అన్వేషించండి

PM With NDA MPs: రామమందిరాన్నే నమ్ముకోవద్దు- ఫంక్షన్లకు వెళ్లండి- ప్రజలకు చేరువవ్వండి- ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని సూచన

ఎంపీలు తరచుగా తరచూ ప్రజల్లోకి వెళ్లాలని, వారితో మమేకం అవ్వాలని, ప్రజలతో ఎక్కువ సమయం గడపాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ప్రజల మనసును గెలిచిన వారే ఎన్నికల్లో విజయం సాదిస్తారన్నారు.

2024 ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా వరసగా ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల ఎంపీలతో సమావేశం అవుతున్నారు. 2024లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ఎంపీలకు ప్రధాని మోదీ పలు సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌ ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. రామమందిరం మినహా.. ఇతర సమస్యలపై ఎంపీలు దృష్టి సారించాలని సూచించారు. తరచూ ప్రజల్లోకి వెళ్లాలని, వారితో మమేకం అవ్వాలని, ప్రజలతో ఎక్కువ సమయం గడపాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.  

2024 లోక్‌సభ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌ (NDA)లో 38 పార్టీలకు చెందిన 430 మంది ఎంపీలతో ప్రధాని మోదీ వరుసగా సమావేశాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  ఎన్డీఏలోని 430 మంది ఎంపీలను బీజేపీ 11 గ్రూపులుగా విభజించింది. వారితో జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ ఉత్తర ప్రదేశ్, బ్రజ్, కాన్పూర్, బుందేల్ ఖండ్  ప్రాంతాలకు చెందిన ఎంపీలతో మోదీ సమావేశమయ్యారు. 

ప్రజల మనసును గెలిచిన వారే ఎన్నికల్లో గెలుస్తారని ప్రధాని చెప్పినట్లు తెలుస్తోంది. ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని స్థానిక సమస్యలపై మాట్లాడాలని, వివాహాలు, ఫంక్షలు ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలకు వెళ్లాలని ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది. 2024 విన్నింగ్ మంత్రను ఎంపీలకు వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లో కోపం ఎక్కువగా ఉంటుందని, వారితో మాట్లాడాలని, పరిస్థితులను వివరించాలని, కోపంతో ఉన్న వారితో ఎక్కువ సమయం మాట్లాడి వారిని ఒప్పించాలని సూచించారు.  

ఎంపీలతో సమావేశంలో యూపీఏపై విమర్శలు గుప్పించారు ప్రధాని. యూపీఏ స్వార్థం గురించి ఆలోచిస్తే,, ఎన్డీఏ సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తుందన్నారు. యూపీఏ మాదిరి కాకుండా ఎన్డీఏ త్యాగాలకు సిద్ధంగా ఉంటుందన్నారు. ఇందుకు బిహార్ పొలిటికల్ చిత్రాన్ని ఉదహరించారు. బీజేపీ కంటే నితిష్ కుమార్‌కు ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నా ఆయన్ను ముఖ్యమంత్రిని చేశామని అన్నారు. అయితే నితీష్ కుమార్ సంకీర్ణాన్ని కాదని ప్రతిపక్షాలతో చేరారని అన్నారు. అలాగే పంజాబ్ పరిస్థితిని సైతం ఉదహరించారు. పంజాబ్‌లోని అకాలీదళ్‌తో ప్రభుత్వంలో ఎన్డీఏకు మంచి సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, ఉపముఖ్యమంత్రి పదవిని అడగలేదని చెప్పారు. 

రేపు దక్షిణాది ఎంపీలతో మోదీ సమావేశం
వరుస సమావేశాల్లో భాగంగా బుధవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌ల నుంచి 96 మంది ఎంపీలతో ప్రధాని భేటీ అవుతారు. ఎన్డీఏ లక్ష్యాలు, ఎన్నికల వ్యూహాలు వివరిస్తారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహా పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశాల్లో భాగం కానున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌ (NDA)లో 38 పార్టీలకు చెందిన 430 మంది ఎంపీలను 11 గ్రూపులుగా విడదీసి విడి విడిగా సమావేశం అవుతున్నారు. రానున్న ఎన్నికల్లో అధికారమే ఎజెండగా ఎన్డీఏ మిత్ర పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం, వారిని సమన్వయం చేసుకోవడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Congress Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
Puducherry Elections 2026: పుదుచ్చేరి ఎన్నికల్లో టీవీకే పార్టీనే గేమ్ ఛేంజర్ - ఓడించేది.. గెలిపించేది విజయే !
పుదుచ్చేరి ఎన్నికల్లో టీవీకే పార్టీనే గేమ్ ఛేంజర్ - ఓడించేది.. గెలిపించేది విజయే !
Telangana CM Revanth : 99 రోజుల ప్రణాళికపై సీఎం రేవంత్ దృష్టి - ఈ కార్యక్రమంతో ఏం సాధించాలనుకుంటున్నారు?
99 రోజుల ప్రణాళికపై సీఎం రేవంత్ దృష్టి - ఈ కార్యక్రమంతో ఏం సాధించాలనుకుంటున్నారు?
TDP Trap: మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?
మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?

వీడియోలు

Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam
Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Eng 2nd Semi Final: సంజూ సెంచరీ మిస్.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ రికార్డ్ స్కోరు.. ఇంగ్లాండ్‌కు బిగ్ టార్గెట్
సంజూ సెంచరీ మిస్.. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ రికార్డ్ స్కోరు.. ఇంగ్లాండ్‌కు బిగ్ టార్గెట్
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
India Condoles Khamenei Death: ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
ఖమేనీ మృతిపై తొలిసారి స్పందించిన భారత్.. సంతాపం తెలిపిన విదేశాంగ శాఖ
AP 10th Hall Tickets: ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
ఏపీ టెన్త్ క్లాస్ హాల్‌ టికెట్లు విడుదల.. వాట్సాప్‌లో ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి
Operation Decapitation: ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
ట్రాఫిక్ కెమెరాల హ్యాకింగ్ నుండి బంకర్ బస్టర్ల వరకు.. ఖమేనీ అంతం వెనుక CIA, మోసాద్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్!
Mrithyunjay OTT : మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మృత్యుంజయ్ ఓటీటీ ప్లాట్ ఫాం ఫిక్స్ - ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Speaker chit chat: వైసీపీ సభ్యులు సభకు వస్తేనే మసాలా - జగన్ జీతం తీసుకోవడం లేదు - స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు
వైసీపీ సభ్యులు సభకు వస్తేనే మసాలా - జగన్ జీతం తీసుకోవడం లేదు - స్పీకర్ అయ్యన్న కీలక వ్యాఖ్యలు
Embed widget