అన్వేషించండి

Mrps: ఏపీలో ఎన్డీయే కూటమికి ఎమ్మార్పీఎస్ మద్దతు - 35 అంశాలతో చంద్రబాబుకు మందకృష్ణ మాదిగ వినతి

Andhrapradesh News: ఏపీలో ఎన్డీయే కూటమికి మద్దతిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఆదివారం ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యి 35 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.

Mrps Mandakrishna Madiga Meet Chandrababu: సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చేందుకు ఎమ్మార్పీఎస్ నిర్ణయించిందని అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) తెలిపారు. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబుతో (Chandrababu) ఆయనతో సహా ఎమ్మార్పీఎస్ (Mrps) నేతలు ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ, మాదిగలకు రాజకీయ ప్రాధాన్యతపై చర్చించారు. టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు దృష్టికి తెచ్చారు. అలాగే, వైసీపీ ప్రభుత్వం దళితులకు రద్దు చేసిన పథకాలు తిరిగి ప్రారంభించాలని బాబును కోరారు. దాదాపు 35 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. 'కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటి సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలి. రాజ్యాంగ బద్ద సంస్థల్లో మాదిగ వర్గానికి తగు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే అన్ని కార్పొరేషన్లలో, నామినేటెడ్ పదవుల్లో తమ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలి.' అని చంద్రబాబును కోరారు.

టీడీపీ గెలుపుతోనే..

టీడీపీతో మాదిగలది శాశ్వత బంధమని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి మాదిగలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. '40 ఏళ్లుగా పార్టీని మాదిగ సామాజికవర్గం ఆదరిస్తోంది. అలాంటి మాదిగ వర్గాన్ని పైకి తెచ్చేందుకు టీడీపీ ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుంది. టీడీపీ గెలుపు మాదిగల గెలుపు అవుతుంది. ప్రభుత్వంపై తెలుగుదేశం ఎంత గట్టిగా పోరాడుతుందో.. అంతకంటే గట్టిగా ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తోంది. మాదిగ సామాజిక వర్గాన్ని అధికారంలో భాగస్వాములను చేస్తాం. దళితులపై వైసీపీ ప్రభుత్వ దమనకాండను ఎదుర్కోవడంలో మందకృష్ణ పోరాటం అభినందనీయం.' అని చంద్రబాబు పేర్కొన్నారు.

సీఎం జగన్ పై విమర్శలు

మాదిగలను ఆకాంక్షలను టీడీపీ అధినేత చంద్రబాబు ముందుంచామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ప్రాధాన్యతలో అవన్నీ నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు. వర్గీకరణ విషయంలో జగన్ మాదిగలను మోసం చేశారని.. సుప్రీంకోర్టులో వర్గీకరణ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేటును కూడా పెట్టలేదని విమర్శించారు. మాదిగల సంక్షేమాన్ని జగన్ గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. మాదిగలంతా వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం పని చేస్తారని స్ఫష్టం చేశారు. ఈ నెల 30న గుంటూరులో ఎన్నికల ప్రచార సరళిపై రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. గ్రామ స్థాయి నుంచి ఇంటింటికీ వెళ్లి కూటమి గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించారు. 'కేంద్రంలో మోదీపై, రాష్ట్రంలో చంద్రబాబుపై మాకు నమ్మకం ఉంది. మాదిగలకు రాజకీయ ప్రాతినిథ్యం కల్పిస్తామని బాబు హామీ ఇచ్చారు. 29 రిజర్వుడ్ సీట్లలో మాదిగలకు జగన్ కేవలం 10 స్థానాలు మాత్రమే ఇస్తే.. చంద్రబాబు టీడీపీ పోటీ చేసే 24లో 14 మాదిగలకు కేటాయించారు. జనసేన పోటీ చేసే రిజర్వుడ్ స్థానాలు మూడింటిలో ఒకటి మాదిగలకు ఇవ్వాలని పవన్ ను కోరుతాం. ఎన్డీయే కూటమి గెలుపు మాదిగల గెలుపగా భావిస్తాం.' అని మందకృష్ణ పేర్కొన్నారు.

ఆశావహుల క్యూ

మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి ఆదివారం ఆశావహులు క్యూ కట్టారు. ఆఖరి జాబితాలో తమకు టిక్కెట్ కేటాయించేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ డేగల ప్రభాకర్ ను వెంటబెట్టుకుని చంద్రబాబును కలిశారు. అటు, కంది చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని విజయనగరం లోక్ సభ కోసం పరిశీలించాలని మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి కోరారు. భీమిలి టికెట్ కోసం కోరాడ రాజబాబు ప్రయత్నిస్తున్నారు.

Also Read: Svsn Varma: 'పవన్ కల్యాణ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం' - 3 పార్టీలు సమన్వయంతో పని చేసేందుకు ప్రణాళిక సిద్ధమన్న టీడీపీ ఇంఛార్జీ వర్మ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Tanikella Bharani: నూతన నటీనటులకు తనికెళ్ల భరణి సినిమా ఛాన్స్ - ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అప్లై చేసుకోండి!
నూతన నటీనటులకు తనికెళ్ల భరణి సినిమా ఛాన్స్ - ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అప్లై చేసుకోండి!
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RR vs CSK Match Highlights IPL 2025 | చెన్నై పై 6 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం | ABP DesamDC vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ | ABP DesamRR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Tanikella Bharani: నూతన నటీనటులకు తనికెళ్ల భరణి సినిమా ఛాన్స్ - ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అప్లై చేసుకోండి!
నూతన నటీనటులకు తనికెళ్ల భరణి సినిమా ఛాన్స్ - ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అప్లై చేసుకోండి!
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
IPL 2025 SRH VS DC Result Update: స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
Peddi Movie Glimpse: రామ్ చరణ్ 'పెద్ది' నుంచి మరో అప్ డేట్ - గ్లింప్స్ వచ్చేది ఎప్పుడో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది' నుంచి మరో అప్ డేట్ - గ్లింప్స్ వచ్చేది ఎప్పుడో తెలుసా?
IPL 2025 RR VS CSK Result Update: రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
Embed widget