అన్వేషించండి

YSRCP Seema Tension: కృష్ణా బోర్డు కోసం కర్నూలు వాసుల పోరాటం - ధర్మదీక్షలకు పిలుపు ! వైఎస్ఆర్‌సీపీకి మరో టెన్షన్ తప్పదా ?

వైఎస్ఆర్‌సీపీకి కర్నూలు సెంటిమెంట్ ఇబ్బందికరంగా మారుతోంది. కృష్ణాబోర్డు కోసం రాయలసీమ ఉద్యమ సంఘాలు ధర్మదీక్ష లకు పిలుపునిచ్చాయి.


 
YSRCP Seema Tension :  ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీకి ఇప్పుడు రాయలసీమ సెంటిమెంట్ రివర్స్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. న్యాయరాజధాని అంశంపై సుప్రీంకోర్టులో చేసిన వాదనలు, జ్యూడిషియల్ అకాడమీని అమరావతికి తరలించడంతో  పాటు తాజాగా కేఆర్ఎంబీ విషయంలోనూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ధర్మదీక్ష పేరుతో రాయలసీమకు న్యాయం చేయాలని కొన్ని సంఘాలు ఉద్యమబాట పట్టడం చర్చనీయాంశమవుతోంది. 

కెఆర్‌ ఎంబి కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో ధర్మదీక్ష 
 
రాష్ట్ర విభజన చట్టం 2014 ప్రకారం ఏర్పాటైన కృష్ణా రివర్‌ మేనేజ్‌ మెంట్‌ బోర్డు కార్యాలయం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంది. గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డును తెలంగాణకు.. కృష్ణాబోర్డును ఏపీకి కేటాయించారు. ఈ బోర్డు కార్యాలయాన్ని విశాఖకు తరలించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.  కృష్ణానదిపై కీలకమైన ప్రాజెక్టు ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాం తంలో కాకుండా కృష్ణాజలాలకు సంబంధం లేని విశాఖపట్టణంలో కెఆర్‌ ఎంబి కార్యాలయం ఏర్పాటు చేయడమేమిటన్న వాదన  రాయలసీమ వాసులలో వినిపిస్తోంది. అందుకే కెఆర్‌ ఎంబి కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో చేస్తున్న ఆందోళనల పరంపరంలో భాగంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 18న నంద్యాల జిల్లా కలెక్టరేట్‌ వద్ద భారీ ఎత్తున ధర్మదీక్ష నిర్వహించనున్నారు. 

కృష్ణా జలాల వివాద పరిష్కారానికి కృష్ణా బోర్డు ! 

కృష్ణా జలాల పంపకంలో ఎలాంటి వివాదాలు రాకుండా రాష్ట్ర విభ జన చట్టం 2014 కృష్ణా రివర్‌ మేనేజిమెంట్‌ బోర్డు కెఆర్‌ఎంబి అనే సాధికార వ్యవస్ధ రూపకల్పనకు నిర్దేశించింది. కారణా లేవైనా రాష్ట్ర ప్రభుత్వం బోర్డును విశాఖపట్టణం లో ఏర్పాటు చేయాలని గత ఏడాది సిఫార్సు చేయడంతో వి వాదం మొదలైంది. మొత్తం కృష్ణాజలాల వినియోగానికి సం బంధించిన అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతానికి చెందిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉండగా, బో ర్డు ప్రధాన కార్యాలయాన్ని కృష్ణా జలాలతో సంబంధం లేని విశాఖపట్టణంలో ఏర్పాటు చేయడమేమిటని రాయలసీమ ఉద్యమవాదులు ప్రశ్నిస్తున్నారు. ఒకవిధంగా కృష్ణా జలాలకు సంబంధించిన వివాదమనే ఫుట్‌బాల్‌ ఆట రాయలసీ మలో జరుగుతుండగా, దగ్గరుండి పర్యవేక్షించాల్సిన రెఫరీ వంటి బోర్డు ఎక్కడో వైజాగ్‌లో ఉండడమేమిటని రాయల సీమవాదులు ప్రశ్నిస్తున్నారు.  పలురకాల ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు చేసిన రాయలసీమ సాగునీటి సాధన సమితి, అటు ముఖ్యమంత్రి కార్యాలయానికి, ఇటు బోర్డు ఛైర్మన్‌కు లేఖలు కూడా రాసిం ది.
 
వైఎస్ఆర్‌సీపీ నేతల నుంచి కొరవడిన స్పందన ! 

వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల, కృష్ణా జిల్లాకు చెందిన రైతు సంఘాల నాయకులు కూడా కర్నూలులో బోర్డును పెట్టాలంటున్నారు.  శ్రీభాగ్‌ ఒడం బడికను అమలు చేయాలనే డిమాండ్‌తో 2022 డిసెంబర్‌ 5న కర్నూలులో నిర్వహించిన సీమ గర్జన సభలో పాల్గొన్న రా యలసీమ ప్రజాప్రతినిధులు పలువురు కర్నూలులో కృష్ణా బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను సమర్ధించారు. తమ వంతు ప్రయత్నంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని ప్రకటించారు. అయితే ఎలాంటి ముందడుగు పడలేదు. దీంతో  నంద్యాల జిల్లా కలెక్టరేట్‌ వద్ద రాయలసీమ ధర్మదీక్ష పేరుతో భారీ ఎత్తున ప్రదర్శన ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి నిర్ణయించింది. కర్నూలులోని కృష్ణా బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో నిర్వహించే ఈ కార్యక్రమం లో అన్ని రాజకీయ పార్టీల, రైతుసంఘాల, ప్రజాసంఘాల ప్ర తినిధులు, రాయలసీమ నలుమూలల నుంచి రాయలసీమ వాదులు పాల్గొంటారని  చెబుతున్నారు. 

కర్నూలుకు అన్యాయం జరుగుతోందన్న భావన !

కర్నూలు ప్రభుత్వం న్యాయరాజధాని ఇస్తున్నట్లుగా ప్రకటించింది. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. న్యాయరాజధాని ఆలోచన విరమించుకున్నామని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలియచేయడం సంచలనం సృష్టించింది. తర్వాత జ్యూడిషియల్ అకాడమీని కర్నూలులో ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించి.. జీవో ఇచ్చి చివరి క్షణంలో మార్చారు. ఇప్పుడు కేఆర్ఎంబీని కూడా విశాఖుక తరలిస్తున్నారు. ఇవన్నీ వివాదాస్పదమవుతున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Modi Cabinet Reshuffle 2026: కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?
కేంద్ర కేబినెట్ విస్తరణ - విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవుట్? జెన్‌జీని మోదీ చల్లబరుస్తారా?
SIR In Telangana: తెలంగాణలో నేటి నుంచి SIR ప్రక్రియ ప్రారంభం! ఇలా చేస్తేనే మీ ఓటు భద్రం!
తెలంగాణలో నేటి నుంచి SIR ప్రక్రియ ప్రారంభం! ఇలా చేస్తేనే మీ ఓటు భద్రం!
Kadapa Steel Plant History: కడప స్టీల్ ప్లాంట్‌కు ఇంకెన్ని సార్లు శంకుస్థాపనలు? బ్రాహ్మణి నుండి JSW వరకు.. చంద్రబాబు తాజా ప్లాన్ ఏంటి?
కడప స్టీల్ ప్లాంట్‌కు ఇంకెన్ని సార్లు శంకుస్థాపనలు? బ్రాహ్మణి నుండి JSW వరకు.. చంద్రబాబు తాజా ప్లాన్ ఏంటి?
Janasena Leaders Communication Gap: జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేల వాయిస్ ఎందుకు వినిపించడం లేదు ? పవన్ ఆగ్రహం వెనుక అసలు కారణం ఏమిటి?
జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేల వాయిస్ ఎందుకు వినిపించడం లేదు ? పవన్ ఆగ్రహం వెనుక అసలు కారణం ఏమిటి?

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
Indian Passport Controversy:SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
Breaking News:గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
SEBI New Rules 2026: 5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!
5 లక్షల ఫాలోవర్స్‌ ఉంటే మీరు సెలబ్రిటీనే! సెబీ నుంచి బిగ్ అప్‌డేట్‌!
Indian Passport Fee Hike 2026: జులై 1 నుంచి పెరగనున్న పాస్‌పోర్ట్ ధరలు! ఏ కేటగిరీకి ఎంత రుసుం? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
జులై 1 నుంచి పెరగనున్న పాస్‌పోర్ట్ ధరలు! ఏ కేటగిరీకి ఎంత రుసుం? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!
Embed widget