వారితో సంబంధాలు పెట్టున్న వాళ్లను గెట్‌ అవుట్‌ ‌అనేస్తామని చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. వరంగల్‌లో జరిగిన రైతు సంఘర్షణ సభలో పార్టీలో జరుగుతున్న ప్రచారంపై సీరియస్‌గానే వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ రాహుల్‌ గాంధీకి ఎందుకు కోపం వచ్చింది..? ఇంతకీ ఏ లీడర్లకు ఈ వార్నింగ్ అంటూ చర్చించుకుంటున్నారు.

వరంగల్‌ సభలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని జిల్లాలో చర్చగా మారాయి. ‘బీజేపీ, టీఆర్‌ఎస్‌తో టచ్‌లో ఉంటే పార్టీకి రాజీనామా చేసి వాళ్ల కండువా కప్పుకోవచ్చని చెప్పేశారు రాహుల్‌. వాళ్లు వెళ్లకపోతే వెళ్లగొడతామన్నారు. అలాంటి వాళ్లు తమకు అవసరం లేదంటున్నారు రాహుల్‌ గాంధీ. పరుషంగా చేసిన ఈ కామెంట్స్‌ తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో డిబేట్‌గా మారాయి. పార్టీలో ఉంటూ ద్రోహం చేస్తున్న ఆ వ్యక్తులు ఎవరనేది మాట్లాడుకుంటున్నారు నేతలు.  

రాజకీయంగా పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్‌ ఓ ముందడుగు వేసింది. అయితే తెలంగాణ ఏర్పాటైన తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఆ పార్టీకి ఇక్కడ ప్రజలు పట్టం కడతారని భావించినప్పటికీ రెండు సార్లు ప్రతిపక్షానికే పరిమితం చేశారు. మూడోసారి ఎలాగైనా ప్రజలను ఒప్పించాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ఎలాగైనా పాగా వేయాలని దూకుడు పెంచుతుంది.

ఓటు బ్యాంకు పరంగా తెలంగాణలో పటిష్టంగా ఉనప్పటికీ టీఆర్‌ఎస్‌ రాజకీయ వ్యూహాలకు ప్రతివ్యూహాలు వేయడంలో చతికిలపడుతోంది. అయితే ఈ దఫా ఎలాగైనా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేకంగా పోకస్‌ పెట్టింది. రాష్ట్ర కీలక నేతలను దిల్లీకి పిలిపించి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది.

క్షేత్రస్థాయి రిపోర్టులు తెప్పించుకుంది. ప్రజల్లో కాస్త బలం ఉన్నప్పటికీ నేతల మధ్య సమన్వయ లోపం, ఐక్యత లేదని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. అందుకే వరంగల్‌ సభకు వచ్చిన రాహుల్‌ గాంధీ భారీ బహిరంగ సభ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలోనూ రాష్ట్రంలోనూ సంచలనం సృష్టిస్తున్నాయి.

ఇంతకీ టీఆర్‌ఎస్, బీజేపీలతో టచ్‌లో ఉందెవ్వరు..?
‘కాంగ్రెస్‌ పార్టీని ఎవ్వరు ఓడించరు.. ఆ పార్టీలో ఉన్న వారే ఓటమికి కారణమవుతారు..’ ఈ విషయం తెలంగాణలో బాగా ప్రచారంలో ఉంది. బలమైన ఓటు బ్యాంకు ఉండి.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా సెంటిమెంట్‌ కలిసోచ్చే విషయం ఉనప్పటికీ పార్టీ మాత్రం గాడిలో పడటం లేదు. ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని తమకు అనుకూలంగా మార్చుకోకపోతుండగా ఇంటిపోరుతో సతమతం అవుతుంది. ఈ పరిస్థితిలో కొందరు పార్టీ లీడర్లు టీఆర్‌ఎస్, బీజేపీతో టచ్‌లో ఉన్నారనే విషయం తెలుసుకున్న రాహుల్‌... వాళ్లను హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇంతకు ఎవరెవ్వరు టీఆర్‌ఎస్, బీజేపీలతో టచ్‌లో ఉండి పార్టీకి ద్రోహం చేస్తున్నారనే విషయంపై అంతా మాట్లాడుకుంటున్నారు. 

సొంత గూటిని చక్కదిద్దే ప్రయత్నమేనా..?
కాంగ్రెస్‌ పార్టీపై ఇతర పార్టీ నేతల ఆరోపణల కంటే సొంత పార్టీ నేతల వ్యవహరశైలి ఆ పార్టీకి శాపంగా మారుతుంది. 2004 ఎన్నికలకు ముందు రెండు సార్లు ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో ఓటమి పాలైన తర్వాత హస్తిన నేతలు తీసుకున్న కఠిన నిర్ణయాలు, వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి నాయకత్వంలోనే అందరు కలిసి వెళ్లాలని చెప్పిన తీరుతో 2004, 2009 ఎన్నికలోనూ విజయం సాధించింది. ఆ తర్వాత పార్టీపై సరైన దృష్టి పెట్టకపోవడం, గల్లీ నుంచి దిల్లీ స్థాయి వరకు నేతలు ఇష్టారీతిన వ్యవహరించడంతో పార్టీ నష్టపోయింది.

అలాంటి వాటికి ఛాన్స్ ఇవ్వకూడదనుకున్నారేమో క్రమశిక్షణపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రజల్లో తమకు ఉన్న బలంతో అవసరమైతే కొత్తగా వచ్చే నాయకులను ప్రోత్సహించాలే తప్ప పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం చేసే వారిపై ఉపేక్షించే పనిలేదనేది రాహుల్‌ చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా అధికారంలోకి వచ్చేందుకు ముందుగా సొంత గూటిని చక్కదిద్దే పనిలో పడినట్లు తెలుస్తోంది. అవరసరమైతే కఠిన నిర్ణయాలకు వెనుకాడబోమని రాహుల్‌ సంకేతాలు ఇచ్చారు. తెలంగాణలో ఎన్నికలకు ఏడాది కాలం ఉండటంతో ఆ పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయి ఇక్కడ పాగా వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Mavigun Vs Amaravati: అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
Telangana Political Narrative : రేవంత్ అసెంబ్లీ వ్యూహం వేరు.. మంత్రుల దూకుడు వేరు! కాంగ్రెస్‌కు సమన్వయ లోపం చిక్కులు తెచ్చిపెడుతోందా?
రేవంత్ అసెంబ్లీ వ్యూహం వేరు.. మంత్రుల దూకుడు వేరు! కాంగ్రెస్‌కు సమన్వయ లోపం చిక్కులు తెచ్చిపెడుతోందా?
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
JC Prabhakar Reddy Tadipatri Politics: తాడిపత్రి చదరంగం - వైసీపీతో కాదు.. పెద్దారెడ్డితోనే ఫైట్! జేసీ మార్క్ పాలిటిక్స్ వెనుక అసలు కథ ఇదీ
తాడిపత్రి చదరంగం - వైసీపీతో కాదు.. పెద్దారెడ్డితోనే ఫైట్! జేసీ మార్క్ పాలిటిక్స్ వెనుక అసలు కథ ఇదీ

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget