అన్వేషించండి

Mrps: ఏపీలో ఎన్డీయే కూటమికి ఎమ్మార్పీఎస్ మద్దతు - 35 అంశాలతో చంద్రబాబుకు మందకృష్ణ మాదిగ వినతి

Andhrapradesh News: ఏపీలో ఎన్డీయే కూటమికి మద్దతిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఆదివారం ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యి 35 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.

Mrps Mandakrishna Madiga Meet Chandrababu: సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చేందుకు ఎమ్మార్పీఎస్ నిర్ణయించిందని అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) తెలిపారు. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబుతో (Chandrababu) ఆయనతో సహా ఎమ్మార్పీఎస్ (Mrps) నేతలు ఆదివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ, మాదిగలకు రాజకీయ ప్రాధాన్యతపై చర్చించారు. టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎం.ఎస్.రాజుకు అవకాశం కల్పించాలని చంద్రబాబు దృష్టికి తెచ్చారు. అలాగే, వైసీపీ ప్రభుత్వం దళితులకు రద్దు చేసిన పథకాలు తిరిగి ప్రారంభించాలని బాబును కోరారు. దాదాపు 35 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. 'కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొట్టమొదటి సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలి. రాజ్యాంగ బద్ద సంస్థల్లో మాదిగ వర్గానికి తగు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే అన్ని కార్పొరేషన్లలో, నామినేటెడ్ పదవుల్లో తమ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలి.' అని చంద్రబాబును కోరారు.

టీడీపీ గెలుపుతోనే..

టీడీపీతో మాదిగలది శాశ్వత బంధమని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయానికి మాదిగలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. '40 ఏళ్లుగా పార్టీని మాదిగ సామాజికవర్గం ఆదరిస్తోంది. అలాంటి మాదిగ వర్గాన్ని పైకి తెచ్చేందుకు టీడీపీ ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుంది. టీడీపీ గెలుపు మాదిగల గెలుపు అవుతుంది. ప్రభుత్వంపై తెలుగుదేశం ఎంత గట్టిగా పోరాడుతుందో.. అంతకంటే గట్టిగా ఎమ్మార్పీఎస్ పోరాటం చేస్తోంది. మాదిగ సామాజిక వర్గాన్ని అధికారంలో భాగస్వాములను చేస్తాం. దళితులపై వైసీపీ ప్రభుత్వ దమనకాండను ఎదుర్కోవడంలో మందకృష్ణ పోరాటం అభినందనీయం.' అని చంద్రబాబు పేర్కొన్నారు.

సీఎం జగన్ పై విమర్శలు

మాదిగలను ఆకాంక్షలను టీడీపీ అధినేత చంద్రబాబు ముందుంచామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ప్రాధాన్యతలో అవన్నీ నెరవేరుస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు. వర్గీకరణ విషయంలో జగన్ మాదిగలను మోసం చేశారని.. సుప్రీంకోర్టులో వర్గీకరణ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేటును కూడా పెట్టలేదని విమర్శించారు. మాదిగల సంక్షేమాన్ని జగన్ గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. మాదిగలంతా వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం పని చేస్తారని స్ఫష్టం చేశారు. ఈ నెల 30న గుంటూరులో ఎన్నికల ప్రచార సరళిపై రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. గ్రామ స్థాయి నుంచి ఇంటింటికీ వెళ్లి కూటమి గెలుపు కోసం ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించారు. 'కేంద్రంలో మోదీపై, రాష్ట్రంలో చంద్రబాబుపై మాకు నమ్మకం ఉంది. మాదిగలకు రాజకీయ ప్రాతినిథ్యం కల్పిస్తామని బాబు హామీ ఇచ్చారు. 29 రిజర్వుడ్ సీట్లలో మాదిగలకు జగన్ కేవలం 10 స్థానాలు మాత్రమే ఇస్తే.. చంద్రబాబు టీడీపీ పోటీ చేసే 24లో 14 మాదిగలకు కేటాయించారు. జనసేన పోటీ చేసే రిజర్వుడ్ స్థానాలు మూడింటిలో ఒకటి మాదిగలకు ఇవ్వాలని పవన్ ను కోరుతాం. ఎన్డీయే కూటమి గెలుపు మాదిగల గెలుపగా భావిస్తాం.' అని మందకృష్ణ పేర్కొన్నారు.

ఆశావహుల క్యూ

మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి ఆదివారం ఆశావహులు క్యూ కట్టారు. ఆఖరి జాబితాలో తమకు టిక్కెట్ కేటాయించేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ డేగల ప్రభాకర్ ను వెంటబెట్టుకుని చంద్రబాబును కలిశారు. అటు, కంది చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని విజయనగరం లోక్ సభ కోసం పరిశీలించాలని మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి కోరారు. భీమిలి టికెట్ కోసం కోరాడ రాజబాబు ప్రయత్నిస్తున్నారు.

Also Read: Svsn Varma: 'పవన్ కల్యాణ్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం' - 3 పార్టీలు సమన్వయంతో పని చేసేందుకు ప్రణాళిక సిద్ధమన్న టీడీపీ ఇంఛార్జీ వర్మ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?

వీడియోలు

The RajaSaab Trailer 2.O Reaction | Prabhas తో తాత దెయ్యం చెడుగుడు ఆడేసుకుంది | ABP Desam
KTR No Respect to CM Revanth Reddy | సభానాయకుడు వచ్చినా KTR నిలబడకపోవటంపై సోషల్ మీడియాలో చర్చ | ABP Desam
BCCI Clarity about Team India Test Coach | టెస్ట్ కోచ్ పై బీసీసీఐ క్లారిటీ
India Women Record in T20 | శ్రీలంకపై భారత్ విజయం
Rishabh Pant out Of India vs New Zealand | రిషబ్ పంత్ కు షాక్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
హైదరాబాద్‌లో ఉత్కంఠ రేపుతున్న ఆపరేషన్ చబూతర్! పక్కా వ్యూహాలతో ఆకతాయిలకు చెక్!
Amaravati Latest News: అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
అమరావతిలో చనిపోయిన రైతు కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలి! CRDA ముందు సిపిఎం ధర్నా
Case against heroine Madhavilatha: షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
షిరిడి సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు - హీరోయిన్ మాధవీలతపై కేసు - నోటీసులు జారీ
Silver Price : గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
గంటలో 21వేలు పడిపోయిన వెండి రేటు - ముందు ముందు అలాగే ఉంటుందా?
iBOMMA Ravi : 'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
'నా పేరు రవి... ఐ బొమ్మ రవి కాదు' - ఏదైనా కోర్టులో తేల్చుకుంటా... iBOMMA రవి రియాక్షన్
Araku Special Trains: అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
అరకు వెళ్ళడానికి సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్‌ వేసిన రైల్వేశాఖ; టైమింగ్స్ ఇవే
Bandi Sanjay: ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
ప్రతి హిందువు, భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా అఖండ తాండవం - బండి సంజయ్ ప్రశంస
Peddi Movie : రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది'లో సర్ప్రైజ్ - ఈ లుక్ చూస్తే అస్సలు గుర్తు పట్టలేం... ఎవరో తెలుసా?
Embed widget