అన్వేషించండి

Telangana BJP: బీజేపీ వరుస విజయాల సీక్రెట్ కిషన్ రెడ్డి - తెర ముందు, తెర వెనుక వ్యూహాల్లో మాస్టర్ !

Telangana BJP: తెలంగాణలో వరుస బీజేపీ విజయాల వెనుక కిషన్ రెడ్డి మార్క్ కనిపిస్తోంది. అటు కేంద్ర మంత్రిగా ఇటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఆయన మంచి విజయాలు అందుకుంటున్నారు.

Kishan Reddy: " ఎవరైనా గట్టిగా కొడతారు.. లేకపోతే గురి చూసి కొడతారు.. ఈయనేంట్రా పద్దతిగా అంటు కట్టినట్లుగా కొట్టాడు" అని ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఇది ప్రస్తుత తెలంగాణ రాజకీయాలలో  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. తెలంగాణలో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు బీజేపీ గెల్చుకుంది. అభ్యర్థుల ఎంపిక నుంచి.. పోలింగ్ లో ఓట్లు వేయించుకునే వ్యూహం వరకూ తనదైన వ్యూహాలతో నడిపించిన కిషన్ రెడ్డి సైలెంట్ గా కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బకొట్టారు. అధికారంలో ఉన్న  పార్టీ నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీని గెలుచుకోవడం అంటే చిన్న విషయం కాదు. కానీ ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో బీజేపీని బలోపేతం చేయడమే కాదు... సానుభూతి పరుల్ని ఓటర్లుగా మార్చే వ్యూహంలో కిషన్ రెడ్డి తనదైన నాయకత్వాన్ని చూపించారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలించిన కిషన్ రెడ్డి వ్యూహం  

తెలంగాణలో బీజేపీకి ప్రజల మద్దతు పూర్తి స్థాయిలో లభిస్తోందని దాన్ని ఓట్లుగా మార్చుకునే మెకానిజాన్ని కిషన్ రెడ్డి ఓ ప్లాన్ ప్రకారం ఏర్పాటు చేసుకుంటూ పోయారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తాయని తెలిసిన వెంటనే.. కార్యాచరణ ప్రారంభించారు. పట్టభద్రుల నియోజకవర్గం నాలుగు ఉత్తర తెలంగాణ ఉమ్మడి జిల్లాల్లో ఉంటుంది. అంటే టీచర్స్ నియోజవర్గాలు రెండింటిని కలుపుకుంటే 13 జిల్లా, 42 అసెంబ్లీ స్థానాలు, 270 మండలాలు, ఆరు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగాయి. అన్ని చోట్లా ప్రతి గ్రాడ్యూయేట్, టీచర్ ఓటర్‌ను చేరేలా పకడ్బందీ ప్రచార ప్రణాళికను .. ప్రతి ఒక్క ఓటర్‌ను మూడు, నాలుగు సార్లు కలిసేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి కిషన్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ వ్యూహాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకోలేకపోయింది.. చేధించలేకపోయిందని.. ఫలితాలను బట్టి అర్థమవుతోంది. టీచర్స్ నియోజకవర్గంలో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే కొమురయ్య గెలిచారు.  పట్టబద్రుల నియోజకవర్గంలో అత్యంత హోరాహోరీగా జరిగినా ఓట్లు చీల్చే వ్యూహాలను కాంగ్రెస్ పార్టీ పాటించినా బీజేపీ విజయాన్ని ఆపలేకపోయారు. 

కిషన్ రెడ్డి నాయకత్వం పుష్ప వికాసం  

అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరోసారి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డికి .. ఆ ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో సమయం సరిపోలేదు. ఓ వైపు కేంద్ర మంత్రిగా ఈశాన్య రాష్ట్రాల గురించి పట్టించుకుంటూనే తెలంగాణలో ఎన్నికలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయిపప్పటికీ.. పార్టీ ఒక్క అసెంబ్లీ స్థానం నుంచి ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు చేరింది. ఓటు బ్యాంక్ 14 శాతానికి చేరింది. అంతకు ముందు ఈ ఓటు బ్యాంక్ ఆరు శాతం వరకే ఉండేది. ఈ ఉత్సాహంతో కిషన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలపై గురి పెట్టారు. ఐదు నెలల్లోనే పార్టీని ఆయన బలోపేతం చేశారు. మోదీ చరిష్మాను ఉపయోగించుకుని .. లోక్ సభ ఎన్నికల్లో గరిష్టంగా సీట్లు తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఎనిమిది పార్లమెంట్ సీట్లలో బీజేపీ తిరుగులేని విజయం సాధించింది. రెండు, మూడు చోట్ల మినహా అన్ని చోట్ల రెండో స్థానంలో నిలిచింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంక్ 35 శాతానికి పెరిగింది. అంటే అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా ఉంది. లోక్ సభ ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వచ్చిన మెజార్టీలు చూస్తే.. 40 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 

పద్దతైన రాజకీయంతోనే  పదునైన విజయాలు

భారతీయ జనతా పార్టీలో కింది స్థాయి నుంచి ఎదిగిన నేత కిషన్ రెడ్డి. ఆయనకు పార్టీ భావజాలంపై, విధానాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది. ఏ మాత్రం పార్టీ లైన్ దాటరు. ఇప్పటి వరకూ ఆయన వివాదాస్పదంగా చేసిన ఒక్క ప్రకటన ఉండదు. అలాగని పార్టీ విధానాలను బలంగా చెప్పలేదన్న అభిప్రాయం కూడా ఉండదు. బీజేపీ ఐడియాలజీని ఎంత బలంగా చెబుతారంటే..ఆయన మాటల్ని ఎవరూ వివాదాస్పదం చేయలేరు. అలాంటి రాజకీయంతోనే బీజేపీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. ఇతర నేతలపై పరుషంగా మాట్లాడితేనో.. తిట్లందుకుంటేనో వార్తల్లో ఉంటామని.. దాని వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. అందుకే ఎప్పుడు అలాంటి రాజకీయం చేయరు. కానీ రాజకీయంగా ఎప్పుడూ పార్టీ విధానాలు, భావజాలం విషయంలో రాజీపడరు. తెలంగాణ బీజేపీకి అలాంటి పునాదులు వేసిన కిషన్ రెడ్డి .. ఇప్పుడు విజయాల పరంపరంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. 

కిషన్ రెడ్డిపై జాతీయ నాయకత్వం నమ్మకం

తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడంలో కిషన్ రెడ్డి స్టైల్ ను జాతీయ నాయకత్వాన్ని కూడా  ఆకర్షించింది. అందుకే పార్టీ పరంగా అయినా పాలన పరంగా అయినా కీలకమైన బాధ్యతల్ని అప్పగిస్తూ వస్తున్నారు. మొదటగా కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ చేశారు కానీ కొద్ది కాలానికే ఆయనకు కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ లభించింది. ఐదుగురు సహాయ మంత్రులు కిషన్ రెడ్డి శాఖలను చూసేందుకు ఉండేవారు. వెంటనే మరోసారి మోదీ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. కిషన్ రెడ్డి పనితీరుపై నమ్మకంతోనే కేంద్రమంత్రిగా ఉంటూనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కూడా కొనసాగించారు. మామూలుగా అయితే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. పార్టీ పరమైన బాధ్యతల నుంచి విముక్తి చేస్తారు. రెండింటికి న్యాయం చేయలేరని అనుకుంటారు. కానీ కిషన్ రెడ్డి పనితీరుపై కేంద్ర పెద్దలకు ఉన్న నమ్మకం వల్ల ఆయనను కొనసాగించారు. గతంలో అమిత్ షా మాత్రమే జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా కొనసాగారు. ప్రధాని మోదీతో కలిసి కింది స్థాయి నుంచి కలిసి పని చేశారు కిషన్ రెడ్డి. ఆయన నిజాయితీ, కష్టపడే తర్వాత మోదీకి బాగా తెలుసు. జాతీయ నాయకత్వం మద్దతుతో కిషన్ రెడ్డి తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తున్నారు. 

పదవులు కాదు పార్టీ బలోపేతమే కిషన్ రెడ్డి టార్గెట్

కిషన్ రెడ్డి దశాబ్దాల రాజకీయంలో అధికారంలో పదవులు చేపట్టింది చాలా తక్కువ. పార్టీ కార్యకర్త, పార్టీ నేతగానే ఎక్కువగా పని చేస్తూ వచ్చారు. తెలంగాణలో పార్టీ బలోపేతం వెనుక కిషన్ రెడ్డి వేసిన పునాదులే కీలకం. ఇప్పుడు ఆయనే తెలంగాణలో బీజేపీని అజేయశక్తిగా మారుస్తున్నారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే.. బీజేపీదే విజయం అన్నంతగా తెచ్చారు. ఇప్పుడు బీజేపీ ఎదురుచూస్తోంది.. పోరాడుతోంది.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసమే. ఈ విజయం వెనుక కిషన్ రెడ్డి ముద్ర చాలా బలంగా కనిపిస్తుంది. అందులో సందేహం ఉండదు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget