అన్వేషించండి

AP MLC Elections : ఒక్క ఓటుతో జాతకాల తారుమారు - ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ !

ఏపీలో శాసన మండలి ఎన్నికల ఉత్కంఠ ఏడు స్థానాల కోసం బరిలో ఎనిమిది మందివైసీపీ తరపున ఒక్కరు క్రాస్ ఓటు చేసినా టీడీపీకి సీటుఎవరైనా గైర్హాజర్ అయినా, చెల్లని ఓటు వేసినా కష్టమేఎన్నికల్లో ఏం జరగబోతోంది ?

AP MLC Elections :  గురువారం ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుననాయి. మెత్తం ఏడు స్దానాలకు 8మంది అభ్యర్దులు పోటీ పడుతున్నారు.  ఎన్నిక రాజకీయం రసవత్తరంగా మారింది.అధికార ప్రతి పక్షాల మధ్య రాజకీయం హైలైట్ గా మారింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకూ అసెంబీలి కమిటి హాలులో జరగనున్న ఓటింగ్ తరువాత  సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. వెంటనే ఫలితాలు తెలుస్తాయి. 

టీడీపీ తరపున బరిలో పంచుమర్తి అనూరాధ ! 

వైసీపీ నుంచి ఏడుగురు, టీడీపీ నుంచి ఒకరు నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ నుంచి బరిలో  జయమంగళ వెంకట రమణ,- మర్రి రాజశేఖర్, చంద్రగిరి ఏసురత్నం, బొమ్మి ఇజ్రాయిల్, కోలా గురువులు, పోతుల సునీత, పెనుమత్స సూర్యనారాయరాజు ఉన్నారు. టీడీపీ నుంచి బరిలో లోకి విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ తెర మీదకు వచ్చారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఎన్నికల పై  దిశా నిర్దేశం చేసిన అధికార,  ప్రతిపక్ష పార్టీలు  ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇరు పార్టీలకు కీలకంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు, అసంతృప్తి ఎమ్మెల్యేల ఓటు కీలకంగా మారింది. మరో వైపున అసంతృప్తి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు, మంత్రులు సైతం రంగంలోకి దిగారు. 

వైసీపీ ఎమ్మెల్యేలంతా విజయవాడలోనే మకాం ! 

ముత్తం శాసన సభ్యులు   విజయవాడలోనే ఉన్నారు. కీలక ఎమ్మెల్యేలకు, మంత్రులకు పూర్తి బాధ్యతలు  అప్పగించారు. ఒక్కో శాసన మండలి సభ్యుడి బాధ్యతను 22మంది ఎమ్మెల్యేలకు అప్పగించారు. అప్పగించిన సభ్యులతో ఓటు వేయించే బాధ్యత మంత్రులదే  అని   సీఎం  జగన్ తెలిపారు. రెండు రోజుల  క్రితం  అసెంబ్లీ వేదికగా  నాలుగు సార్లు మాక్ పోల్ నిర్వహించారు. మరో సారి కూడా ఎలా ఓటు వెయ్యాలి  అనే అంశంపై శాసన సభ్యులకు మంత్రులు,ఇ తర కీలక నేతలు దిశా నిర్దేశం చేయనున్నారు. ఎవరికి కేటాయించిన గ్రూప్ సభ్యులతో వారు విడివిడిగా సమావేశాల నిర్వహిస్తున్నారు.
 
పంచుమర్తి అనురాధ నామినేషన్‌తో మారిన సీన్ ! 

తెలుగు దేశం పార్టీ ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల్లో అనూహ్యంగా మూడు స్దానాలను దక్కించుకుంది. దీంతో ఆ పార్టీ నేతల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. అదే ఊపులో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కూడా తెలుగు దేశం పార్టి అభ్యర్దీని నిలబెట్టింది.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తి ఎమ్మెల్యేల ఓటింగ్ పై కూడ అనుమానాలు తలెత్తున్నాయి. అధికార పార్టీకి చెందిన నేతలు పూర్తిగా ఎన్నికల పైనే దృష్టి పెట్టారు. తెలుగు దేశం మూడు స్దానాలు కైవసం చేసుకోవటంతో తీవ్రంగా ఖంగుతిన్న వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టి ఆ తరవాత జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో పై చేయి సాదించేందుకు అలర్ట్ అయ్యింది.  

ఒక్క ఓటుతో మారిపోనున్న ఓ అభ్యర్థి జాతకం !
 
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓట్ చేసినా… చెల్లని ఓటు వేసినా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ గెలుస్తారు. అధికార పార్టీలో కొంత మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు బయట పడ్డారు. అలా జిల్లాకు ఒకరు చొప్పున సైలెంట్ గా ఉంటున్న ఎమ్మెల్యేల విషయంలో ఇంటిలిజెన్స్‌ వర్గాలు కూడా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి చేరవేసినట్లు తెలుస్తుంది. దీంతో ఏడో స్థానం విషయంలో ఆయన టెన్షన్ పడిపోతున్నారు. సీఎం జగన్‌ ఒక్కో మంత్రికి 22 మంది ఎమ్మెల్యేలను అప్పగించి ఏడుగురుతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. సభ్యులందరికీ మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఓటు ఎలా వేయాలన్న దానిపై అవగాహన కల్పిస్తున్నారు. ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనుమానంగా ఉన్న వారితో ప్రత్యేకంగా మాట్లాడుతన్నారు. పొరపాటున ఎవరైనా దారి తప్పిదే అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జగన్ పట్టు జారిపోయిందన్న అభిప్రాయం కల్పిస్తుంది. అందుకే వైసీపీ అప్రమత్తమయింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Asia cup 2025 Team India: ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించిన BCCI.. శ్రేయాస్ అయ్యర్ ఔట్, గిల్‌కు ప్రమోషన్.. తిలక్ వర్మకు ఛాన్స్
ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించిన BCCI.. శ్రేయాస్ అయ్యర్ ఔట్, గిల్‌కు ప్రమోషన్.. తిలక్ వర్మకు ఛాన్స్
Viveka case Supreme Court: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - నిందితులందరికీ మళ్లీ జైలు తప్పదా?
వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - నిందితులందరికీ మళ్లీ జైలు తప్పదా?
AP Rains Alert: తీరం దాటిన వాయుగుండం, ఏపీలో 24 గంటలపాటు భారీ వర్షాలు- అప్రమత్తమైన అధికారులు
తీరం దాటిన వాయుగుండం, ఏపీలో 24 గంటలపాటు భారీ వర్షాలు- అప్రమత్తమైన అధికారులు
VN Aditya: షూటింగులు ఆపితే అడుక్కు తినాలి... కార్మికుల ఆకలి బాధలపై మాట్లాడరే? - నాయకులపై వీఎన్ ఆదిత్య ఫైర్
షూటింగులు ఆపితే అడుక్కు తినాలి... కార్మికుల ఆకలి బాధలపై మాట్లాడరే? - నాయకులపై వీఎన్ ఆదిత్య ఫైర్
Advertisement

వీడియోలు

Indi Alliance Candidate B Sudershan Reddy | ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి | ABP Desam
Adilabad Tribals Vetti Festival | కొలాం ఆదివాసీలు ఎక్కడున్నా..ఏడాదిలో ఓసారి ఇలా చేస్తారు | ABP Desam
Vijay Devarakonda Rashmika in Newyork | ఇండియన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ లో వైరల్ జంట | ABP Desam
Sri Krishna Janmashtami Tragedy | హైదరాబాద్ శ్రీకృష్ణ శోభాయాత్రలో తీవ్ర విషాదం | ABP Desam
Asia Cup 2025 Surya Kumar Yadav | కెప్టెన్ గా రాణిస్తున్నా..ఆటగాడిగా ఫెయిల్ అవుతున్న SKY | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Asia cup 2025 Team India: ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించిన BCCI.. శ్రేయాస్ అయ్యర్ ఔట్, గిల్‌కు ప్రమోషన్.. తిలక్ వర్మకు ఛాన్స్
ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించిన BCCI.. శ్రేయాస్ అయ్యర్ ఔట్, గిల్‌కు ప్రమోషన్.. తిలక్ వర్మకు ఛాన్స్
Viveka case Supreme Court: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - నిందితులందరికీ మళ్లీ జైలు తప్పదా?
వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - నిందితులందరికీ మళ్లీ జైలు తప్పదా?
AP Rains Alert: తీరం దాటిన వాయుగుండం, ఏపీలో 24 గంటలపాటు భారీ వర్షాలు- అప్రమత్తమైన అధికారులు
తీరం దాటిన వాయుగుండం, ఏపీలో 24 గంటలపాటు భారీ వర్షాలు- అప్రమత్తమైన అధికారులు
VN Aditya: షూటింగులు ఆపితే అడుక్కు తినాలి... కార్మికుల ఆకలి బాధలపై మాట్లాడరే? - నాయకులపై వీఎన్ ఆదిత్య ఫైర్
షూటింగులు ఆపితే అడుక్కు తినాలి... కార్మికుల ఆకలి బాధలపై మాట్లాడరే? - నాయకులపై వీఎన్ ఆదిత్య ఫైర్
Future city Master Plan: 765 చ.కి.మీ విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ, మాస్టర్ ప్లాన్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, ప్రత్యేకతలు ఇవే
765 చ.కి.మీ విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ, మాస్టర్ ప్లాన్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, ప్రత్యేకతలు ఇవే
Free Bus For Women: ఏపీలో మహిళలకు అలర్ట్.. ఉచిత బస్సు ప్రయాణానికి ఆ కార్డు చెల్లదు
ఏపీలో మహిళలకు అలర్ట్.. ఉచిత బస్సు ప్రయాణానికి ఆ కార్డు చెల్లదు
Sasivadane Release Date: గోదారి నేపథ్యంలో అందమైన ప్రేమకథ... రక్షిత్, కోమలి సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
గోదారి నేపథ్యంలో అందమైన ప్రేమకథ... రక్షిత్, కోమలి సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Atchannaidu: ఏపీలో యూరియా కొరత, రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్‌న్యూస్
ఏపీలో యూరియా కొరత, రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు గుడ్‌న్యూస్
Embed widget