అన్వేషించండి

PM With NDA MPs: రామమందిరాన్నే నమ్ముకోవద్దు- ఫంక్షన్లకు వెళ్లండి- ప్రజలకు చేరువవ్వండి- ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని సూచన

ఎంపీలు తరచుగా తరచూ ప్రజల్లోకి వెళ్లాలని, వారితో మమేకం అవ్వాలని, ప్రజలతో ఎక్కువ సమయం గడపాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ప్రజల మనసును గెలిచిన వారే ఎన్నికల్లో విజయం సాదిస్తారన్నారు.

2024 ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా వరసగా ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల ఎంపీలతో సమావేశం అవుతున్నారు. 2024లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలనే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ఎంపీలకు ప్రధాని మోదీ పలు సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌ ఎంపీలతో ఆయన సమావేశమయ్యారు. రామమందిరం మినహా.. ఇతర సమస్యలపై ఎంపీలు దృష్టి సారించాలని సూచించారు. తరచూ ప్రజల్లోకి వెళ్లాలని, వారితో మమేకం అవ్వాలని, ప్రజలతో ఎక్కువ సమయం గడపాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.  

2024 లోక్‌సభ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌ (NDA)లో 38 పార్టీలకు చెందిన 430 మంది ఎంపీలతో ప్రధాని మోదీ వరుసగా సమావేశాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  ఎన్డీఏలోని 430 మంది ఎంపీలను బీజేపీ 11 గ్రూపులుగా విభజించింది. వారితో జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ ఉత్తర ప్రదేశ్, బ్రజ్, కాన్పూర్, బుందేల్ ఖండ్  ప్రాంతాలకు చెందిన ఎంపీలతో మోదీ సమావేశమయ్యారు. 

ప్రజల మనసును గెలిచిన వారే ఎన్నికల్లో గెలుస్తారని ప్రధాని చెప్పినట్లు తెలుస్తోంది. ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని స్థానిక సమస్యలపై మాట్లాడాలని, వివాహాలు, ఫంక్షలు ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలకు వెళ్లాలని ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది. 2024 విన్నింగ్ మంత్రను ఎంపీలకు వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లో కోపం ఎక్కువగా ఉంటుందని, వారితో మాట్లాడాలని, పరిస్థితులను వివరించాలని, కోపంతో ఉన్న వారితో ఎక్కువ సమయం మాట్లాడి వారిని ఒప్పించాలని సూచించారు.  

ఎంపీలతో సమావేశంలో యూపీఏపై విమర్శలు గుప్పించారు ప్రధాని. యూపీఏ స్వార్థం గురించి ఆలోచిస్తే,, ఎన్డీఏ సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తుందన్నారు. యూపీఏ మాదిరి కాకుండా ఎన్డీఏ త్యాగాలకు సిద్ధంగా ఉంటుందన్నారు. ఇందుకు బిహార్ పొలిటికల్ చిత్రాన్ని ఉదహరించారు. బీజేపీ కంటే నితిష్ కుమార్‌కు ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నా ఆయన్ను ముఖ్యమంత్రిని చేశామని అన్నారు. అయితే నితీష్ కుమార్ సంకీర్ణాన్ని కాదని ప్రతిపక్షాలతో చేరారని అన్నారు. అలాగే పంజాబ్ పరిస్థితిని సైతం ఉదహరించారు. పంజాబ్‌లోని అకాలీదళ్‌తో ప్రభుత్వంలో ఎన్డీఏకు మంచి సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, ఉపముఖ్యమంత్రి పదవిని అడగలేదని చెప్పారు. 

రేపు దక్షిణాది ఎంపీలతో మోదీ సమావేశం
వరుస సమావేశాల్లో భాగంగా బుధవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌ల నుంచి 96 మంది ఎంపీలతో ప్రధాని భేటీ అవుతారు. ఎన్డీఏ లక్ష్యాలు, ఎన్నికల వ్యూహాలు వివరిస్తారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహా పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశాల్లో భాగం కానున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌ (NDA)లో 38 పార్టీలకు చెందిన 430 మంది ఎంపీలను 11 గ్రూపులుగా విడదీసి విడి విడిగా సమావేశం అవుతున్నారు. రానున్న ఎన్నికల్లో అధికారమే ఎజెండగా ఎన్డీఏ మిత్ర పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం, వారిని సమన్వయం చేసుకోవడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో జూలై 31 నుంచి ఆగస్టు 10 వరకు ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Janmabhoomi Express Timings: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Venkatesh : వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌కు ఈక్వెల్ ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌కు ఈక్వెల్ ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
Lionel Messi Vs Revanth Reddy: లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌

వీడియోలు

సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్
USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janmabhoomi Express Timings: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Venkatesh : వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌కు ఈక్వెల్ ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌కు ఈక్వెల్ ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
Lionel Messi Vs Revanth Reddy: లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
Akhanda 2 First Day Collection : బాలీవుడ్ మూవీ 'ధురంధర్'నే బీట్ చేసిన 'అఖండ 2' - బాక్సాఫీస్ వద్ద బాలయ్య రికార్డుల తాండవం
బాలీవుడ్ మూవీ 'ధురంధర్'నే బీట్ చేసిన 'అఖండ 2' - బాక్సాఫీస్ వద్ద బాలయ్య రికార్డుల తాండవం
Ozempic Launched in India: మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త! ఓజెంపిక్ అమ్మకాలు ప్రారంభం; ధర, ప్రయోజనాలు తెలుసుకోండి
మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త! ఓజెంపిక్ అమ్మకాలు ప్రారంభం; ధర, ప్రయోజనాలు తెలుసుకోండి
Ponduru Khadi GI Tag: పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
Lionel Messi Statue :మెస్సీ భారీ విగ్రహం కోల్‌కతాలో ఆవిష్కరణ; బాలీవుడ్‌ హీరోలా ఉందని సోషల్ మీడియాలో విమర్శలు
మెస్సీ భారీ విగ్రహం కోల్‌కతాలో ఆవిష్కరణ; బాలీవుడ్‌ హీరోలా ఉందని సోషల్ మీడియాలో విమర్శలు
Embed widget