అన్వేషించండి

Mrps: ఏపీలో ఎన్డీయే కూటమికి ఎమ్మార్పీఎస్ మద్దతు - 35 అంశాలతో చంద్రబాబుకు మందకృష్ణ మాదిగ వినతి

Andhrapradesh News: ఏపీలో ఎన్డీయే కూటమికి మద్దతిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఆదివారం ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యి 35 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.

Mrps Mandakrishna Madiga Meet Chandrababu: సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చేందుకు ఎమ్మార్పీఎస్ నిర్ణయించిందని అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) తెలిపారు. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబుతో (Chandrababu) ఆయనతో సహా ఎమ్మార్పీఎస్ (Mrps) నేతలు ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ, మాదిగలకు రాజకీయ ప్రాధాన్యతపై చర్చించారు. టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు దృష్టికి తెచ్చారు. అలాగే, వైసీపీ ప్రభుత్వం దళితులకు రద్దు చేసిన పథకాలు తిరిగి ప్రారంభించాలని బాబును కోరారు. దాదాపు 35 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. 'కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటి సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలి. రాజ్యాంగ బద్ద సంస్థల్లో మాదిగ వర్గానికి తగు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే అన్ని కార్పొరేషన్లలో, నామినేటెడ్ పదవుల్లో తమ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలి.' అని చంద్రబాబును కోరారు.

టీడీపీ గెలుపుతోనే..

టీడీపీతో మాదిగలది శాశ్వత బంధమని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి మాదిగలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. '40 ఏళ్లుగా పార్టీని మాదిగ సామాజికవర్గం ఆదరిస్తోంది. అలాంటి మాదిగ వర్గాన్ని పైకి తెచ్చేందుకు టీడీపీ ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుంది. టీడీపీ గెలుపు మాదిగల గెలుపు అవుతుంది. ప్రభుత్వంపై తెలుగుదేశం ఎంత గట్టిగా పోరాడుతుందో.. అంతకంటే గట్టిగా ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తోంది. మాదిగ సామాజిక వర్గాన్ని అధికారంలో భాగస్వాములను చేస్తాం. దళితులపై వైసీపీ ప్రభుత్వ దమనకాండను ఎదుర్కోవడంలో మందకృష్ణ పోరాటం అభినందనీయం.' అని చంద్రబాబు పేర్కొన్నారు.

సీఎం జగన్ పై విమర్శలు

మాదిగలను ఆకాంక్షలను టీడీపీ అధినేత చంద్రబాబు ముందుంచామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ప్రాధాన్యతలో అవన్నీ నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు. వర్గీకరణ విషయంలో జగన్ మాదిగలను మోసం చేశారని.. సుప్రీంకోర్టులో వర్గీకరణ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేటును కూడా పెట్టలేదని విమర్శించారు. మాదిగల సంక్షేమాన్ని జగన్ గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. మాదిగలంతా వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం పని చేస్తారని స్ఫష్టం చేశారు. ఈ నెల 30న గుంటూరులో ఎన్నికల ప్రచార సరళిపై రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. గ్రామ స్థాయి నుంచి ఇంటింటికీ వెళ్లి కూటమి గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించారు. 'కేంద్రంలో మోదీపై, రాష్ట్రంలో చంద్రబాబుపై మాకు నమ్మకం ఉంది. మాదిగలకు రాజకీయ ప్రాతినిథ్యం కల్పిస్తామని బాబు హామీ ఇచ్చారు. 29 రిజర్వుడ్ సీట్లలో మాదిగలకు జగన్ కేవలం 10 స్థానాలు మాత్రమే ఇస్తే.. చంద్రబాబు టీడీపీ పోటీ చేసే 24లో 14 మాదిగలకు కేటాయించారు. జనసేన పోటీ చేసే రిజర్వుడ్ స్థానాలు మూడింటిలో ఒకటి మాదిగలకు ఇవ్వాలని పవన్ ను కోరుతాం. ఎన్డీయే కూటమి గెలుపు మాదిగల గెలుపగా భావిస్తాం.' అని మందకృష్ణ పేర్కొన్నారు.

ఆశావహుల క్యూ

మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి ఆదివారం ఆశావహులు క్యూ కట్టారు. ఆఖరి జాబితాలో తమకు టిక్కెట్ కేటాయించేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ డేగల ప్రభాకర్ ను వెంటబెట్టుకుని చంద్రబాబును కలిశారు. అటు, కంది చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని విజయనగరం లోక్ సభ కోసం పరిశీలించాలని మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి కోరారు. భీమిలి టికెట్ కోసం కోరాడ రాజబాబు ప్రయత్నిస్తున్నారు.

Also Read: Svsn Varma: 'పవన్ కల్యాణ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం' - 3 పార్టీలు సమన్వయంతో పని చేసేందుకు ప్రణాళిక సిద్ధమన్న టీడీపీ ఇంఛార్జీ వర్మ

టాప్ హెడ్ లైన్స్

Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Mavigun Vs Amaravati: అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
అమరావతి స్థానంలో మావిగన్ సాధ్యమేనా? జగన్ గెలిచినా పేరు కూడా మార్చలేరా?
Telangana Political Narrative : రేవంత్ అసెంబ్లీ వ్యూహం వేరు.. మంత్రుల దూకుడు వేరు! కాంగ్రెస్‌కు సమన్వయ లోపం చిక్కులు తెచ్చిపెడుతోందా?
రేవంత్ అసెంబ్లీ వ్యూహం వేరు.. మంత్రుల దూకుడు వేరు! కాంగ్రెస్‌కు సమన్వయ లోపం చిక్కులు తెచ్చిపెడుతోందా?
Modi Cabinet Reshuffle: పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!
పార్లమెంట్‌కు ముందే మోదీ క్యాబినెట్ రీసెట్.. రాజ్యాంగ సవరణల వేళ అసలు వ్యూహం ఇదే!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Chicken Leg Roast : నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
నోరూరించే చికెన్ లెగ్ రోస్ట్ రెసిపీ, ఈ మసాలాతో టేస్ట్ డబుల్.. అన్నం, రోటీతో అదిరిపోతుందంతే
Bengaluru Daycare Child Abuse: బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
బెంగళూరు క్యాప్‌జెమిని డేకేర్ సెంటర్‌లో చిన్నారులకు నరకం.. ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Embed widget